Political News

కుప్పంలో చంద్రబాబుకి రికార్డు స్థాయి మెజార్టీ.?

‘వై నాట్ కుప్పం’ అని గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా అనగలిగారు.? అప్పటికి పరిస్థితులు వైసీపీకి అంత అనుకూలంగా కనిపించాయి మరి.

సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు, కుప్పంలో వైసీపీ మార్కు రాజకీయం చూసి ఆశ్చర్యపోయారు, ఆందోళన చెందారు కూడా.! కానీ, ఎన్నికల నాటికి పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్‌గా వైఎస్ జగన్ అనుసరించిన రాజకీయ వ్యూహాలు కొన్ని బెడిసికొట్టాయి. కొన్ని వైసీపీకే రివర్స్ ఎటాక్ ఇచ్చాయి కూడా.

ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ పత్రాల్ని సమర్పించారు కూడా. భారీ ర్యాలీతో ఈ నామినేషన్ పత్రాల సమర్పణ కార్యక్రమం జరిగింది. నిజానికి, టీడీపీ కూడా ఈ స్థాయి జన సందోహాన్ని ఊహించి వుండదు.
మారిన సమీకరణాల ప్రకారం చూస్తే, కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రికార్డు స్థాయి మెజార్టీని కైవసం చేసుకునేలా వున్నారు.

‘కుప్పంలో వైసీపీ అభ్యర్థి గెలిస్తే, మంత్రి అవుతారు..’ అని కొన్నాళ్ళ క్రితం వైఎస్ జగన్ జగన్ చేసిన ప్రకటన బెడిసి కొట్టింది. ‘కుప్పంలో చంద్రబాబు గెలిస్తే.. ఇంకోసారి కుప్పం నియోజకవర్గానికే ముఖ్యమంత్రి పదవి వస్తుంది..’ అని కుప్పం ప్రజానీకం అంటున్నారు.

క్రమంగా వైసీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం తాలూకు జోరు కూడా తగ్గిపోయింది. గతంలోలా వైసీపీ సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కుప్పంపై ఫోకస్ పెట్టే పరిస్థితి లేదు. ఆయనకు సొంత నియోజకవర్గంలో పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా మారాయ్.

This post was last modified on April 20, 2024 10:53 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

9 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

48 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago