జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు బయట పడకపోవచ్చు కానీ ఫ్రెండ్ షిప్ అంత సులభంగా మారిపోయేది కాదు. సినిమాలో ఒకరి కోసం ఒకరు ప్రాణాలకు తెగించి ఎలాంటి పోరాటాలు చేశారో చూశాం. అదేంటో నిజ జీవితంలో కూడా కాకతాళీయంగా రామరాజు, భీంలకు కొన్ని విషయాల్లో సారూప్యత వస్తోంది. అనుకోకుండా జరిగినా ఇది ఆశ్చర్యకరంగా ఉంది.
ఇవాళ సాయంత్రం జూనియర్ ఎన్టీఆర్ భుజానికి చిన్న శస్త్ర చికిత్స జరిగింది. అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం వల్ల ఆసుపత్రిలో చేరిన తారక్ కు నిపుణులైన వైద్యులు తక్షణం ట్రీట్ మెంట్ చేశారు. ఎనిమిది వారాల పాటు అంటే రెండు నెలలు పూర్తిగా రెస్టు తీసుకుంటే సరిపోతుందని, అభిమానులు సన్నిహితులు కుటుంబ సభ్యులు టెన్షన్ పడాల్సింది ఏమి లేదని హాస్పిటల్ బులెటిన్ పేర్కొంది. ఆ మేరకు అఫీషియల్ గా ఒక ప్రకటన వచ్చింది.
సరిగ్గా ఈ రోజే రామ్ చరణ్ కు కేరళలో ట్రీట్ మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. చిరంజీవి, సురేఖ, ఉపాసన దీని కోసమే తనతో పాటుగా తోడుగా వెళ్లారు. పెద్ది టైంలో తగిలిన దెబ్బలు తీవ్రం కావడంతో వైద్యులు సర్జరీ రికమండ్ చేశారు. థియేటర్ రన్ పూర్తయిపోయి ఓటిటిలో కూడా పెద్ది వచ్చేయడంతో చరణ్ మీద ఎలాంటి బాధ్యత లేదు. అచ్చం తారక్ లాగే చరణ్ కూడా రెండు మూడు నెలలు సంపూర్ణ విశ్రాంతిలోనే ఉండాలి. ఫ్యాన్స్ కోరుకుంటున్నది ఇదే.
వీటి వల్ల డ్రాగన్, ఆర్సి 17 తాలూకు షెడ్యూల్స్ ప్రభావితం చెందుతాయి కానీ ఎవరికైనా ముందు ఆరోగ్యం ముఖ్యం, ఇటీవలే బాలకృష్ణ తన 111 సినిమాలో గాయపడి హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆయనకూ విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. చూస్తుంటే ఈ గాయాల పర్వం టాలీవుడ్ స్టార్లను వెంటాడుతున్నట్టు ఉంది. ఇక ఎవరికి ఇలాంటివి జరగకుండా ఉండాలని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. తారక్, చరణ్, బాలయ్య త్వరగా కోలుకోవాలనేదే అందరి ఆకాంక్ష.
This post was last modified on July 27, 2026 10:02 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…