గత ఏడాది ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొన్నప్పటికీ.. దాన్నుంచి త్వరగానే కోలుకుని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తోంది జనసేన పార్టీ. కరోనా విజృంభిస్తున్న వేళ ఏపీలో జనసేన నాయకులు, కార్యకర్తలు చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రశంసలందుకుంటున్నాయి.
ఎన్నికలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో కూడా జనసేన మద్దతుదారులు చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కరోనాపై అవగాహన పెంచడానికి, సేవా కార్యక్రమాలకు, పార్టీ విధానాల్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు.. అలాగే అధికార పార్టీని ఎదుర్కొనేందుకు సోషల్ మీడియానే వేదికగా చేసుకుంటున్నారు. ట్విట్టర్లో జనసేన పార్టీ ఫాలోవర్లు గత కొన్ని నెలల్లో బాగా పెరిగారు. అక్కడ ఆ పార్టీ అఫీషియల్ పేజీ ఓ రికార్డును కూడా కైవసం చేసుకుంది.
ట్విట్టర్లో మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకుంది జనసేన పార్టీ. ఏపీ, తెలంగాణల్లోనే కాదు.. మొత్తంగా సౌత్ ఇండియాలో 1 మిలియన్ ట్విట్టర్ ఫాలోవర్లను సంపాదించుకున్న తొలి పార్టీ జనసేనే కావడం విశేషం. ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్కు ట్విట్టర్లో 5.6 లక్షల మంది దాకా ఫాలోవర్లున్నారు.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అని పేరున్న తెలుగుదేశం పార్టీ ఫాలోవర్లు 4 లక్షలే. జనసేన ఫాలోవర్లలో ఎక్కువ మంది యువతే కావడం.. వారిలో చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం వల్ల ఆ పార్టీకి ఇంత భారీగా ట్విట్టర్ ఫాలోవర్లున్నారు.
ట్విట్టర్లో రాజకీయ, సామాజిక విషయాల గురించి మాత్రమే మాట్లాడే పవన్ కళ్యాణ్కు 4 మిలియన్ల దాకా ఫాలోవర్లున్నారు. వారిలో మెజారిటీ ఫాలోవర్లను ఇటు మళ్లించగలిగితే జనసేన ఫాలోవర్ల సంఖ్య ఇంకా పెంచుకోవచ్చు. ఐతే ఈ ఫాలోవర్లను ఓటర్లుగా మార్చడమే జనసేన ముందున్న కర్తవ్యం.
This post was last modified on April 26, 2020 9:22 pm
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
నిందితులను పోలీసులు పబ్లిక్లో కొట్టడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అటువంటి సందర్భాల్లో అలా కొట్టడం మానవ హక్కుల ఉల్లంఘన…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…