స్టార్ హీరోలు, హీరోయిన్ల పారితోషకాల గురించి మీడియాలో, సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఒక పెద్ద హిట్ పడగానే పారితోషకాలు పెరిగిపోయినట్లు వార్తలు హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని నిజాలుంటాయి. కొన్ని కేవలం ఊహాగానాలుగానే ఉంటాయి.
ఇటీవలే సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా బాలీవుడ్ మూవీ యానిమల్తో ఘనవిజయాన్నందుకుంది. దీంతో ఆమె రెమ్యూనరేషన్ ఒక్కసారిగా పెరిగిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆమె పారితోషకంగా 4 కోట్లు దాటిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై రష్మిక సరదాగా స్పందించింది. తన పారితోషకం గురించి మీడియాలో వస్తున్న వార్తలను తాను సీరియస్గా తీసుకోవాలనుకుంటున్నట్లు ఆమె వ్యాఖ్యానించడం విశేషం.
నేను పారితోషకం పెంచానని ఎవరు చెప్పారు. ఈ వార్తలు చూసి ఆశ్చర్యం కలుగుతోంది. ఐతే ఈ విషయాన్ని నేను కన్సిడర్ చేయాలనుకుంటున్నా. రెమ్యూనరేషన్ ఎందుకు పెంచారని నిర్మాతలు ఎవరైనా అడిగితే.. మీడియా అలానే చెప్పింది కాబట్టి దానికే కట్టుబడాలనుకుంటున్నట్లు చెబుతా అంటూ స్మైల్ ఎమోజీలు జోడించి కామెంట్ చేసింది రష్మిక.
మరోవైపు రష్మిక రెస్పాన్స్ చూసి నిర్మాత ఎస్కేఎన్ కూడా సరదాగా స్పందించాడు. రష్మికతో తాము తీస్తున్న గర్ల్ ఫ్రెండ్ మూవీని ఈ ఆర్టికల్ రావడానికి ముందే మొదలు పెట్టడం సంతోషంగా ఉందని అతను వ్యాఖ్యానించాడు. ఈ జోక్స్ పక్కన పెడితే ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్లలో రష్మిక ఒకరు. ఆమె ఈ ఏడాది పుష్ప-2 లాంటి భారీ మూవీతో రాబోతోంది. ఇంకో అరడజను దాకా సినిమాలు తన చేతిలో ఉన్నాయి.
This post was last modified on February 7, 2024 8:17 am
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…
చెల్లెలికి బర్త్డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా! పాలిటిక్స్లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…