టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వినియోగిస్తున్న ఐఫోన్ ట్యాపింగ్కు గురైందంటూ.. వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఐఫోన్ కంపెనీ యాపిల్… ఈ మేరకు ఆయన ఫోన్కు సందేశాలు పంపించి నట్టు టీడీపీ నాయకులు చెబుతున్నారు. అదేసమయంలో హ్యాకింగ్కు కూడా గురయ్యే ప్రమాదం ఉందని నారా లోకేష్ కు ఫోన్ సందేశాలు అదేవిధం మెయిల్కు కూడా సందేశాలు అందాయని పార్టీ వర్గాలు తెలిపాయి. దీనివెనుక వైసీపీ నేతల హస్తం ఉందని.. పార్టీ నేతలు ఆరోపించారు.
మరి దీనిలో నిజం ఎంత? అనేది పక్కన పెడితే.. ఐఫోన్ కంపెనీ యాపిల్ రెండురోజుల కిందటే ప్రపంచ వ్యాప్తంగా బహిరంగ ప్రకటన జారీ చేసింది. తమ కంపెనీ ఫోన్లలో `స్పైవేర్` జొరబడే అవకాశం ఉందని.. కాబట్టి ఫోన్లను జాగ్రత్తగా ఆపరేట్ చేయాలని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రస్తుతం అమెరికా, భారత్ సభా పలు దేశాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఐఫోన్లు వినియోగిస్తున్న సెలబ్రిటీలు, రాజకీయ నేతలను టార్గెట్ చేసుకుని.. స్పైవేర్ సృష్టికర్తలను ఫోన్లను హ్యాక్, ట్యాపింగ్ చేస్తున్నారని తెలిపింది.
ఈ నేపథ్యంలో అన్ని దేశాలను యాపిల్ కంపెనీ అలెర్ట్ చేసింది. మన దేశం విషయానికి వస్తే.. తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే నేతలు ఇప్పటిక కేంద్ర ఎన్నికల సంఘానికి తమ యాపిల్ ఐఫోన్లు ట్యాపింగ్కు గురవుతున్నాయని తెలిపారు. ఇక, కేంద్రంలో మంత్రులుగా ఉన్న ఒకరిద్దరి ఫోన్లు(స్మృతి ఇరానీ, రాజ్నాథ్ సింగ్) ట్యాప్ అవుతున్నాయని ఇదే తరహా ఫిర్యాదులు ఐటీ శాఖకు తెలిపారు. కర్ణాటకలో డీకే శివకుమార్ ఫోన్ రెండు నెలలుగా ట్యాప్ అవుతోందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. అంటే.. మొత్తానికి ఈ సమస్య దేశవ్యాప్తంగా ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలే చేశారా? చేయించారా? అనేది రాజకీయ వివాదమేనని అంటున్నారు పరిశీలకులు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…