ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హోదాను మరిచిపోయి.. సందర్భం చూసుకోకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రతిసారీ వ్యక్తిగత విమర్శలే చేస్తుంటారు. పదేళ్లుగా ఆయనది ఒకటే పాట.. కార్లను మార్చినట్లు పెళ్లాలను మారుస్తాడు పవన్ అని. పవన్కు అయింది మూడు పెళ్లిళ్లే అయినా.. ఇంకొకటి కలిపి నాలుగు పెళ్లిళ్లు అంటూ కామెంట్ చేసేస్తుంటారాయన. స్కూల్ పిల్లలతో జరిగిన సమావేశంలోనూ పవన్ పెళ్లిళ్ల వ్యవహారం గురించి మాట్లాడడం జగన్కే చెల్లింది.
ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ తగ్గట్లేదు. దీంతో విసిగి వేసారిపోయిన పవన్.. ఆ మధ్య తెలుగుదేశంతో పొత్తు తర్వాత ఆ పార్టీతో కలిసి నిర్వహించిన తొలి ఉమ్మడి సభలో జగన్కు వేసిన పంచ్ చర్చనీయాంశం అయింది. తనకు అయింది మూడు పెళ్లిళ్లు అయితే.. నాలుగో పెళ్లాం గురించి జగన్ మాట్లాడతాడని.. నా నాలుగో పెళ్లాం నువ్వేనా రా అంటూ పవన్ చేసిన కామెంట్ హాట్ టాపిక్గా మారింది. దీన్ని అందిపుచ్చుకుని జనసైనికులు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. జగన్ని నాలుగో పెళ్లాం.. వదినమ్మ అంటూ.. ఒక రేంజిలో ట్రోల్ చేశారు. టిట్ ఫర్ టాట్ అంటూ జగన్కు ఆయన భాషలోనే పవన్ భలే సమాధానం ఇచ్చాడంటూ ఆయనపై ప్రశంసలు కురిశాయి. కానీ ఆ తర్వాత కూడా జగన్ మారలేదు. ఇప్పుడు కూడా ఎన్నికల ప్రచార సభల్లో పవన్ ప్రస్తావన వచ్చినపుడల్లా పెళ్లిళ్ల వ్యవహారమే మాట్లాడుతున్నారు. దీంతో పవన్ మరోసారి జగన్కు పంచ్ ఇచ్చాడు.
ఇంతకుముందు జగన్ను నాలుగో పెళ్లాం అన్న పవన్.. ఈసారి ‘పరదాల మహరాణి’ అంటూ కొత్త బిరుదు ఇచ్చాడు. పరదాల మహరాణిని కాకినాడ ఆదిత్య కాలేజీ విద్యార్థులు పాపం ఇబ్బంది పెట్టారంటూ జగన్కు వ్యతిరేకంగా అక్కడ జరిగిన నినాదాలు చేసిన విషయాన్ని పవన్ ప్రస్తావించాడు. ఐతే రాష్ట్రాన్నేలే పరదాల మహరాణి కక్ష పెట్టేసుకుంటుందని.. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని పవన్ సూచించడం గమనార్హం. ఈ కామెంట్స్లో ‘పరదాల మహరాణి’ అనే మాటను తీసుకుని జనసైనికులు మరోసారి జగన్ను గట్టిగా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో.
This post was last modified on April 21, 2024 4:50 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…