ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న నేపధ్యంలో నేతల పార్టీ దూకుళ్ళు బాగా పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే టీడీపీలోకి కొందరు బిగ్ షాట్స్ చేరబోతున్నారు. శనివారం వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, మైలవరం ఎంఎల్ఏ వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరుతున్నారు. అలాగే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు కూడా చేరబోతున్నారు. ఇపుడు పార్టీలో చేరుతున్న, చేరబోతున్న వారందరికి మళ్ళీ అవే స్ధానాల్లో టికెట్లు ఇవ్వటానికి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చినట్లు పార్టీవర్గాల సమాచారం.
ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి బదులు ఆయన కొడుకు మాగుంట రాఘవరెడ్డి పోటీచేయబోతున్నారు. వీళ్ళు కాకుండా ఇప్పటికే పెనమలూరు ఎంఎల్ఏ కొలుసు పార్ధసారధి టీడీపీలో చేరి నూజివీడు నుండి టికెట్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అలాగే మరో ఇద్దరు ఎంఎల్ఏలు రక్షణనిధి, కైలే అనీల్ కుమార్ కూడా టీడీపీలో చేరే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. వీళ్ళకి టికెట్ల హామీ దక్కలేదు కాబట్టే చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
తొందరలోనే ఇంకెంతమంది టీడీపీలో చేరటానికి రెడీ అవుతున్నారో తెలీదు. మొత్తానికి వైసీపీలో నుండి టీడీపీలో చేరుతున్న నేతల వల్ల పార్టీకి ఎంతోకొంత ఉపయోగం అయితే ఉంటుందనే అనుకుంటున్నారు. విషయం ఏమిటంటే వేమిరెడ్డి, లావు, మాగుంట ఆర్ధికంగా అత్యంత పటిష్టమైన స్ధితిలో ఉన్నారని అందరికీ తెలిసిందే. పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయబోతున్న వీళ్ళు తమ ఖర్చులను పెట్టుకుంటునే ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఖర్చులను కూడా చాలా తేలిగ్గా భరించగలరు. ఇలాంటి ఆర్ధికంగా స్ధితిమంతుల అవసరం ప్రతిపార్టీకి ఉంటుందనటంలో సందేహంలేదు.
పోయిన ఎన్నికల్లో వీళ్ళంతా వైసీపీని ఆర్ధికంగా ఆదుకున్న విషయం అందరికీ తెలిసిందే. అదే నేతలు రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులుగా పార్టీని ఆదుకుంటారనటంలో సందేహంలేదు. ఇలాంటి అభ్యర్ధులు పార్టీల గెలుపోటములను కొంతవరకు ప్రభావితం చేయగలరు. టీడీపీలో ఇలాంటి నేతలకు దక్కే ఆదరణను బట్టి వైసీపీ నుండి ఇంకెంతమంది నేతలు, అసంతృప్తనేతలు బయటకు వచ్చేస్తారో చూడాలి. ఏదేమైనా వైసీపీని వదిలేసి బిగ్ షాట్స్ టీడీపీలోకి చేరటం అన్నది డెఫనెట్ గా అడ్వాంటేజ్ అనే చెప్పాలి.
This post was last modified on March 2, 2024 10:13 am
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…