గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ అధినేత జగన్ దూరం పెడుతున్నారా? తన పార్టీలోని మిగతా నేతలతో ఉన్నంత సఖ్యతతో వంశీతో జగన్ ఉండడం లేదా? ఒక మాజీ ఎమ్మెల్యే అయిన వంశీ కూడా జగన్ ను ఒక సాధారణ కార్యకర్తలాగా బారికేడ్ల అవతల నుంచి కలుస్తున్న వైనం చూస్తుంటే వంశీకి, జగన్ కు మధ్య గ్యాప్ వచ్చినట్లు వస్తున్న పుకార్లు నిజం అనిపించక మానదు.
ఇటీవల గన్నవరం విమానాశ్రయం దగ్గర జగన్ ను కలిసేందుకు వల్లభనేని వంశీ వెళ్లారు. అయితే, జనం మధ్యలో బారికేడ్లకు అవతల వంశీ నిలబడి జగన్ ను పలకరించారు. వాస్తవానికి వంశీనే నేనిక్కడున్నాను అంటూ జగన్ కు అభివాదం చేసిన తర్వాత జగన్ ఆయన దగ్గరకు వెళ్లారు. వంశీ షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా…జగన్ మాత్రం అయిష్టంగా రెండు ముక్కలు మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సరే ఏదో తొందరలో జనం ఎక్కువగా ఉన్నారు కాబట్టి వెళ్లారు అనుకోవడానికి లేదు.
ఇప్పుడే కాదు..కొద్ది రోజులగా వంశీతో వన్ టు వన్ మీటింగ్ లోగానీ, ఇతర సందర్భాల్లోగానీ వంశీ కనబడలేదు. మిగతా నేతలను కలుస్తున్న జగన్…వంశీని మాత్రం కావాలనే దూరం పెడుతున్నట్లు కనిపిస్తోంది. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత వంశీ వైఖరిలో ఏమైనా మార్పు వచ్చిందా? అందుకే వంశీని జగన్ దూరం పెడుతున్నారా అన్న చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి, ఈ గ్యాప్ నిజమా..లేేక కల్పిత ప్రచారమా అన్నది తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
This post was last modified on August 18, 2026 6:19 pm
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. ఇటీవలే పుదుచెరి షెడ్యూల్…
2027 సంక్రాంతి అయిదు నెలల ముందే టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మేమంటే మేమంటూ ఎవరికి వారు పోటీ పడి…
ఇంకా షూటింగ్ మొదలుకుండానే కేవలం ప్రీ లుక్ పోస్టర్ తో జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా సోషల్…
ఆగస్ట్ 26 విడుదల కాబోతున్న టాక్సిక్ ఏపీ తెలంగాణలోనూ పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది. బడా సంస్థ పంపిణి హక్కులు…
సందీప్ కిషన్.. హిట్లు ఫ్లాపుల కంటే ముందుగా గుర్తొచ్చేది ఈ హీరో చేసే ప్రయోగాలు. 16 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నా…
భారతదేశంలో మరణశిక్ష అమలు విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఉరి తీయడానికి బదులుగా ప్రాణాలు తీసేందుకు తక్కువ నొప్పిని…