సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ సినిమాగానే కాదు గత నలభై రోజులుగా తమ హాళ్లకు ఫీడింగ్ ఇచ్చే స్టార్ హీరో బొమ్మ ఒక్కటీ రాకపోవడం వాళ్ళను వారాల తరబడి నిరాశలో ఉంచింది. ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా చాలా చిత్రాలు వచ్చాయి కానీ అన్ని వర్గాలను మెప్పించినవి ఒక్కటంటే ఒక్కటి లేవు.
సో ఉస్తాద్ భగత్ సింగ్ మళ్ళీ థియేటర్లకు కళకళలాడేలా చేయాలి. ఇప్పుడు మంచి ఛాన్స్ దొరికింది. సంక్రాంతి తర్వాత థియేటర్లకు దూరంగా ఉన్న మాస్ ఆడియన్స్ కు మొదటి ఛాయస్ పవన్ మూవీనే కానుంది. దాన్ని సరిగ్గా క్యాష్ చేసుకోవాలి. దురంధర్ రివెంజ్ ప్రీమియర్లను దృష్టిలో ఉంచుకుని ముందు రోజు రాత్రి బెనిఫిట్ షోలు వేసే ఆలోచనని మైత్రి మేకర్స్ దాదాపుగా మానుకున్నారు. ఇది మంచి ఆలోచనని చెప్పాలి.
సూపర్ హిట్ అయితే టెన్షన్ లేదు కానీ ఉస్తాద్ భగత్ సింగ్ కనీసం యావరేజ్ నుంచి ఎబోవ్ యావరేజ్ అనిపించుకున్నా చాలు వసూళ్ల వర్షం ఖాయం. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందా బిసి సెంటర్లలో దురంధర్ ని పక్కకు నెట్టేయడం ఖాయం. పాజిటివిటీ ఉంటే పవన్ చేసే రచ్చ ఆ స్థాయిలో ఉంటుంది. ఓజిని మించిన ఉదాహరణ అక్కర్లేదు. ఎటొచ్చి పబ్లిక్ తో ఎంతో బాగుందనే మాట బయటికి రప్పించుకోవాలి. యునానిమస్ గా వాళ్ళను మెప్పించాలి.
సెన్సార్ టాక్స్, ఇంటర్వ్యూలలో హరీష్ శంకర్ చెబుతున్న మాటలను బట్టి చూస్తే కంటెంట్ ఏదో సాలిడ్ గానే ఉన్నట్టుంది. కాంబినేషన్ పరంగా గబ్బర్ సింగ్ ని మించి ఆశిస్తున్నారు అభిమానులు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద కూడా అంచనాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు ఉండకపోవచ్చని అంటున్నారు కానీ ఏపీలో ఎంత హైక్ తీసుకుంటారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. అన్నీ సానుకూలంగా ఉంటే మాత్రం ఉస్తాద్ మీద కలెక్షన్ల వర్షం ఖాయం.
గత ఎన్నికల సమయంలో కొందరు నాయకులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో వారు ఓడిపోయారు. అయితే.. ఆ తర్వాత పలువురు నేతలు..…
సత్యనారాయణ గారూ.. రేపు సిద్ధాంతం వస్తున్నా.. అక్కడ కలుద్దాం. అంటూ 87 ఏళ్ల వృద్ధుడు సత్యనారాయణకు ఆదివారం సీఎం చంద్రబాబు…
పెద్ది ఫలితం బాగుంది. కలెక్షన్లు చక్కగా వస్తున్నాయి. సోమవారం పరీక్ష కూడా నెగ్గింది. అయితే ఎక్కడో చిన్న అసంతృప్తి అభిమానులను…
తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు హిట్లర్ పేరుపై రచ్చ సాగుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల…
ఏపీకి బ్రాండ్ గా కొనసాగుతున్న విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు అక్కడిక్కడే…
మన దేశంలో కార్యనిర్వాహక వ్యవస్థలో అలసత్వం అంతకంతకూ పెరిగిపోతోంది. శాసన వ్యవస్త ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిన కీలకమైన బాధ్యత…