కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా తన అన్న సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా పేరు చెప్పకుండానే.. చెల్లెళ్లకు ఇవ్వాల్సిన ఆస్తి వాటాను కూడా.. గిఫ్ఠ్ ఇచ్చినట్టుగా భావిస్తారని షర్మిల అన్నారు. శనివారం కడప పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన షర్మిల.. అనంతరం ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. దీనిలో తన అన్న సీఎం జగన్కు తాను రూ.82 కోట్ల రూపాయల అప్పు ఉన్నానని షర్మిల తెలిపారు.
అదేవిధంగా తన వదిన, సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి నుంచి రూ.19 లక్షలు అప్పు తీసుకున్నట్టు అఫిడవిట్లో షర్మిల పేర్కొన్నారు. ఈ విషయం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. అదేంటి.. ఆస్తుల పంపకంలో తేడా వచ్చిందని.. అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అప్పులు ఇవ్వడం ఏంటనే చర్చ తెరమీదికి వచ్చింది. సీఎం జగన్పై కొందరు విమర్శలు కూడా చేశారు. సొంత చెల్లికి అప్పులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.
ఈ విషయంపై తాజాగా షర్మిల స్పందించారు. సమాజంలో చెల్లెలికి ఏ అన్న అయినా వాట ఇవ్వాలి. అది ఆడబిడ్డ హక్కు. కానీ కొందరు వ్యక్తులు చెల్లెళ్ళకు ఇవ్వాల్సిన ఆస్తి వాటాను కూడా.. తమ వాటాగా భావిస్తారు. తామేదో చెల్లెళ్ళకు గిఫ్ట్ గా ఇస్తున్నామని బిల్డప్ ఇస్తారు. ఒక్క కొసరు(కొంచెం ఎక్కువ) చెల్లెళ్ళ కు ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్లు కొందరు చూపిస్తారు. ఈ విషయం కుటుంబానికి, దేవుడికి తెలుసు అని వ్యాఖ్యానించారు.
దీనిని బట్టి.. షర్మిల తనకు అప్పుగా చూపించిన నిధులపై ఒక క్లారిటీ వచ్చింది. అదే సమయంలో జగన్ ఇచ్చిన సొమ్ముపైనా క్లారిటీ వచ్చింది. ఏదేమైనా.. మనస్పూర్తిగా అయితే.. జగన్ ఇవ్వలేదనేది షర్మిల ఆరోపణగా ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో షర్మిల అప్పుగా తీసుకున్న మొత్తం 82 కోట్ల పైచిలుకు మొత్తంపై వైసీపీ నుంచి ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. అది అప్పా.. లేక మరో విదమైన సొమ్మా.. అసలు షర్మిల ఎప్పుడు తీసుకున్నారు? అనేది చర్చ. ఇది ఇంకా అప్రస్తుతంగానే ఉంది.
This post was last modified on April 21, 2024 9:23 pm
ఇటీవలే ప్రమాదానికి గురై భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు నెలల…
నిన్న జరిగిన బండ్ల గణేష్ కూతురి వివాహ వేడుకకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి…
విశ్వనాథ్ అండ్ సన్స్ తో దర్శకుడు వెంకీ అట్లూరి దిగ్విజయంగా హ్యాట్రిక్ పూర్తి చేశారు. ఇంత స్థిరంగా బ్యాక్ టు…
లోకేష్ కనగరాజ్ హీరోగా వచ్చిన 'డీసీ' సినిమాకు తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఆగస్టు 7న రిలీజైన…
ఓటిటిలు ఇంత విస్తృతంగా పెరిగిన తర్వాత ఏదైనా హిట్ సినిమాని రీమేక్ చేయాలంటే సంవత్సరాలు కాకుండా నెలల్లోనే పూర్తి చేయాలి.…
దర్శకుడు కొరటాల శివ టైం అంత బాగా నడుస్తున్నట్టు లేదు. ఆచార్య మానని గాయం చేసింది. డిజాస్టర్లు అందరికీ వస్తాయి…