మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ఈ యుద్ధంలో మీరు(మహిళలు) ఎటువైపు నిలబడుతున్నారని ఆమె ప్రశ్నించారు. రాజకీయంగా రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ వైపు నిలబడితే.. మీ కు భవిష్యత్తు ఉండదని తేల్చి చెప్పారు. చంద్రబాబు కోసం నిలబడితే.. మీ పిల్లల భవితవ్యం బంగారు బాట పడుతుందని వ్యాఖ్యానించారు.
నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి యాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది జరిగిన చంద్రబాబు అక్రమ అరెస్ట్ను తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన కార్యకర్తలను ఆమె సముదాయించి, ఓదార్చుతున్నారు. ఇదే సమయంలో ఒక్కొక్క కుటుంబానికీ రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆమె అనకాపల్లి జిల్లాలోని రావికమతం మండలం, గంపవాని పాలెం గ్రామంలో పర్యటించారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు.. కుటుంబాలను ఆమె పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అనే క అరాచకాలు పెరిగిపోతున్నాయని అన్నారు. టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని, పోలీసులు కొడుతు న్నారని.. కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019కి ముందు ఏపీ అంటే.. అభివృద్ధికి చిరునామాగా మంచి పేరు ఉందన్నారు.
కానీ, ఇప్పుడు ఏపీ పేరు గంజాయికి మారుపేరుగా మారిందని వ్యాఖ్యానించారు. కల్తీ మద్యం, ఇసుక మాఫియా గుర్తుకొస్తున్నాయన్నారు. మన దగ్గర ఉన్న ఓటు అనే ఆయుధంతో వైసీపీకి బుద్ధి చెప్పాలని మహిళలను తాను కోరుతున్నానని చెప్పారు. వచ్చేది కురుక్షేత్ర యుద్ధం.. మీరంతా చంద్రబాబుకు మద్దతుగా నిలవాలి. ఇప్పటి కన్నా.. మీకు ఎక్కువగానే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తారు అని నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు.
This post was last modified on March 1, 2024 1:50 pm
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…