టీడీపీ అధినేత చంద్రబాబు మరోవినూత్న కార్యక్రమంతో ప్రజల మధ్యకు రానున్నారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా పార్టీ రూపకల్పన చేసింది. దీనికి ప్రజా గళం అని పేరుపెట్టారు. ఈ కార్యక్రమంలో ఐదు రోజుల పాటు నిర్విరామంగా చంద్రబాబు ప్రజల మధ్యే ఉండనున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోనున్నారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో పాదయాత్రలు కూడా చేయనున్నారు.
ప్రజాగళం కార్యక్రమంలో కేవలం చంద్రబాబు మాత్రమే పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక, ఆ తర్వాత.. ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా ప్రచారానికి ఆయన పరిమితం అవుతారు. ఇక, ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా మహిళా ఓటు బ్యాంకుపై చంద్రబాబు దృష్టి పెట్టనున్నారు. సూపర్ సిక్స్ పథకాలతోపాటు.. మరిన్ని కార్యక్రమాలను అమలు చేస్తామని.. పథకాలను తీసుకువస్తా మని ప్రజలకు ఆయన వివరించనున్నారు.
మెజారిటీగా ఈ కార్యక్రమం ద్వారా ఆయన గ్రామీణ ప్రాంతాలపై పట్టు పెంచుకునే ఉద్దేశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో నారా లోకేష్ యువగళం పేరుతో కార్యక్రమం నిర్వహించి 3 వేల కిలో మీటర్లకు పైగానే పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు అదే పేరును కొంత మేరకు మార్చి ప్రజాగళంగా పేరు పెట్టినట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు.
ఇక, ఇప్పటికే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేస్తున్న నిజంగెలవాలి యాత్రను ఎన్నికల షెడ్యూల్ వరకు పొడిగించారు. నారా లోకేష్ శంఖారావం యాత్రలుచేయనున్నారు. మొత్తంగా టీడీపీ వచ్చే ఎన్నికల షెడ్యూల్లోపు మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుండడం గమనార్హం.
This post was last modified on March 1, 2024 8:04 am
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…