ఏపిలో విచిత్రం.. వేతనాలకు డబ్బుల్లేవ్, పథకాలకు కొదవ లేదు

అసలే లోటు బడ్జెట్. ఆపై కేంద్రం నుంచి ఏమాత్రం సహకారం లేదు. మరి పరిస్థితి ఎలా ఉంటుంది? పైసా పైసాకూ వెతుక్కునే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ప్రాణాంతక వైరస్ కరోనా ఎంట్రీతో ఏపీతో పాటు మొత్తం దేశమంతా లాక్ డౌన్. ఉన్న రాబడి భారీగా తగ్గితే… అంతోఇంతో ఆదుకుంటుందనుకున్న కేంద్రానికి రాబడి తగ్గిపోయింది.

ఫలితంగా సంక్షేమ పథకాలకు నిధుల లోటు ఓ రేంజిలో పెరిగిపోయింది. ఉద్యోగులకు సరిగ్గా జీతాలివ్వలేని పరిస్థితి. ఈ తరహా పరిస్థితితో దేశంలోని అన్ని రాష్ట్రాలు కిందామీదా పడిపోతున్నాయి. అయితే ఏపీలో ఈ తరహా పరిస్థితి లేదు. పనిచేసే ఉద్యోగులకు సగానికి సగం వేతనాలను ఆపేసిన జగన్ సర్కారు… సంక్షేమ పథకాలకు మాత్రం ఏ లోటూ రాకుండా చూసుకుుటోంది. అంతేనా… ఉద్యోగులకు సరిగ్గా జీతాలివ్వలేని పరిస్థితుల్లో ఏకంగా సున్నా వడ్డీ పేరిట కొత్త పథకాలను కూడా లాంచ్ చేసేసింది.

ఈ పరిస్థితి నిజంగానే ఆసక్తి రేకెత్తించేదే. ఎందుకంటే… ఏ సర్కారు అయినా, ఏ పరిశ్రమ అయినా… తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇచ్చిన తర్వాత మిగిలిన దానిలో నుంచే సంక్షేమ పథకాలను ప్రవేశపెడతాయి. అమలు చేస్తాయి కూడా. అయితే అందుకు విరుద్ధంగా కరోనా వేళ రాబడి అంతా తగ్గిపోతే… ఆ కారణాన్ని చూపిన జగన్ సర్కారు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను సగానికి సగం తగ్గించేసి చెల్లించింది.

మిగిలిన సగాన్ని ఎప్పుడు ఇస్తామన్న విషయాన్ని కూడా జగన్ సర్కారు చెప్పలేదు. సరే.. పరిస్థితి దయనీయంగా ఉన్న సమయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ఎందుకనుకున్నారో? ఏమో తెలియదు గానీ… ఉద్యోగులు కూడా జగన్ సర్కారుకు మద్దతుగా నిలిచారు. కిక్కురుమనకుండానే సగం వేతనాలతోనే సరిపెట్టుకున్నారు.

ఇక్కడిదాకా బాగానే ఉన్నా… ఉద్యోగుల వేతనాలను పూర్తి స్థాయిలో చెల్లించేందుకు డబ్బుల్లేవని చెప్పిన జగన్ సర్కారు… తాను ఇదివరకే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఏమాత్రం నిధులు తగ్గించడం లేదు. సరే… ఎప్పుడో ప్రారంభమైపోయిన సంక్షేమ పథకాలు ఆపినా.. ఆయా వర్గాలు ఇబ్బందిపడతాయన్న వాదనతో ఎలాగోలా నిధులు సర్దుబాటు చేసినా… ఇటీవలే వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం అంటూ మరో సంక్షేమ పథకానికి జగన్ సర్కారు శ్రీకారం చుట్టింది. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్దీ కింద రుణాలు ఇప్పించేందుకు, ఇదివరకే ఇచ్చిన రుణాలకు వడ్డీ కింద మొన్న ఏకంగా రూ.1,400 కోట్లను విడుదల చేశారు.

ఉద్యోగుల వేతనాలకే డబ్బుల్లేవంటూ సాగిన జగన్ సర్కారు… కరోనా వేళ ఉద్యోగులకు సగం వేతనాలిచ్చి…ఇలా కొత్తగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం అవసరమా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఉద్యోగుల వేతనాల్లో కోతలతో మిగిలిన డబ్బుతోనే ఈ పథకానికి నిధులు సర్దారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే… ఈ తరహా ద్వంద్వ వైఖరిపై అటు ఉద్యోగ సంఘాలు కూడా కిక్కురుమనకపోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోందని చెప్పక తప్పదు.

This post was last modified on April 27, 2020 6:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 hours ago