ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న నేపధ్యంలో నేతల పార్టీ దూకుళ్ళు బాగా పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే టీడీపీలోకి కొందరు బిగ్ షాట్స్ చేరబోతున్నారు. శనివారం వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, మైలవరం ఎంఎల్ఏ వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరుతున్నారు. అలాగే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు కూడా చేరబోతున్నారు. ఇపుడు పార్టీలో చేరుతున్న, చేరబోతున్న వారందరికి మళ్ళీ అవే స్ధానాల్లో టికెట్లు ఇవ్వటానికి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చినట్లు పార్టీవర్గాల సమాచారం.
ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి బదులు ఆయన కొడుకు మాగుంట రాఘవరెడ్డి పోటీచేయబోతున్నారు. వీళ్ళు కాకుండా ఇప్పటికే పెనమలూరు ఎంఎల్ఏ కొలుసు పార్ధసారధి టీడీపీలో చేరి నూజివీడు నుండి టికెట్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అలాగే మరో ఇద్దరు ఎంఎల్ఏలు రక్షణనిధి, కైలే అనీల్ కుమార్ కూడా టీడీపీలో చేరే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. వీళ్ళకి టికెట్ల హామీ దక్కలేదు కాబట్టే చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
తొందరలోనే ఇంకెంతమంది టీడీపీలో చేరటానికి రెడీ అవుతున్నారో తెలీదు. మొత్తానికి వైసీపీలో నుండి టీడీపీలో చేరుతున్న నేతల వల్ల పార్టీకి ఎంతోకొంత ఉపయోగం అయితే ఉంటుందనే అనుకుంటున్నారు. విషయం ఏమిటంటే వేమిరెడ్డి, లావు, మాగుంట ఆర్ధికంగా అత్యంత పటిష్టమైన స్ధితిలో ఉన్నారని అందరికీ తెలిసిందే. పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయబోతున్న వీళ్ళు తమ ఖర్చులను పెట్టుకుంటునే ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఖర్చులను కూడా చాలా తేలిగ్గా భరించగలరు. ఇలాంటి ఆర్ధికంగా స్ధితిమంతుల అవసరం ప్రతిపార్టీకి ఉంటుందనటంలో సందేహంలేదు.
పోయిన ఎన్నికల్లో వీళ్ళంతా వైసీపీని ఆర్ధికంగా ఆదుకున్న విషయం అందరికీ తెలిసిందే. అదే నేతలు రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులుగా పార్టీని ఆదుకుంటారనటంలో సందేహంలేదు. ఇలాంటి అభ్యర్ధులు పార్టీల గెలుపోటములను కొంతవరకు ప్రభావితం చేయగలరు. టీడీపీలో ఇలాంటి నేతలకు దక్కే ఆదరణను బట్టి వైసీపీ నుండి ఇంకెంతమంది నేతలు, అసంతృప్తనేతలు బయటకు వచ్చేస్తారో చూడాలి. ఏదేమైనా వైసీపీని వదిలేసి బిగ్ షాట్స్ టీడీపీలోకి చేరటం అన్నది డెఫనెట్ గా అడ్వాంటేజ్ అనే చెప్పాలి.
This post was last modified on March 2, 2024 10:13 am
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…