బండ్ల గణేష్ సినిమాల్లో ఉన్నా.. రాజకీయాల్లో ఉన్నా.. రెండూ మానేసి తన వ్యాపారమేదో తాను చేసుకుంటున్నా.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. రెండేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీలో చేరి అతను చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
కాంగ్రెస్ పార్టీని ఆకాశానికెత్తేస్తూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విమర్శలు గుప్పిస్తూ మీడియాలో బాగానే హైలైట్ అయ్యాడు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే 7 ఓ క్లాక్ బ్లేడుతో గొంతు కోసుకుంటానంటూ బండ్ల చేసిన కామెంట్ ఎంత చర్చనీయాంమైందో తెలిసిందే. ఐతే అంత చేసినా అతడికి టికెట్ మాత్రం రాలేదు.
కట్ చేస్తే ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి ఘోర పరాభవం చవిచూసింది. కొంత కాలానికే రాజకీయాలకు దండం పెట్టేసి సైలెంటైపోయాడు బండ్ల. ఐతే ఇప్పుడు రూట్ మార్చి కొన్ని రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రిని ఆకాశానికెత్తేస్తూ ట్వీట్ల మీద ట్వీట్లు వేస్తున్నాడు.
రోజు రోజుకూ కేసీఆర్ భజనం శ్రుతి మించిపోతుండగా.. దీనిపై కౌంటర్లు పడుతున్నా బండ్ల ఆగట్లేదు. అంతటితో ఊరుకోకుండా సినిమా వాళ్లను కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ ని తేడా లేకుండా అందరు హీరోలనూ ఆకాశానికెత్తేస్తున్నాడు.
తాజాగా బండ్ల వ్యవహారం చూస్తే మహేష్ బాబును ప్రత్యేకంగా టార్గెట్ చేశాడనిపిస్తోంది. మహేష్ మీద రోజుకో ట్వీట్ వేస్తున్నాడు బండ్ల. నిన్నేమో మహేష్ ఓ కార్యక్రమంలో నవ్వుతున్న వీడియో పెట్టి.. ‘కల్మషం లేని నవ్వు.. లవ్యూ సార్’ అంటూ ఓ ట్వీట్ వేశాడు.
ఈ రోజేమో.. మహేస్ ఓ ఆడియో వేడుకలో దండం పెడుతున్న ఫొటో పెట్టి ‘నీ సంస్కారానికి నా వందనం’ అంటూ మహేష్ను ట్యాగ్ చేశాడు. మూడు రోజుల కిందట కూడా మహేష్కు కూతురు సితార హెడ్ మసాజ్ చేస్తున్న ఫొటో పెట్టి ‘ఘట్టమనేని వారి రక్త సంబంధం చూడముచ్చటగా ఉంది’ అంటూ ఓ కామెంట్ చేశాడు.
బండ్ల మిగతా హీరోల్ని కూడా పొగుడుతూ ట్వీట్లు వేస్తున్నాడు కానీ.. మహేష్ భజన అయితే ఓ రేంజిలో ఉంది. మళ్లీ నిర్మాతగా రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న బండ్ల మహేష్ను దువ్వుతున్నాడా అనే సందేహాలు కలుగుతున్నాయి అతడి భజన చూస్తుంటే.
This post was last modified on April 27, 2020 5:30 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…