ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హోదాను మరిచిపోయి.. సందర్భం చూసుకోకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రతిసారీ వ్యక్తిగత విమర్శలే చేస్తుంటారు. పదేళ్లుగా ఆయనది ఒకటే పాట.. కార్లను మార్చినట్లు పెళ్లాలను మారుస్తాడు పవన్ అని. పవన్కు అయింది మూడు పెళ్లిళ్లే అయినా.. ఇంకొకటి కలిపి నాలుగు పెళ్లిళ్లు అంటూ కామెంట్ చేసేస్తుంటారాయన. స్కూల్ పిల్లలతో జరిగిన సమావేశంలోనూ పవన్ పెళ్లిళ్ల వ్యవహారం గురించి మాట్లాడడం జగన్కే చెల్లింది.
ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ తగ్గట్లేదు. దీంతో విసిగి వేసారిపోయిన పవన్.. ఆ మధ్య తెలుగుదేశంతో పొత్తు తర్వాత ఆ పార్టీతో కలిసి నిర్వహించిన తొలి ఉమ్మడి సభలో జగన్కు వేసిన పంచ్ చర్చనీయాంశం అయింది. తనకు అయింది మూడు పెళ్లిళ్లు అయితే.. నాలుగో పెళ్లాం గురించి జగన్ మాట్లాడతాడని.. నా నాలుగో పెళ్లాం నువ్వేనా రా అంటూ పవన్ చేసిన కామెంట్ హాట్ టాపిక్గా మారింది. దీన్ని అందిపుచ్చుకుని జనసైనికులు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. జగన్ని నాలుగో పెళ్లాం.. వదినమ్మ అంటూ.. ఒక రేంజిలో ట్రోల్ చేశారు. టిట్ ఫర్ టాట్ అంటూ జగన్కు ఆయన భాషలోనే పవన్ భలే సమాధానం ఇచ్చాడంటూ ఆయనపై ప్రశంసలు కురిశాయి. కానీ ఆ తర్వాత కూడా జగన్ మారలేదు. ఇప్పుడు కూడా ఎన్నికల ప్రచార సభల్లో పవన్ ప్రస్తావన వచ్చినపుడల్లా పెళ్లిళ్ల వ్యవహారమే మాట్లాడుతున్నారు. దీంతో పవన్ మరోసారి జగన్కు పంచ్ ఇచ్చాడు.
ఇంతకుముందు జగన్ను నాలుగో పెళ్లాం అన్న పవన్.. ఈసారి ‘పరదాల మహరాణి’ అంటూ కొత్త బిరుదు ఇచ్చాడు. పరదాల మహరాణిని కాకినాడ ఆదిత్య కాలేజీ విద్యార్థులు పాపం ఇబ్బంది పెట్టారంటూ జగన్కు వ్యతిరేకంగా అక్కడ జరిగిన నినాదాలు చేసిన విషయాన్ని పవన్ ప్రస్తావించాడు. ఐతే రాష్ట్రాన్నేలే పరదాల మహరాణి కక్ష పెట్టేసుకుంటుందని.. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని పవన్ సూచించడం గమనార్హం. ఈ కామెంట్స్లో ‘పరదాల మహరాణి’ అనే మాటను తీసుకుని జనసైనికులు మరోసారి జగన్ను గట్టిగా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…