టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా నంబర్ వన్ డైరెక్టర్గా ఎదిగిన రాజమౌళి మీద కూడా అనేక కాపీ ఆరోపణలున్నాయి. మరో అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్నైతే సోషల్ మీడియా జనాలు కాపీ మాస్టర్ అని అంటుంటారు. ఆయన రచయితగా పని చేసిన సినిమాలకు తోడు.. డైరెక్ట్ చేసిన చాలా సినిమాల్లో హాలీవుడ్ చిత్రాల స్ఫూర్తి కనిపిస్తుంది.
ఎపిసోడ్లకు ఎపిసోడ్లను కాపీ చేసి పెట్టేస్తాడంటూ నెటిజన్లు ఆయన్ని ట్రోల్ చేస్తుంటారు. ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్కు ఫ్రీమేక్ అంటూ అజ్ఞాతవాసి మీద ఆరోపణలు రావడం, స్వయంగా ఆ చిత్ర దర్శకుడే ఈ మాట చెప్పడం అప్పట్లో ఎంత దుమారం రేపిందో తెలిసిందే. ఇంకా త్రివిక్రమ్ తీసిన అనేక సినిమాల్లో కథలు, సన్నివేశాల మీద ఇలాంటి ఆరోపణలున్నాయి.
ఇప్పుడు మాటల మాంత్రికుడు తీస్తున్న ఆదర్శకుటుంబం చిత్రం విడుదలకు ముందే ఈ కాపీ ఆరోపణలు ఎదుర్కొంటోంది. అర్జున్ నటించిన తమిళ చిత్రం బ్లాస్ట్ కథకు, దీనికి దగ్గరి పోలికలు ఉన్నాయంటూ ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. బ్లాస్ట్ రిలీజయ్యాక కథలో మార్పులు చేర్పులు జరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం నుంచి రిలీజవుతున్న కొత్త పోస్టర్లు, హీరో క్యారెక్టర్ టీజర్ చూశాక నెటిజన్లు రకరకాల హాలీవుడ్ కంటెంట్తో పోలికలు పెడుతున్నారు.
ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనే అమెరికన్ టీవీ సిరీస్ ఆధారంగా ఈ సినిమా తీశారని కొందరంటుంటే.. మరికొందరేమో వుయ్ ఆర్ ద మిల్లర్స్ అనే ఓ హాలీవుడ్ మూవీతో దీన్ని పోలుస్తున్నారు. ఆ సిరీస్, ఈ సినిమాలోని పాత్రలకు.. ఆదర్శ కుటుంబంలోని క్యారెక్టర్లకు లింక్ పెట్టి.. రకరకాల థియరీలు వండుతున్నారు. కాపీ కొట్టడమో, స్ఫూర్తి పొందడమో లేకుండా త్రివిక్రమ్ సినిమానే తీయడన్నట్లుగా నెటిజన్లు ఆయన కొత్త చిత్రాన్ని మొదట్నుంచి టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మరి ఈ ట్రోల్స్కు సమాధానంగా ఒరిజినల్ సినిమా తీసి త్రివిక్రమ్ అందరికీ సమాధానం చెబుతాడేమో చూడాలి.
This post was last modified on July 27, 2026 9:57 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…