తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రిజవిజన్(సర్) ప్రక్రియ దాదాపు రెండు మాసాల పాటు సాగింది. రెండు సార్లు కూడా పొడిగించారు. కానీ, అప్పట్లో వ్యక్తం చేయని సందేహాలు.. అప్పట్లో చురుగ్గా వ్యవహరించాల్సిన పరిస్థితి మరిచిపోయిన తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. అంతా అయిపోయిన తర్వాత.. ఇప్పుడు నింపాది గా రియాక్ట్ అయ్యారు. ఎన్నికల సంఘం.. తెలంగాణ కు అన్యాయం చేసిందని ఆయన లబోదిబోమంటున్నారు. నిర్దాక్షిణ్యంగా ఓట్లు తొలగించారని.. ఇది అన్యాయమని మహేష్ కుమార్ గగ్గోలు పెట్టారు.
రేవంత్ చెప్పినా..
నిజానికి సర్ ప్రక్రియ ప్రారంభానికి ముందే.. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కార్యకర్తలను, మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు మూడు సార్లు అలెర్ట్ చేశారు. సర్ ప్రక్రియను జాగ్రత్తగా పరిశీలించాలని హెచ్చరించారు. బీఎల్ ఏలను సద్వినియోగం చేసుకోవాలని కూడా ఆయన సూచించారు. కానీ, ఆనాడు పెద్దగా నాయకులు వినిపించుకోలేదన్నది కూడా సీఎం నోటి నుంచే ఇటీవల వినాల్సి వచ్చింది. ఇక, ఇప్పుడు సర్ ప్రక్రియ పూర్తయిందని.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. అంతేకాదు.. 92 లక్షల ఓట్లకు సంబంధించి నోటీసులు ఇవ్వనున్నట్టు కూడా ఆయన తెలిపారు.
ఈ వ్యవహారం అధికార పార్టీని ఇరుకున పడేసింది. 92 లక్షల ఓట్ల పరిస్థితిపై మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు సంధించారు. ఎన్నికల సంఘం నియమించిన బీఎల్ వో(బూత్ స్థాయి అధికారి)లు ఎవరి ఇంటికీ వెళ్లలేదని.. లెగ్ వర్క్ చేయలేదని ఆరోపించారు. కేవలం తమకు నచ్చినట్టుగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. వలస కూలీల ఓట్లను భారీగా తీసేశారని వ్యాఖ్యానించారు. దీనిపై వివరణ ఇవ్వాలన్నారు. ఇక, 2002 నాటి ఓటర్ల జాబితా విషయంపైనా గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశౄరు.
నిజానికి దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియలో 2002 నాటి జాబితానే కీలకంగా మారింది. ఈ విషయంపై గతంలోనూ వివాదం వచ్చినా కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. 2002 ప్రకారమే జాబితాలను రెడీ చేస్తామని చెప్పింది. కానీ.. మహేష్ కుమార్కు ఇప్పుడు ఈవిషయం గుర్తుకు వచ్చినట్టుగా స్పందించారు. 2002 నాటి ఓటర్ల జాబితా ఎంతమందికి అందుబాటులో ఉంది?కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీలాగే ఎన్నికల సంఘాన్ని కూడా తన జేబు సంస్థగా మార్చుకుంది. అని ఆయన నిప్పులు చెరిగారు. కానీ.. వాస్తవానికి రెండు నెలల కిందటే ఆయన స్పందించి ఉంటే ఇప్పుడు చేతులు కాలకుండా ఉండే పరిస్థితి ఉండేదికదా.. అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 18, 2026 11:18 pm
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…
సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…
తెలుగులో స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా వైకల్యం పెట్టాలంటే.. ఎన్నో భయాలుండేవి ఒకప్పుడు. హీరోలు అలాంటి పాత్రలు ఒప్పుకోవడమూ కష్టంగా…
విజయవాడ మేయర్ పదవికి అన్నీ పార్టీల్లోనూ పోటీ పెరుగుతుంది. ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాకుండానే మేయర్ కుర్చీ పై పలువురు…