Political News

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు లెక్క‌లేక‌పోవ‌డం అత్యంత సీరియ‌స్ ప‌రిణామంగా పేర్కొంది. ముఖ్యంగా హైడ్రా క‌మిష‌న‌ర్, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్ పై హైకోర్టు మ‌రింత తీవ్రంగా స్పందించింది. ఆయ‌న తీరు అత్యంత దారుణంగా ఉంద‌ని పేర్కొన్న న్యాయ‌స్థానం.. త‌క్ష‌ణ‌మే ఆయ‌న‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ పోస్టు నుంచి త‌ప్పించాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ఆదేశించ‌డం గ‌మ‌నార్హం. కోర్టు అంటే రంగ‌నాథ్‌కు ఎంత మాత్రం లెక్క లేకుండా పోయింద‌ని న్యాయ‌స్థానం పేర్కొన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఏం జ‌రిగింది?

హైడ్రా వ్య‌వ‌స్థ ప్రారంభం నుంచి కూడా అనేక విమ‌ర్శ‌లు దీని చుట్టూ తిరుగుతున్నాయి. సెల‌వు రోజులు, కోర్టులు ప‌నిచేయ‌ని రోజులు చూసుకుని తెల్ల‌వారు జామున‌, అర్ధ‌రాత్రి వేళ క‌ట్ట‌డాల‌ను కూల్చేయ‌డంపై గ‌తంలోనూ హైకోర్టు.. హైడ్రాపై నిప్పులు చెరిగింది. ఈ క్ర‌మంలోనే ఒక‌ద‌శ‌లో హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ను కోర్టుకు కూడా పిల‌వాల్సి వ‌చ్చింది. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు రంగ‌నాథ్ పై 63 కోట్లు ధిక్క‌ర‌ణ పిటిష‌న్లు న‌మోద‌య్యాయి. వీటిపై విచార‌ణ చేయాల్సి ఉంది. అయితే.. కోర్టులు ఇచ్చే ఆదేశాల‌ను రంగ‌నాథ్ ప‌ట్టించుకోక‌పోవ‌డం దారుణ‌మ‌ని హైకోర్టు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

తాజా కేసు ఏంటంటే..

తాజాగా  మల్కాజిగిరి పరిధిలోని లోతుకుంట భూములకు సంబంధించి హైకోర్టు గ‌తంలో కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ భూముల జోలికి పోవ‌ద్ద‌ని..త‌దుప‌రి విచార‌ణ వ‌ర‌కు వేచిచూడాల‌ని ఆదేశించింది. అయితే.. హైడ్రా అధికారులు మాత్రం కోర్టు ఉత్త‌ర్వులు ఉన్న‌ప్ప‌టికీ.. త‌మ ప‌ని తాము చేసేశారు. దీంతో `శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌` కంపెనీ.. కోర్టును ఆశ్ర‌యించింది. కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను హైడ్రా ఉల్లంఘించింద‌ని పేర్కొంటూ ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిలో ప్ర‌తివాదిగా హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ను పేర్కొంది. ఈ పిటిష‌న్‌పై ప‌లు మార్లు విచారించిన హైకోర్టు రంగ‌నాథ్ ను కోర్టుకు రావాల‌ని.. వ‌చ్చి వివ‌ర‌ణ ఇవ్వాలని ఆదేశించింది.

ఈ క్ర‌మంలో ఆయ‌న కోర్టుకు రాక‌పోయిన‌ప్ప‌టికీ.. న్యాయ‌స్థానానికి లిఖిత పూర్వ‌క క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. కోర్టుల‌పై న‌మ్మ‌కం ఉంద‌న్నారు. మ‌ల్కాజిగిరి ప‌రిధిలో భూముల జోలికి పోలేద‌ని తెలిపారు. అయితే.. దీనిపై గ‌తంలోనే కోర్టు అమిక‌స్ క్యూరీ ద్వారా క్షేత్ర‌స్థాయి నివేదిక తెప్పించుకుని వాస్త‌వాలు ప‌రిశీలించింది. తాజాగా సోమ‌వారం జ‌రిగిన విచార‌ణ‌లో రంగ‌నాథ్ వ్య‌వ‌హారంపై సీరియ‌స్ అయిన న్యాయ‌మూర్తులు.. ఆయ‌న‌కు కోర్టులంటే లెక్క‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. త‌క్ష‌ణ‌మే ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని  ఆదేశించింది. 

This post was last modified on July 27, 2026 6:37 pm

Share

Recent Posts

జోగి ఫ్యామిలీలో `కోడ‌లి` కుదుపు!

వైసీపీ నేత‌, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ మంత్రి జోగి ర‌మేష్ ఫ్యామిలీలో కోడ‌లు చేసిన ఆరోప‌ణలు పెను కుదుపున‌కు…

2 hours ago

కొత్త సినిమాల్లో పొలిటికల్ పంచులు చూశారా?

సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…

2 hours ago

థియేటర్ చెక్స్… నాయకుడి పద్దతి బాగుంది

జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…

2 hours ago

రఘురామ వెరీ హ్యాపీ: ఆకివీడు రామాల‌యానికి సుప్రీం ఓకే!

ఏపీలో గ‌త 2 మాసాల కింద‌టి వ‌ర‌కు తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అయిన ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా, ఉండి నియోజ‌క‌వ‌ర్గం…

2 hours ago

కొట్టే హ‌క్కు పోలీసుల‌కు ఉందా?: సుప్రీంకోర్టు ఘాటు ప్ర‌శ్న‌

ప్ర‌జ‌లు, శాంతియుతంగా నిర‌స‌న చేస్తున్న‌వారిని కొట్టే హ‌క్కు పోలీసుల‌కు ఉందా? అని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…

3 hours ago

సొంత పార్టీ లేన‌ట్టే… సాయిరెడ్డి వెనుక‌డుగు రీజ‌నిదేనా?

వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడ‌తాన‌ని కొన్నాళ్ల కింద‌టే ప్ర‌క‌టించారు.…

3 hours ago