మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ఈ యుద్ధంలో మీరు(మహిళలు) ఎటువైపు నిలబడుతున్నారని ఆమె ప్రశ్నించారు. రాజకీయంగా రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ వైపు నిలబడితే.. మీ కు భవిష్యత్తు ఉండదని తేల్చి చెప్పారు. చంద్రబాబు కోసం నిలబడితే.. మీ పిల్లల భవితవ్యం బంగారు బాట పడుతుందని వ్యాఖ్యానించారు.
నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి యాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది జరిగిన చంద్రబాబు అక్రమ అరెస్ట్ను తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన కార్యకర్తలను ఆమె సముదాయించి, ఓదార్చుతున్నారు. ఇదే సమయంలో ఒక్కొక్క కుటుంబానికీ రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆమె అనకాపల్లి జిల్లాలోని రావికమతం మండలం, గంపవాని పాలెం గ్రామంలో పర్యటించారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు.. కుటుంబాలను ఆమె పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అనే క అరాచకాలు పెరిగిపోతున్నాయని అన్నారు. టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని, పోలీసులు కొడుతు న్నారని.. కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019కి ముందు ఏపీ అంటే.. అభివృద్ధికి చిరునామాగా మంచి పేరు ఉందన్నారు.
కానీ, ఇప్పుడు ఏపీ పేరు గంజాయికి మారుపేరుగా మారిందని వ్యాఖ్యానించారు. కల్తీ మద్యం, ఇసుక మాఫియా గుర్తుకొస్తున్నాయన్నారు. మన దగ్గర ఉన్న ఓటు అనే ఆయుధంతో వైసీపీకి బుద్ధి చెప్పాలని మహిళలను తాను కోరుతున్నానని చెప్పారు. వచ్చేది కురుక్షేత్ర యుద్ధం.. మీరంతా చంద్రబాబుకు మద్దతుగా నిలవాలి. ఇప్పటి కన్నా.. మీకు ఎక్కువగానే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తారు అని నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు.
This post was last modified on March 1, 2024 1:50 pm
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…