కంటెంట్ తప్ప ఇంక దేన్నీ నమ్ముకోవడానికి వీల్లేని చిన్న సినిమాలకు ఓపెనింగ్స్ తెచ్చుకోవడమే గండంగా మారిన తరుణంలో పారిజాత పర్వం అంతో ఇంతో ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. సునీల్, హర్ష చెముడు లాంటి తెలిసిన క్యాస్టింగ్ తో పాటు యూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్ కు వచ్చిన చైతన్య రావు హీరోగా సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో రూపొందింది. ఖచ్చితంగా మెప్పిస్తుందనే నమ్మకంతో ముందు రోజు రాత్రే ప్రీమియర్లు వేశారు. నిన్న బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ పోటీ ఉన్నప్పటికీ కాస్త దృష్టిలో ఉన్నది ఈ మూవీనే. వెరైటీ టైటిల్ తో వచ్చిన పారిజాత పర్వం ఎలా ఉందంటే.
డైరెక్టర్ కావాలనే లక్ష్యంతో హైదరాబాద్ లో కాళ్లరిగేలా తిరుగుతున్న చైతన్య(చైతన్య రావు)కు అవమానాలు తప్ప అవకాశాలు రావు. ఎందరు ఎగతాళి చేసినా స్నేహితుడు హర్ష(హర్ష చెముడు)నే హీరోగా పెట్టి తీయాలని కంకణం కట్టుకుంటాడు. భీమవరం నుంచి వచ్చి గ్యాంగ్ స్టర్ గా ఎదిగిన బార్ శీను(సునీల్) బయోపిక్ ని ఎంచుకుంటాడు. డబ్బు కోసం ఓ నిర్మాత(శ్రీకాంత్ అయ్యంగార్)భార్యను కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈలోగా శీనుతో పాటు ఇతర గ్యాంగులు రంగంలోకి దిగుతాయి. అయోమయం మొదలవుతుంది. చివరికి చైతన్య అనుకున్నది సాధించాడా లేదా అనేది స్టోరీ.
ఫస్ట్ హాఫ్ నుంచే విపరీతమైన సాగతీతతో పాటు అక్కర్లేని సన్నివేశాలతో దర్శకుడు సంతోష్ సహనానికి పెద్ద పరీక్ష పెడతాడు. ఆసక్తికరంగా ఉండాల్సిన స్క్రీన్ ప్లే నవ్వించని కామెడీతో విసిగిస్తుంది. పాత్రల తీరుతెన్నులు లాజిక్ కి దూరంగా చాలా సిల్లీగా అనిపిస్తాయి. దానికి తోడు అక్కడక్కడా నవ్వించిన హర్ష ఒకదశ దాటాక ఓవర్ అనిపించడం ముమ్మాటికీ క్యారెక్టరైజేషన్ లోపమే. సంగీతంతో సహా సాంకేతిక విభాగాలన్నీ గందరగోళం చేశాయి. సునీల్ ఒక్కడే కొంత ఊరట. కిడ్నాప్ డ్రామా తీయడం ఒక కళ. లేకపోతే ఆడియన్స్ ఇలాంటివి బ్రోచేవారెవరురా అనకుండా భరించేదెలాగరా అనేస్తారు.
This post was last modified on April 20, 2024 10:34 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…