Political News

కొడుకు ‘యువగళం’.. తండ్రి ‘ప్ర‌జాగ‌ళం’

టీడీపీ అధినేత చంద్ర‌బాబు మ‌రోవినూత్న కార్య‌క్ర‌మంతో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రానున్నారు. వ‌చ్చే నెల 5వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేలా పార్టీ రూప‌క‌ల్ప‌న చేసింది. దీనికి ప్ర‌జా గ‌ళం అని పేరుపెట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో ఐదు రోజుల పాటు నిర్విరామంగా చంద్ర‌బాబు ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉండ‌నున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకోనున్నారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో పాద‌యాత్ర‌లు కూడా చేయ‌నున్నారు.

ప్ర‌జాగ‌ళం కార్య‌క్ర‌మంలో కేవ‌లం చంద్ర‌బాబు మాత్ర‌మే పాల్గొంటార‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. ఇక‌, ఆ త‌ర్వాత‌.. ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో పూర్తిగా ప్ర‌చారానికి ఆయ‌న ప‌రిమితం అవుతారు. ఇక‌, ఈ కార్య‌క్ర‌మం ద్వారా ముఖ్యంగా మ‌హిళా ఓటు బ్యాంకుపై చంద్ర‌బాబు దృష్టి పెట్ట‌నున్నారు. సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌తోపాటు.. మ‌రిన్ని కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తామ‌ని.. ప‌థ‌కాల‌ను తీసుకువ‌స్తా మ‌ని ప్ర‌జ‌ల‌కు ఆయ‌న వివ‌రించ‌నున్నారు.

మెజారిటీగా ఈ కార్య‌క్ర‌మం ద్వారా ఆయ‌న గ్రామీణ ప్రాంతాల‌పై ప‌ట్టు పెంచుకునే ఉద్దేశం ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. గ‌తంలో నారా లోకేష్ యువ‌గ‌ళం పేరుతో కార్య‌క్ర‌మం నిర్వ‌హించి 3 వేల కిలో మీట‌ర్ల‌కు పైగానే పాద‌యాత్ర చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు అదే పేరును కొంత మేర‌కు మార్చి ప్ర‌జాగ‌ళంగా పేరు పెట్టిన‌ట్టు టీడీపీ నేత‌లు చెబుతున్నారు.

ఇక‌, ఇప్ప‌టికే చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి చేస్తున్న నిజంగెల‌వాలి యాత్ర‌ను ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌ర‌కు పొడిగించారు. నారా లోకేష్ శంఖారావం యాత్ర‌లుచేయ‌నున్నారు. మొత్తంగా టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల షెడ్యూల్‌లోపు మ‌రిన్ని కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్ట‌నుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 1, 2024 8:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`వేమిరెడ్డి` వేడి.. వైసీపీని ద‌హిస్తుందా.. !

రాజ‌కీయంగా ప్ర‌శాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రినీ టార్గెట్ చేయ‌లేదు. త‌న స‌తీమ‌ణి,…

26 minutes ago

తెలంగాణ విజ‌న్ డాక్యుమెంట్ లో ఏముంది?

తెలంగాణ‌లో సీఎం రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం.. స్వ‌ప్నిస్తున్న తెలంగాణ విజ‌న్ డాక్యుమెంటును తాజాగా మంగ‌ళ‌వారం సాయంత్రం ఫ్యూచ‌ర్…

35 minutes ago

అఫీషియల్ – అఖండ 2 ఆగమనం

రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…

1 hour ago

హార్దిక్ దెబ్బకు పవర్ఫుల్ విక్టరీ

టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్‌లోని…

2 hours ago

ఏఐ కోసం రూ. 1.5 లక్షల కోట్లు… మైక్రోసాఫ్ట్ భారీ ప్లాన్!

టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…

2 hours ago

అల్లూ వారి పుష్ప కథ బెడిసికొట్టిందా?

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…

2 hours ago