జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు బయట పడకపోవచ్చు కానీ ఫ్రెండ్ షిప్ అంత సులభంగా మారిపోయేది కాదు. సినిమాలో ఒకరి కోసం ఒకరు ప్రాణాలకు తెగించి ఎలాంటి పోరాటాలు చేశారో చూశాం. అదేంటో నిజ జీవితంలో కూడా కాకతాళీయంగా రామరాజు, భీంలకు కొన్ని విషయాల్లో సారూప్యత వస్తోంది. అనుకోకుండా జరిగినా ఇది ఆశ్చర్యకరంగా ఉంది.
ఇవాళ సాయంత్రం జూనియర్ ఎన్టీఆర్ భుజానికి చిన్న శస్త్ర చికిత్స జరిగింది. అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం వల్ల ఆసుపత్రిలో చేరిన తారక్ కు నిపుణులైన వైద్యులు తక్షణం ట్రీట్ మెంట్ చేశారు. ఎనిమిది వారాల పాటు అంటే రెండు నెలలు పూర్తిగా రెస్టు తీసుకుంటే సరిపోతుందని, అభిమానులు సన్నిహితులు కుటుంబ సభ్యులు టెన్షన్ పడాల్సింది ఏమి లేదని హాస్పిటల్ బులెటిన్ పేర్కొంది. ఆ మేరకు అఫీషియల్ గా ఒక ప్రకటన వచ్చింది.
సరిగ్గా ఈ రోజే రామ్ చరణ్ కు కేరళలో ట్రీట్ మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. చిరంజీవి, సురేఖ, ఉపాసన దీని కోసమే తనతో పాటుగా తోడుగా వెళ్లారు. పెద్ది టైంలో తగిలిన దెబ్బలు తీవ్రం కావడంతో వైద్యులు సర్జరీ రికమండ్ చేశారు. థియేటర్ రన్ పూర్తయిపోయి ఓటిటిలో కూడా పెద్ది వచ్చేయడంతో చరణ్ మీద ఎలాంటి బాధ్యత లేదు. అచ్చం తారక్ లాగే చరణ్ కూడా రెండు మూడు నెలలు సంపూర్ణ విశ్రాంతిలోనే ఉండాలి. ఫ్యాన్స్ కోరుకుంటున్నది ఇదే.
వీటి వల్ల డ్రాగన్, ఆర్సి 17 తాలూకు షెడ్యూల్స్ ప్రభావితం చెందుతాయి కానీ ఎవరికైనా ముందు ఆరోగ్యం ముఖ్యం, ఇటీవలే బాలకృష్ణ తన 111 సినిమాలో గాయపడి హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆయనకూ విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. చూస్తుంటే ఈ గాయాల పర్వం టాలీవుడ్ స్టార్లను వెంటాడుతున్నట్టు ఉంది. ఇక ఎవరికి ఇలాంటివి జరగకుండా ఉండాలని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. తారక్, చరణ్, బాలయ్య త్వరగా కోలుకోవాలనేదే అందరి ఆకాంక్ష.
This post was last modified on July 28, 2026 8:07 am
చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…