Political News

బీజేపీలో తిరుగుబాటా ?

తెలంగాణా బీజేపీలో నేతలు తిరుగుబాటు చేస్తున్నారా ? పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవునేని అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే మల్కాజ్ గిరి పార్లమెంటు సీటు విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయంతో స్ధానిక నేతలు తీవ్రస్థాయిలో విభేదిస్తున్నారట. మల్కాజ్ గిరి పార్లమెంటులో ఈటల రాజేందర్ ను పోటీ చేయించాలని ఇప్పటికే అగ్రనేతలు డిసైడ్ చేశారు. పార్టీ వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. అయితే ఇదే సీటునుండి పోటీచేయటానికి చాలామంది నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మల్కాజ్ గిరికి నాన్ లోకల్ అయిన ఈటలను ఎలా పోటీ చేయిస్తారని లోకల్ నేతలు గట్టిగా నిలదీస్తున్నారు.

మల్కాజ్ గిరి నుండి పోటీ చేయడానికి కూన శ్రీశైలం గౌడ్, చాడ సురేష్ రెడ్డి, పన్నాల హరీష్ రెడ్డి, మురళీధరరావు, మల్క కొమురయ్య ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీరిలో కొమురయ్య రాజకీయాలకు పూర్తిగా కొత్త. అయితే మిగిలిన నేతలు చాలాకాలంగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళే. వీరిలో కొందరు అనేక పార్టీలు తిరిగి ఇపుడు బీజేపీలో ఉన్నారు. మల్కాజ్ గిరిలో పోటీచేయటానికి ఇంతమంది లోకల్ నేతలుండగా నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధం లేని ఈటలను తీసుకొచ్చి పోటీచేయించాల్సిన అవసరం ఏమిటన్నది వీళ్ళ లాజిక్.

వీళ్ళ వ్యవహరం చూస్తుంటే అధిష్టానం ఈటలకు టికెట్ కన్ఫర్మ్ చేస్తే పార్టీపై తిరుగుబాటు చేసేట్లుగానే ఉన్నారు. ఇప్పటికే కూన తన మద్దతుదారులతో సమావేశాలు పెట్టుకుని భవిష్యత్ రాజకీయాలపై చర్చలు జరుపుతున్నారట. ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీచేసిన ఈటల రెండుచోట్లా ఓడిపోవటమే పెద్ద మైనస్ అయ్యిందట. గజ్వేలులో కేసీయార్ కు వ్యతిరేకంగా పోటీచేసి ఓడిపోయిన ఈటల సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లో కూడా ఓడిపోయారని ప్రత్యర్ధులు ఎత్తిచూపుతున్నారు.

రెండుచోట్లా ఓడిపోయిన ఈటలకు మళ్ళీ ఇపుడు మల్కాజ్ గిరి లాంటి సంబంధంలేని నియోజకవర్గంలో ఎంపీగా ఎలా పోటీచేయిస్తారంటు నిలదీస్తున్నారు. ఈటలకు టికెట్ వస్తే ప్రత్యర్ధులు ఇండిపెండెట్లుగా పోటీచేయకపోవచ్చు. అయితే బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లోనో లేకపోతే బీఆర్ఎస్ లోనో చేరిపోతారు. అప్పుడు ఈటలకు వ్యతిరేకంగా పోటీచేసి బీజేపీని ఓడగొట్టడం ఖాయమని అర్ధమవుతోంది. మొత్తానికి బీజేపీలో మల్కాజ్ గిరి చిచ్చు మామూలుగా ఉండేట్లులేదు. చివరకు ఏమవుతుందో చూడాలి.

This post was last modified on March 2, 2024 10:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

46 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago