Political News

నారా లోకేష్ ఐఫోన్ ట్యాప్‌.. నిజ‌మేనా?

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వినియోగిస్తున్న ఐఫోన్ ట్యాపింగ్‌కు గురైందంటూ.. వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. ఐఫోన్ కంపెనీ యాపిల్‌… ఈ మేర‌కు ఆయ‌న ఫోన్‌కు సందేశాలు పంపించి న‌ట్టు టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. అదేస‌మ‌యంలో హ్యాకింగ్‌కు కూడా గుర‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని నారా లోకేష్ కు ఫోన్ సందేశాలు అదేవిధం మెయిల్‌కు కూడా సందేశాలు అందాయని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. దీనివెనుక వైసీపీ నేతల హ‌స్తం ఉంద‌ని.. పార్టీ నేత‌లు ఆరోపించారు.

మ‌రి దీనిలో నిజం ఎంత‌?  అనేది ప‌క్క‌న పెడితే.. ఐఫోన్ కంపెనీ యాపిల్ రెండురోజుల కింద‌టే ప్ర‌పంచ వ్యాప్తంగా బ‌హిరంగ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. త‌మ కంపెనీ ఫోన్ల‌లో `స్పైవేర్‌` జొర‌బ‌డే అవ‌కాశం ఉంద‌ని.. కాబ‌ట్టి ఫోన్ల‌ను జాగ్ర‌త్త‌గా ఆప‌రేట్ చేయాల‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేసింది. ప్ర‌స్తుతం అమెరికా, భార‌త్ స‌భా ప‌లు దేశాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఐఫోన్లు వినియోగిస్తున్న సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నేత‌ల‌ను టార్గెట్ చేసుకుని.. స్పైవేర్ సృష్టిక‌ర్త‌ల‌ను ఫోన్ల‌ను హ్యాక్‌, ట్యాపింగ్ చేస్తున్నార‌ని తెలిపింది.

ఈ నేప‌థ్యంలో అన్ని దేశాల‌ను యాపిల్ కంపెనీ అలెర్ట్ చేసింది. మ‌న దేశం విష‌యానికి వ‌స్తే.. త‌మిళ‌నాడులో అధికార పార్టీ డీఎంకే నేత‌లు ఇప్ప‌టిక కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి త‌మ యాపిల్ ఐఫోన్లు ట్యాపింగ్‌కు గుర‌వుతున్నాయ‌ని తెలిపారు. ఇక‌, కేంద్రంలో మంత్రులుగా ఉన్న ఒక‌రిద్ద‌రి  ఫోన్లు(స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్ సింగ్) ట్యాప్ అవుతున్నాయ‌ని ఇదే త‌ర‌హా ఫిర్యాదులు ఐటీ శాఖ‌కు తెలిపారు. క‌ర్ణాట‌క‌లో డీకే శివ‌కుమార్ ఫోన్ రెండు నెల‌లుగా ట్యాప్ అవుతోంద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. అంటే.. మొత్తానికి ఈ స‌మ‌స్య దేశ‌వ్యాప్తంగా ఉంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ నేత‌లే చేశారా?  చేయించారా? అనేది రాజ‌కీయ వివాద‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 

This post was last modified on April 12, 2024 9:51 pm

Share

Recent Posts

తెలంగాణా బీజేపీలో కారు లొల్లి

తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…

36 minutes ago

ఓజి యునివర్స్ ఊహించనంత పెద్దగా

ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…

1 hour ago

రెండో భాస్కర్ అంత వేగంగా రాగలడా

సోలో హీరోగా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాతోనూ వంద కోట్లు వసూలు చేయగలడని నిరూపించిన లక్కీ భాస్కర్ కొనసాగింపు…

2 hours ago

నాపై కాదు రేవంత్ పై చర్యలు తీసుకోవాలి: కొండా సురేఖ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు సుస్మిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే,…

3 hours ago

మలేరియా టాబ్లెట్లు మింగి ఒక బాలిక మృతి… 53 మందికి అస్వస్థత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలకలం రేగింది. వైద్య సిబ్బంది పంపిణీ చేసిన మలేరియా మాత్రలు మింగిన…

4 hours ago

ప్యారడైజ్ దుస్తులకు ఖరీదు ఎక్కువే

సెప్టెంబర్ 24 విడుదల కాబోతున్న ప్యారడైజ్ కోసం అభిమానుల ఎదురు చూపుల గురించి ఎంత చెప్పినా తక్కువే. నాని కెరీర్…

5 hours ago