సీట్ల పంపకం ఎప్పుడో ఓ కొలిక్కి వచ్చేసింది. చిన్నా చితకా మార్పులు చివరి నిమిషంలో వుంటాయా.? అంటే, అప్పటిదాకా సాగదీయాలన్న ఆలోచన టీడీపీ, జనసేన పార్టీల్లో అస్సలు కనిపించడం లేదు. బీజేపీ విషయంలోనే ఇంకా కొంత కన్ఫ్యూజన్ వుంది. బీజేపీ అభ్యర్థులు గ్రౌండ్ లెవల్లో ఆశించిన మేర, ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శించలేకపోతున్నారు.
ఇదిలా వుంటే, మూడు పార్టీల మధ్యా ఓటు ట్రాన్స్ఫర్ విషయమై మొదట్లో చాలా అనుమానాలుండేవి. అప్పటికి కూటమిలోకి బీజేపీ ఇంకా రాలేదు. టీడీపీ – జనసేన మధ్యనే ఓటు ట్రాన్స్ఫర్ సజావుగా జరుగుతుందా.? లేదా.? అన్న ఆందోళన ఇరు పార్టీల్లోనూ వుండేది. సీట్ల పంపకాలు కూడా జరగకముందు పరిస్థితి ఇది.
అయితే, క్రమక్రమంగా ఇరు పార్టీలకు చెందిన శ్రేణులు సర్దుకుపోవడం మొదలు పెట్టాయి. అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే తమ తమ పార్టీల శ్రేణులకు చేసిన సూచనలు ఫలించాయి. ఇంకోపక్క, వైసీపీ నుంచి కూటమి మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు కొనసాగుతూనే వున్నాయి.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటనల సందర్భంగా, ఇరువురూ పరస్పరం గౌరవించుకోవడం, ఒక పార్టీని ఇంకో పార్టీ ప్రమోట్ చేసుకోవడం.. ఇవన్నీ ఇరు పార్టీల శ్రేణుల్లోనూ వున్న కాస్తో కూస్తో పొరపచ్చాలు కూడా తొలగిపోవడానికి కారణమయ్యాయి.
తాజాగా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్వహించిన ఉమ్మడి రోడ్ షోలు, బహిరంగ సభలు, రెండు పార్టీల శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అయితే, చివరి వరకు.. అంటే, ఎన్నికల పోలింగ్ వరకూ.. మూడు పార్టీల కార్యకర్తల మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఆయా పార్టీల ముఖ్య నేతలు, అధినేతలూ జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది.
చిన్న చిన్న విషయాలపై సోషల్ మీడియా వేదికగా, తమ మెయిన్ స్ట్రీమ్ వేదికగా వైసీపీ అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారం, కూటమికి ఓటు ట్రాన్స్ఫర్ విషయంలో చిక్కులు తెచ్చిపెట్టే అవకాశాలూ లేకపోలేదు.!
This post was last modified on April 12, 2024 10:47 pm
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…