Political News

ఎస్సీల దిశ‌గా జ‌గ‌న్ అడుగులు.. రెండు పెద్ద స్థానాలు వారికే!

ఎస్సీల‌కు మ‌రింత పెద్ద‌పీట వేసే దిశ‌గా సీఎం జ‌గ‌న్ అడుగులు వేస్తున్నారు. ఒక‌వైపు కాంగ్రెస్ చీఫ్ ష‌ర్మిల‌, మ‌రోవైపు టీడీపీ నేత‌లు పెద్ద ఎత్తున ఎస్సీల‌కు అన్యాయం చేస్తున్నారంటూ.. ప్ర‌చారం చేస్తున్న ద‌రిమిలా.. ఆ ఓటు బ్యాంకును ప‌దిలంగా కాపాడుకునే ల‌క్ష్యంతో జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో ఖాళీ అవుతున్న 3 రాజ్య‌సభ సీట్ల‌లో నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఒక స్థానాన్ని మాత్ర‌మే ఎస్సీల‌కు కేటాయించిన ఆయ‌న ఇప్పుడు రెండుస్థానాల‌ను వారికే కేటాయించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం.

తాజాగా మ‌రోసారి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు తెలిపాయి. ఇప్ప‌టి వ‌రకు ఈ మూడు స్తానాల్లో వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావు(ఎస్సీ) పేర్లను ఖరారు చేసినట్లు కొన్నాళ్ల కింద‌ట వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఇద్దరు రెడ్డి సామాజికవర్గం, ఓ ఎస్సీ నేతకు అవకాశం కల్పించే ఈ నిర్ణ‌యంపై జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గార‌ని తెలిసింది. ఒక రెడ్డి నాయ‌కుడిని ప‌క్క‌న పెట్టి మ‌రో ఎస్సీని ఈ జాబితాలో చేర్చాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం.

ఇంతకు ముందు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు ఓ సీటును ఖరారు చేశారు. రాయలసీమలో బలిజ వర్గానికి చెందిన నేతకు టిక్కెట్ నిరాకరించారు. ఆయనకు బదులుగా చిత్తూరులో రెడ్డి వర్గానికి చెందిన నేతకు టిక్కెట్ కేటాయించారు. ఈ కారణంగా ఆయనకు రాజ్యసభ ఇస్తారనుకున్నారు. కానీ చివరి క్షణంలో కడప జిల్లా రాజంపేటకు చెందిన రఘునాథరెడ్డికి కేటాయించారు. ఇక‌, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నందున రాజ్యసభ స్థానాలకు సంబంధించి తుది నిర్ణయం అవకాశం కనిపిస్తోంది.

ఈ నెల 8న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా రాబోతోంది. అదే రోజున మధ్యాహ్నం ఎమ్మెల్యేలతో మాక్ పోలింగ్ కూడా జరగబోతోంది. ఈ నేప‌థ్యంలో రెండు ఎస్సీల‌కు ఇచ్చి.. ఒక‌టి మాత్ర‌మే రెడ్డి వ‌ర్గానికి ఇవ్వ‌డం ద్వారా.. ఎస్సీల‌కు త‌మ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని వైసీపీ ప్ర‌చారం చేసుకునేలా క‌నిపిస్తోంది. ఎక్కువ మంది రిజర్వుడు నియోజకవర్గాల వారికి టిక్కెట్లు మారుస్తున్నారు. ఈ కారణంగా ఇద్ద‌రు ఎస్సీల‌ను పోటీకి పెడితే.. ఎస్సీ ఎమ్మెల్యేలంతా త‌మ‌వైపే ఉంటార‌న్న‌ది వైసీపీ వ్యూహంగా ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on February 7, 2024 8:57 am

Share

Recent Posts

హద్దుల్లేని విచ్చలవిడితనం తెర మీద చూస్తారా

కరోనా సమయంలో బ్లాక్ బస్టర్ అనిపించుకున్న వెబ్ సిరీస్ లలో మీర్జాపూర్ ఒకటి. కలీన్ భాయ్, అతని కొడుకుతో పాటు…

1 minute ago

అల్లరోడి సత్తాకి దేవకన్యల పరీక్ష

చాలా కాలంగా ఫామ్ లో లేని అల్లరి నరేష్ కామెడీ వర్కౌట్ కావడం లేదని భావించి రకరకాల జానర్లు ట్రై…

48 minutes ago

ఫేకు కుట్రలకు కూటమి చెక్

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వుంది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేసి 164 సీట్లలో విజయభేరి…

1 hour ago

త్రిష పోస్టు ఎవరినుద్దేశించి?

ఈ మధ్య తమిళ సీనియర్ హీరోయిన్ త్రిష పెద్దగా సినిమాలు చేస్తున్నట్లు కనిపించట్లేదు. అయినా ఆమె పేరు మాత్రం నిత్యం…

1 hour ago

స్వాతంత్ర్య వేడుకల్లో ఎర్రకోటపై జెన్ జీ

ఢిల్లీ జంతర్ మంతర్ లో కాక్రోచ్ లు చేపట్టిన ఆందోళన ప్రభావం కేంద్ర ప్రభుత్వం మీద ఎంతో తీవ్రమైన ఎఫెక్ట్…

5 hours ago

ఏపీ మెట్రో పరుగులు ఎక్కడి వరకు వచ్చాయి?

దేశంలోని చాలా నగరాలల్లో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. మెట్రో సేవలు కలిగిన రాష్ట్రాల జాబితాలోకి త్వరలో ఏపీ కూడా చేరబోతోంది. ఇతర…

8 hours ago