Political News

బీజేపీలో తిరుగుబాటా ?

తెలంగాణా బీజేపీలో నేతలు తిరుగుబాటు చేస్తున్నారా ? పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవునేని అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే మల్కాజ్ గిరి పార్లమెంటు సీటు విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయంతో స్ధానిక నేతలు తీవ్రస్థాయిలో విభేదిస్తున్నారట. మల్కాజ్ గిరి పార్లమెంటులో ఈటల రాజేందర్ ను పోటీ చేయించాలని ఇప్పటికే అగ్రనేతలు డిసైడ్ చేశారు. పార్టీ వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. అయితే ఇదే సీటునుండి పోటీచేయటానికి చాలామంది నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మల్కాజ్ గిరికి నాన్ లోకల్ అయిన ఈటలను ఎలా పోటీ చేయిస్తారని లోకల్ నేతలు గట్టిగా నిలదీస్తున్నారు.

మల్కాజ్ గిరి నుండి పోటీ చేయడానికి కూన శ్రీశైలం గౌడ్, చాడ సురేష్ రెడ్డి, పన్నాల హరీష్ రెడ్డి, మురళీధరరావు, మల్క కొమురయ్య ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీరిలో కొమురయ్య రాజకీయాలకు పూర్తిగా కొత్త. అయితే మిగిలిన నేతలు చాలాకాలంగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళే. వీరిలో కొందరు అనేక పార్టీలు తిరిగి ఇపుడు బీజేపీలో ఉన్నారు. మల్కాజ్ గిరిలో పోటీచేయటానికి ఇంతమంది లోకల్ నేతలుండగా నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధం లేని ఈటలను తీసుకొచ్చి పోటీచేయించాల్సిన అవసరం ఏమిటన్నది వీళ్ళ లాజిక్.

వీళ్ళ వ్యవహరం చూస్తుంటే అధిష్టానం ఈటలకు టికెట్ కన్ఫర్మ్ చేస్తే పార్టీపై తిరుగుబాటు చేసేట్లుగానే ఉన్నారు. ఇప్పటికే కూన తన మద్దతుదారులతో సమావేశాలు పెట్టుకుని భవిష్యత్ రాజకీయాలపై చర్చలు జరుపుతున్నారట. ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీచేసిన ఈటల రెండుచోట్లా ఓడిపోవటమే పెద్ద మైనస్ అయ్యిందట. గజ్వేలులో కేసీయార్ కు వ్యతిరేకంగా పోటీచేసి ఓడిపోయిన ఈటల సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లో కూడా ఓడిపోయారని ప్రత్యర్ధులు ఎత్తిచూపుతున్నారు.

రెండుచోట్లా ఓడిపోయిన ఈటలకు మళ్ళీ ఇపుడు మల్కాజ్ గిరి లాంటి సంబంధంలేని నియోజకవర్గంలో ఎంపీగా ఎలా పోటీచేయిస్తారంటు నిలదీస్తున్నారు. ఈటలకు టికెట్ వస్తే ప్రత్యర్ధులు ఇండిపెండెట్లుగా పోటీచేయకపోవచ్చు. అయితే బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లోనో లేకపోతే బీఆర్ఎస్ లోనో చేరిపోతారు. అప్పుడు ఈటలకు వ్యతిరేకంగా పోటీచేసి బీజేపీని ఓడగొట్టడం ఖాయమని అర్ధమవుతోంది. మొత్తానికి బీజేపీలో మల్కాజ్ గిరి చిచ్చు మామూలుగా ఉండేట్లులేదు. చివరకు ఏమవుతుందో చూడాలి.

This post was last modified on March 2, 2024 10:08 am

Share
Show comments
Published by
satya

Recent Posts

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

9 mins ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

12 mins ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

54 mins ago

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

2 hours ago

అల్లు అర్జున్ వివాదం ఎక్కడి దాకా

ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…

3 hours ago

కృష్ణమ్మా….ఎంత పని చేశావమ్మా

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

4 hours ago