కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా తన అన్న సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా పేరు చెప్పకుండానే.. చెల్లెళ్లకు ఇవ్వాల్సిన ఆస్తి వాటాను కూడా.. గిఫ్ఠ్ ఇచ్చినట్టుగా భావిస్తారని షర్మిల అన్నారు. శనివారం కడప పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన షర్మిల.. అనంతరం ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. దీనిలో తన అన్న సీఎం జగన్కు తాను రూ.82 కోట్ల రూపాయల అప్పు ఉన్నానని షర్మిల తెలిపారు.
అదేవిధంగా తన వదిన, సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి నుంచి రూ.19 లక్షలు అప్పు తీసుకున్నట్టు అఫిడవిట్లో షర్మిల పేర్కొన్నారు. ఈ విషయం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. అదేంటి.. ఆస్తుల పంపకంలో తేడా వచ్చిందని.. అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అప్పులు ఇవ్వడం ఏంటనే చర్చ తెరమీదికి వచ్చింది. సీఎం జగన్పై కొందరు విమర్శలు కూడా చేశారు. సొంత చెల్లికి అప్పులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.
ఈ విషయంపై తాజాగా షర్మిల స్పందించారు. సమాజంలో చెల్లెలికి ఏ అన్న అయినా వాట ఇవ్వాలి. అది ఆడబిడ్డ హక్కు. కానీ కొందరు వ్యక్తులు చెల్లెళ్ళకు ఇవ్వాల్సిన ఆస్తి వాటాను కూడా.. తమ వాటాగా భావిస్తారు. తామేదో చెల్లెళ్ళకు గిఫ్ట్ గా ఇస్తున్నామని బిల్డప్ ఇస్తారు. ఒక్క కొసరు(కొంచెం ఎక్కువ) చెల్లెళ్ళ కు ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్లు కొందరు చూపిస్తారు. ఈ విషయం కుటుంబానికి, దేవుడికి తెలుసు అని వ్యాఖ్యానించారు.
దీనిని బట్టి.. షర్మిల తనకు అప్పుగా చూపించిన నిధులపై ఒక క్లారిటీ వచ్చింది. అదే సమయంలో జగన్ ఇచ్చిన సొమ్ముపైనా క్లారిటీ వచ్చింది. ఏదేమైనా.. మనస్పూర్తిగా అయితే.. జగన్ ఇవ్వలేదనేది షర్మిల ఆరోపణగా ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో షర్మిల అప్పుగా తీసుకున్న మొత్తం 82 కోట్ల పైచిలుకు మొత్తంపై వైసీపీ నుంచి ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. అది అప్పా.. లేక మరో విదమైన సొమ్మా.. అసలు షర్మిల ఎప్పుడు తీసుకున్నారు? అనేది చర్చ. ఇది ఇంకా అప్రస్తుతంగానే ఉంది.
This post was last modified on April 21, 2024 9:23 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…