టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ సొంత పార్టీపై కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. 2019-24 మధ్య పార్టీ కోసం తాను కష్టపడ్డా తనకు మంత్రి పదవి దక్కలేదని ఉమ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇక, వైసీపీ నుంచి వచ్చిన పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్, సవితలకు మంత్రి పదవులిచ్చి తనకు ఇవ్వలేదని ఉమ చేసిన కామెంట్లు టీడీపీ అధిష్టానానికి కోపం తెప్పించాయి. ఆ వ్యాఖ్యల వేడి సద్దుమణగకముందే తాజాగా మరోసారి ఉమ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి.
2019లో టీడీపీ ఓడిపోవడానికి కాపు ఉద్యమం కారణం అంటూ ఉమ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలోనే ఉమ వ్యాఖ్యలకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కౌంటర్ ఇచ్చారు. తన వ్యక్తిగత వ్యాఖ్యలను ఉమ పార్టీకి అన్వయించడం సరికాదని వర్మ హితవు పలికారు. కాపులకు చంద్రబాబు చేసినంత మేలు ఎవరూ చేయలేదని వర్మ గుర్తు చేశారు.
2019లో ఒక్క ఛాన్స్ కావాలని జగన్ అడగడం వల్లే ప్రజలు వైసీపీని గెలిపించారని అభిప్రాయపడ్డారు. టీడీపీ నాయకులెవరైనా సరే ఈ తరహా కామెంట్లు చేసేముందు అది తమ వ్యక్తిగత అభిప్రాయమని, దాంతో పార్టీకి సంబంధం లేదని చెప్పడం మంచిదని సూచించారు.
2019లో టీడీపీ ఓటమికి అనేక కారణాలున్నాయని వర్మ అన్నారు. నేతలు వాస్తవాలు చెప్పాలని, అబద్ధాలు చెప్పడం సరికాదని ఉమకు వర్మ కౌంటర్ ఇచ్చారు. కాపులను బీసీలలో చేర్చాలని చెప్పింది చంద్రబాబేనని అన్నారు. కాపు కార్పొరేషన్ దరఖాస్తులను వైసీపీ రద్దు చేసిందని, కాపు భవనాల నిర్మాణాలను నిలిపివేసిందని గుర్తు చేశారు. కాపులకు తీరని అన్యాయం చేసిన వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వర్మ అన్నారు. మరి, వర్మ కామెంట్లకు ఉమ కౌంటర్ ఏవిధంగా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on July 27, 2026 6:46 pm
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…