Political News

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు లెక్క‌లేక‌పోవ‌డం అత్యంత సీరియ‌స్ ప‌రిణామంగా పేర్కొంది. ముఖ్యంగా హైడ్రా క‌మిష‌న‌ర్, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్ పై హైకోర్టు మ‌రింత తీవ్రంగా స్పందించింది. ఆయ‌న తీరు అత్యంత దారుణంగా ఉంద‌ని పేర్కొన్న న్యాయ‌స్థానం.. త‌క్ష‌ణ‌మే ఆయ‌న‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ పోస్టు నుంచి త‌ప్పించాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ఆదేశించ‌డం గ‌మ‌నార్హం. కోర్టు అంటే రంగ‌నాథ్‌కు ఎంత మాత్రం లెక్క లేకుండా పోయింద‌ని న్యాయ‌స్థానం పేర్కొన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఏం జ‌రిగింది?

హైడ్రా వ్య‌వ‌స్థ ప్రారంభం నుంచి కూడా అనేక విమ‌ర్శ‌లు దీని చుట్టూ తిరుగుతున్నాయి. సెల‌వు రోజులు, కోర్టులు ప‌నిచేయ‌ని రోజులు చూసుకుని తెల్ల‌వారు జామున‌, అర్ధ‌రాత్రి వేళ క‌ట్ట‌డాల‌ను కూల్చేయ‌డంపై గ‌తంలోనూ హైకోర్టు.. హైడ్రాపై నిప్పులు చెరిగింది. ఈ క్ర‌మంలోనే ఒక‌ద‌శ‌లో హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ను కోర్టుకు కూడా పిల‌వాల్సి వ‌చ్చింది. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు రంగ‌నాథ్ పై 63 కోట్లు ధిక్క‌ర‌ణ పిటిష‌న్లు న‌మోద‌య్యాయి. వీటిపై విచార‌ణ చేయాల్సి ఉంది. అయితే.. కోర్టులు ఇచ్చే ఆదేశాల‌ను రంగ‌నాథ్ ప‌ట్టించుకోక‌పోవ‌డం దారుణ‌మ‌ని హైకోర్టు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

తాజా కేసు ఏంటంటే..

తాజాగా  మల్కాజిగిరి పరిధిలోని లోతుకుంట భూములకు సంబంధించి హైకోర్టు గ‌తంలో కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ భూముల జోలికి పోవ‌ద్ద‌ని..త‌దుప‌రి విచార‌ణ వ‌ర‌కు వేచిచూడాల‌ని ఆదేశించింది. అయితే.. హైడ్రా అధికారులు మాత్రం కోర్టు ఉత్త‌ర్వులు ఉన్న‌ప్ప‌టికీ.. త‌మ ప‌ని తాము చేసేశారు. దీంతో `శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌` కంపెనీ.. కోర్టును ఆశ్ర‌యించింది. కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను హైడ్రా ఉల్లంఘించింద‌ని పేర్కొంటూ ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిలో ప్ర‌తివాదిగా హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ను పేర్కొంది. ఈ పిటిష‌న్‌పై ప‌లు మార్లు విచారించిన హైకోర్టు రంగ‌నాథ్ ను కోర్టుకు రావాల‌ని.. వ‌చ్చి వివ‌ర‌ణ ఇవ్వాలని ఆదేశించింది.

ఈ క్ర‌మంలో ఆయ‌న కోర్టుకు రాక‌పోయిన‌ప్ప‌టికీ.. న్యాయ‌స్థానానికి లిఖిత పూర్వ‌క క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. కోర్టుల‌పై న‌మ్మ‌కం ఉంద‌న్నారు. మ‌ల్కాజిగిరి ప‌రిధిలో భూముల జోలికి పోలేద‌ని తెలిపారు. అయితే.. దీనిపై గ‌తంలోనే కోర్టు అమిక‌స్ క్యూరీ ద్వారా క్షేత్ర‌స్థాయి నివేదిక తెప్పించుకుని వాస్త‌వాలు ప‌రిశీలించింది. తాజాగా సోమ‌వారం జ‌రిగిన విచార‌ణ‌లో రంగ‌నాథ్ వ్య‌వ‌హారంపై సీరియ‌స్ అయిన న్యాయ‌మూర్తులు.. ఆయ‌న‌కు కోర్టులంటే లెక్క‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. త‌క్ష‌ణ‌మే ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని  ఆదేశించింది. 

This post was last modified on July 27, 2026 6:37 pm

Share

Recent Posts

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

2 hours ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

2 hours ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

3 hours ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

3 hours ago

భోగాపురం టూ సింగపూర్… బాబు గారి దిల్ ఖుష్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వ‌స‌తుల‌తో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కార్య‌కలాపాలు ఆదివారం అర్ధ‌రాత్రి…

6 hours ago

బండ్ల కూతురి పెళ్లికి రానిది పవన్ ఒకరే

బండ్ల గ‌ణేష్ అనే న‌టుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్ర‌లు చేసింది లేదు. న‌టుడిగా అత‌డిది గొప్ప కెరీర్ కాదు.…

7 hours ago