తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి మహిళలా మారిపోయింది అన్నా. ఈ మధ్య ఆమె ఎప్పుడూ సంప్రదాయ చీరకట్టులోనే కనిపిస్తున్నారు. తిరుమలకు నడక మార్గంలో వెళ్లి తలనీలాలు కూడా సమర్పించుకుని తెలుగు వాళ్ల మనసులు గెలుచుకున్నారు అనా.
ఐతే 13 ఏళ్ల కిందటే పవన్ను పెళ్లాడి, ఆయన కుటుంబంలో కలిసిపోయిన అనాను ఇప్పటికీ మీడియా వాళ్లు, సోషల్ మీడియా జనాలు అన్నా లెజ్నెవా అనే పిలుస్తుంటారు. ఈ పిలుపు ఇక వద్దే వద్దని అంటున్నారు. తన పేరును భర్త ఇంటిపేరైన కొణిదెలతో కలిపే పిలవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇన్స్టాలో ఇంతకుముందే ఆమె తన పేరును.. అన్నా కొణిదెలగా మార్చుకున్నారు. తనను జనం కూడా ఇలాగే పిలవాలని కోరుతూ తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టారు.
అన్నా లెజ్నెవా అనే పేరును చివరగా పేర్కొన్న డాక్యుమెంట్.. పవన్తో తన పెళ్లి రిజిస్ట్రేషన్కు సంబంధించినదే అని.. ఆ రోజే తాను తన భర్త ఇంటి పేరును తీసుకున్నానని ఆమె చెప్పింది. తనను అందరూ అన్నా కొణిదెల అనే పిలవాలని.. అదే తన పేరని, ఆ పేరును తనదిగా భావిస్తానని తను పేర్కొంది. ఈ సందర్భంగా పవన్తో కలిసి దిగిన ఒక అందమైన ఫొటోను షేర్ చేశారు. తాను, పవన్ కలిసి తొలిసారి రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ పర్యటనకు వెళ్లినప్పటి ఫొటో అది పాత రోజులను గుర్తు చేసుకున్నారు.
పవన్ తొలి రెండు వివాహాలు విఫలం కాగా.. తీన్మార్ సినిమా షూటింగ్లో పరిచయం అయిన అన్నాతో పవన్ ప్రేమలో పడ్డారు. రెండో భార్య రేణు దేశాయ్ నుంచి 2012లో విడాకులు తీసుకున్న పవన్.. తర్వాతి ఏడాది తనను పెళ్లి చేసుకున్నారు. ఆమెతో ఆయనకు ఇద్దరు సంతానం ఉన్నారు. అమ్మాయి పేరు పోలేనా అంజనా కాగా, అబ్బాయి పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. రేణు ద్వారా ఆయనకు అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు సంతానం ఉన్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 27, 2026 10:06 pm
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…