Political News

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు లెక్క‌లేక‌పోవ‌డం అత్యంత సీరియ‌స్ ప‌రిణామంగా పేర్కొంది. ముఖ్యంగా హైడ్రా క‌మిష‌న‌ర్, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్ పై హైకోర్టు మ‌రింత తీవ్రంగా స్పందించింది. ఆయ‌న తీరు అత్యంత దారుణంగా ఉంద‌ని పేర్కొన్న న్యాయ‌స్థానం.. త‌క్ష‌ణ‌మే ఆయ‌న‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ పోస్టు నుంచి త‌ప్పించాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ఆదేశించ‌డం గ‌మ‌నార్హం. కోర్టు అంటే రంగ‌నాథ్‌కు ఎంత మాత్రం లెక్క లేకుండా పోయింద‌ని న్యాయ‌స్థానం పేర్కొన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఏం జ‌రిగింది?

హైడ్రా వ్య‌వ‌స్థ ప్రారంభం నుంచి కూడా అనేక విమ‌ర్శ‌లు దీని చుట్టూ తిరుగుతున్నాయి. సెల‌వు రోజులు, కోర్టులు ప‌నిచేయ‌ని రోజులు చూసుకుని తెల్ల‌వారు జామున‌, అర్ధ‌రాత్రి వేళ క‌ట్ట‌డాల‌ను కూల్చేయ‌డంపై గ‌తంలోనూ హైకోర్టు.. హైడ్రాపై నిప్పులు చెరిగింది. ఈ క్ర‌మంలోనే ఒక‌ద‌శ‌లో హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ను కోర్టుకు కూడా పిల‌వాల్సి వ‌చ్చింది. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు రంగ‌నాథ్ పై 63 కోట్లు ధిక్క‌ర‌ణ పిటిష‌న్లు న‌మోద‌య్యాయి. వీటిపై విచార‌ణ చేయాల్సి ఉంది. అయితే.. కోర్టులు ఇచ్చే ఆదేశాల‌ను రంగ‌నాథ్ ప‌ట్టించుకోక‌పోవ‌డం దారుణ‌మ‌ని హైకోర్టు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

తాజా కేసు ఏంటంటే..

తాజాగా  మల్కాజిగిరి పరిధిలోని లోతుకుంట భూములకు సంబంధించి హైకోర్టు గ‌తంలో కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ భూముల జోలికి పోవ‌ద్ద‌ని..త‌దుప‌రి విచార‌ణ వ‌ర‌కు వేచిచూడాల‌ని ఆదేశించింది. అయితే.. హైడ్రా అధికారులు మాత్రం కోర్టు ఉత్త‌ర్వులు ఉన్న‌ప్ప‌టికీ.. త‌మ ప‌ని తాము చేసేశారు. దీంతో `శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌` కంపెనీ.. కోర్టును ఆశ్ర‌యించింది. కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను హైడ్రా ఉల్లంఘించింద‌ని పేర్కొంటూ ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిలో ప్ర‌తివాదిగా హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ను పేర్కొంది. ఈ పిటిష‌న్‌పై ప‌లు మార్లు విచారించిన హైకోర్టు రంగ‌నాథ్ ను కోర్టుకు రావాల‌ని.. వ‌చ్చి వివ‌ర‌ణ ఇవ్వాలని ఆదేశించింది.

ఈ క్ర‌మంలో ఆయ‌న కోర్టుకు రాక‌పోయిన‌ప్ప‌టికీ.. న్యాయ‌స్థానానికి లిఖిత పూర్వ‌క క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. కోర్టుల‌పై న‌మ్మ‌కం ఉంద‌న్నారు. మ‌ల్కాజిగిరి ప‌రిధిలో భూముల జోలికి పోలేద‌ని తెలిపారు. అయితే.. దీనిపై గ‌తంలోనే కోర్టు అమిక‌స్ క్యూరీ ద్వారా క్షేత్ర‌స్థాయి నివేదిక తెప్పించుకుని వాస్త‌వాలు ప‌రిశీలించింది. తాజాగా సోమ‌వారం జ‌రిగిన విచార‌ణ‌లో రంగ‌నాథ్ వ్య‌వ‌హారంపై సీరియ‌స్ అయిన న్యాయ‌మూర్తులు.. ఆయ‌న‌కు కోర్టులంటే లెక్క‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. త‌క్ష‌ణ‌మే ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని  ఆదేశించింది. 

This post was last modified on July 27, 2026 6:37 pm

Share

Recent Posts

ఇరుముడి… క్రిష్‌కు ఇంకా బాకీ!

‘ఇరుముడి’ ఇప్పుడు పెద్ద హిట్. రవితేజ మాస్ ఇమేజ్ ఒక వైపు ఉన్నా, సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసింది అందులోని…

3 minutes ago

అన్న రాలేదు.. వదినమ్మ ఒక్కరే ఎందుకు?

విజయ్ దేవరకొండ.. తమ్ముడి కెరీర్ మొదట్లో సినిమాలకు తనవంతు పుష్ ఇచ్చాడు. కానీ ఆనంద్‌కు సొంతంగా పేరు రావడం మొదలయ్యాక…

2 hours ago

మహాకాళి ముందు జాగ్రత్త పడుతోంది

హనుమాన్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ నిర్మాణంలో మహాకాళి రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా…

3 hours ago

రాజకీయాలకు అయ్యన్న గుడ్ బై

టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ…

3 hours ago

ప్రభాస్ ఓడిన జానర్లో రవితేజ గెలవాలి

ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయాన్ని మనసారా ఆస్వాదిస్తున్న రవితేజ తన అభిమానుల ఏళ్ళ తరబడి ఆకలిని ఒకేసారి తీర్చేశాడు. హిట్…

5 hours ago

విజయశాంతికి బెర్త్ ఖరారు?

ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవి ఖరారైనట్లు హస్తినలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల మంత్రి…

6 hours ago