Political News

నామినేషన్లలో ఆ ‘ముగ్గురు’.! హిట్టు కూటమికి సంకేతమిదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ తమ నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. వారి వారి జాతక రీత్యా, సుముహూర్తం చూసుకుని మరీ భారీ ర్యాలీలతో నామినేషన్లను దాఖలు చేస్తున్న సంగతి తెలిసిందే.

కూటమి అభ్యర్థుల ర్యాలీలు ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. టీడీపీ – బీజేపీ – జనసేన కలిసి కూటమిగా ఏర్పడి, అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. సీట్ల పంపకాల విషయమై కొంత గందరగోళం నడిచినా, నామినేషన్ల పర్వం షురూ అయ్యేసరికి, ఎక్కడా ఎలాంటి పొరపచ్చాలూ లేకుండా పోయాయ్.

జనసేన అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినా, టీడీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినా, బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినా, మూడు పార్టీల శ్రేణులూ ఆయా ర్యాలీల్లో పాల్గొంటుండడం గమనార్హం. కూటమి అభ్యర్థులు మూడు పార్టీల జెండాలతో హంగామా సృష్టిస్తున్నారు. పార్టీ శ్రేణులదీ అదే తీరు.

కూటమి ఏర్పాటవడం గొప్ప కాదు.. కూటమిలో పార్టీల మధ్యన ఓటు ట్రాన్స్‌ఫర్ అనేది అత్యంత కీలకం. అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ సింబల్, లోక్ సభ నియోజకవర్గానికి మరో సింబల్.. ఇలా సైకిల్, గ్లాస్, కమలం మధ్య పార్టీ కార్యకర్తలే పోలింగ్ సమయంలో గందరగోళానికి గురయ్యే అవకాశం వుంటుంది మామూలుగా అయితే.

ఆ గందరగోళానికి అస్సలేమాత్రం తావు లేకుండా, కూటమి అభ్యర్థులు, ఆయా పార్టీల శ్రేణులు, ప్రజల్లోనూ ఎన్నికల గుర్తుల విషయమై చైతన్యం కల్పిస్తూ, అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా చేస్తుండడం గమనార్హం.

శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా.. అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ కూటమి అభ్యర్థుల నామినేషన్ పండగ వాతావరణంలో జరుగుతోంది. ఇది ‘హిట్టు కూటమి’ అని మూడు పార్టీల శ్రేణులు చెప్పడమే కాదు, ప్రజల్లోనూ ఆ వేవ్ తీసుకొచ్చేందుకు ఈ నామినేషన్ల పర్వం ఉపయోగపడుతోందనే చెప్పాలి.

This post was last modified on April 19, 2024 11:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సాయిపల్లవి డిమాండ్ అంతకు మించి

ఆచితూచి సినిమాలు చేసే సాయిపల్లవి నెంబర్ల కోసం ఎప్పుడూ పాకులాడలేదు. వచ్చిన ఆఫర్లన్నీ ఒప్పేసుకుని ఎక్కువ సంపాదించాలనే యావ చూపించలేదు.…

51 minutes ago

ట్రంప్ తో ఒప్పందం… పెట్రోల్ ధరలు పెరుగుతాయా?

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు టారిఫ్‌లు విధించిన సంగతి…

2 hours ago

పాకిస్థానీలే విల‌న్లు… పాకిస్థాన్‌లో నంబ‌ర్‌వ‌న్‌

భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య చాలా ఏళ్లుగా సంబంధాలు అంతంత‌మాత్రంగా ఉండ‌గా.. గ‌త ఏడాది ప‌హ‌ల్గాం దాడితో అవి మ‌రింత క్షీణించాయి.…

2 hours ago

ఆ హీరోకు 80 కోట్లా?

నాలుగేళ్ల ముందు వరకు రిషబ్ శెట్టి అంటే ఎవరో కర్ణాటక అవతల సినీ ప్రేక్షకులకు తెలియదు. దర్శకుడిగా, నటుడిగా అప్పటికే కొన్ని…

2 hours ago

‘దంగల్’ రికార్డుకు మూడినట్లేనా?

పదేళ్ల ముందు రిలీజైన సినిమా.. దంగల్. కానీ ఇప్పటికీ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీ రికార్డు ఆ సినిమా పేరు…

2 hours ago

పరామర్శ యాత్రలు కాదు… అసెంబ్లీకి రండి సార్..!

వైసీపీ అధినేత జగన్ రెండు రోజులపాటు పరామర్శ యాత్ర సిద్ధమవుతున్నారు. బుధవారం గుంటూరులో, శుక్రవారం ఇబ్రహీంపట్నంలో పర్యటించనున్నారు. అంబటి రాంబాబు,…

3 hours ago