గ‌వ‌ర్న‌ర్ ఇలా చేసి ఉండాల్సింది కాదు

తెలంగాణలోని గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీ ల విష‌యంలో చోటుచేసుకున్న వివాదానికి హైకోర్టు తెర‌దించిం ది. గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం సిఫార‌సు చేసిన వారి విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌హ‌రించిన తీరును కోర్టు త‌ప్పుబ‌ట్టింది. అదే స‌మ‌యంలో ప్ర‌స్తుత ప్ర‌భుత్వం చేసిన సిఫార‌సు మేర‌కు గ‌వ‌ర్న‌ర్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను కూడా ఆక్షేపించింది. ఇలా చేసి ఉండాల్సింది కాదు అని గ‌వ‌ర్న‌ర్‌ను ఉద్దేశించికోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్ర‌మంలో రేవ‌త్‌రెడ్డి ప్ర‌భుత్వం సిఫార‌సు చేసిన ప్రొఫెస‌ర్ కోదండ‌రాం, అమిర్ అలీఖాన్‌ల అభ్య‌ర్థిత్వాల‌ను కోర్టు తోసిపుచ్చింది.

ఏం జ‌రిగింది?

కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ ఎస్ ప్రభుత్వ హ‌యాంలో దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణల‌ను గ‌వ‌ర్న‌ర్ కోటాలో మండ‌లికి నామినేట్‌ చేస్తూ గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు మంత్రి మండలి తీర్మానం చేసింది. దీనిని ఆమోదించాల‌ని కోరుతూ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సైకి పంపించారు. అయితే..ఆమె దీనిని ఆమోదించ‌క‌పోగా రోజుల వ్య‌వ‌ధిలోనే తిరస్కరించారు. దీంతో గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యాన్ని సవాల్‌ చేస్తూ దాసోజు, కుర్రాలు హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్‌ పరిధి దాటి వ్యవహరించారని, మంత్రిమండలికి ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉంద‌ని పిటిషనర్లు పేర్కొన్నారు. దీనిపై ఇంకా తీర్పు రావాల్సి ఉంది.(అప్ప‌టికి)

ఇంత‌లోనే తెలంగాణ‌లో ప్ర‌భుత్వం మారిపోయింది. ఆ వెంట‌నే సీఎం రేవంత్‌రెడ్డి ఇదే గ‌వ‌ర్న‌ర్ నామినే టెడ్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమిర్‌ అలీఖాన్‌లను సిఫార్సు చేస్తూ.. గవర్నర్ కు ఫైలు పం పించారు. ఆ వెంట‌నే గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై వారి పేర్లను ఆమోదించారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం కూడా లభించడంతో వారి నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

యూట‌ర్న్ ఇలా..

రేవంత్ స‌ర్కారు సిఫారసు చేసిన అభ్య‌ర్థుల వ్య‌వ‌హారంపై మ‌రోసారి బీఆర్ ఎస్ నేత‌లు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాము వేసిన పిటిషన్‌పై నిర్ణయం వెలువడే వరకూ ఈ నియామకాలు ఆపాలని పిటిషన్‌లో కోరారు. దీంతో తాజాగా హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలని పేర్కొంది.

ఏం జ‌రుగుతుంది: మ‌రికొద్ది రోజుల్లో అంటే ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత కావొచ్చు.. లేదా ముందే అయినా.. మ‌ళ్లీ అమిర్‌, కోదండరాంల‌కే అవ‌కాశం ఇస్తూ.. నామినేట్ చేయొచ్చు.