ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు టాలీవుడ్ ఒక మూసలో సినిమాలు చేస్తున్న టైంలో ఐతే లాంటి అద్భుతమైన సినిమాతో సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన దర్శకుడు.. చంద్రశేఖర్ యేలేటి. ఆ తర్వాత ఆయన తీసిన ‘అనుకోకుండా ఒక రోజు’ ఇంకా స్పెషల్. అది కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది.
ఆ తర్వాత కూడా ఒక్కడున్నాడు, సాహసం, ప్రయాణం, మనమంతా లాంటి వెరైటీ చిత్రాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారాయన. కానీ చివరి చిత్రం ‘చెక్’ తీవ్ర నిరాశకు గురి చేయడంతో యేలేటి సైలెంట్ అయిపోయారు.
కొన్నేళ్లుగా ఆయన సినిమా ప్రయత్నాలే చేస్తున్నట్లు కనిపించడం లేదు. మధ్యలో ప్రొడక్షన్ చేద్దామని చూసినా కుదరలేదు. ఇక మళ్లీ యేలేటి సినిమా తీయడేమో అని చాలామంది అనుకున్నారు. కానీ ఈ విలక్షణ దర్శకుడు మళ్లీ ఓ సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తుండడం తన అభిమానులకు ఉత్సాహాన్నిస్తోంది.
యేలేటితో సినిమాను నిర్మించడానికి ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ రెడీ అయినట్లు తెలుస్తోంది. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న తమిళ లేటెస్ట్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా సినిమా చేయడానికి యేలేటి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ అతడికున్న డిమాండ్, కమిట్మెంట్ల దృష్ట్యా ఇప్పుడు యేలేటి సినిమాకు ఓకే అంటాడా అన్నది సందేహమే.
ఐతే ప్రదీప్ కాకపోతే ఇంకో హీరోతో సినిమా చేయొచ్చు. కానీ యేలేటి మళ్లీ మెగా ఫోన్ పట్టాలనుకోవడమే తన అభిమానులకు అమితానందాన్ని ఇస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్లలో యేలేటి ఒక ఓజీ అన్నది అందరూ అంగీకరించాల్సిన విషయం.
చివరి చిత్రాలు సరైన ఫలితాన్ని అందుకోకపోయినా.. ఇప్పటికీ ఆయన శ్రద్ధ పెడితే కల్ట్ మూవీస్ తీయగలడని చెప్పొచ్చు. మరి యేలేటి సినిమాలో నటించే హీరో ఎవరవుతారో.. ఆయన ఈసారి ఎలాంటి కాన్సెప్ట్తో వస్తాడు అన్నది ఆసక్తికరం. త్వరలోనే ఈ తీపికబురును అభిమానులు వినొచ్చు.
This post was last modified on March 12, 2026 10:43 am
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లే లక్ష్యంగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. భారత…
తెలుగు సినిమా చరిత్రలోనే ది బెస్ట్ లవ్ స్టోరీల లిస్ట్ తీస్తే.. అందులో ‘తొలిప్రేమ’ కచ్చితంగా ఉంటుంది. తమిళుడైన కరుణాకరన్ ఈ…
ఇంకో అయిదు రోజుల్లో ధనుష్ కర విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులో సమాంతరంగా రిలీజ్ చేస్తున్నా ఇక్కడ ప్రమోషన్ల…
వరుణ్ తేజ్ను పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్లిన లావణ్య త్రిపాఠి.. తర్వాత సినిమాలకు దాదాపుగా దూరమైనట్లే కనిపించింది. ఐతే పెళ్లి…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక `బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్` అవార్డు లభించింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో శనివారం…
నాయకులు పద్ధతిగా వ్యవహరించాలని.. మర్యాదగా మెలగాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పదే పదే ఎమ్మెల్యేలు, వారి అనుచరులకు కూడా…