స్టార్ హీరోలు, హీరోయిన్ల పారితోషకాల గురించి మీడియాలో, సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఒక పెద్ద హిట్ పడగానే పారితోషకాలు పెరిగిపోయినట్లు వార్తలు హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని నిజాలుంటాయి. కొన్ని కేవలం ఊహాగానాలుగానే ఉంటాయి.
ఇటీవలే సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా బాలీవుడ్ మూవీ యానిమల్తో ఘనవిజయాన్నందుకుంది. దీంతో ఆమె రెమ్యూనరేషన్ ఒక్కసారిగా పెరిగిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆమె పారితోషకంగా 4 కోట్లు దాటిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై రష్మిక సరదాగా స్పందించింది. తన పారితోషకం గురించి మీడియాలో వస్తున్న వార్తలను తాను సీరియస్గా తీసుకోవాలనుకుంటున్నట్లు ఆమె వ్యాఖ్యానించడం విశేషం.
నేను పారితోషకం పెంచానని ఎవరు చెప్పారు. ఈ వార్తలు చూసి ఆశ్చర్యం కలుగుతోంది. ఐతే ఈ విషయాన్ని నేను కన్సిడర్ చేయాలనుకుంటున్నా. రెమ్యూనరేషన్ ఎందుకు పెంచారని నిర్మాతలు ఎవరైనా అడిగితే.. మీడియా అలానే చెప్పింది కాబట్టి దానికే కట్టుబడాలనుకుంటున్నట్లు చెబుతా అంటూ స్మైల్ ఎమోజీలు జోడించి కామెంట్ చేసింది రష్మిక.
మరోవైపు రష్మిక రెస్పాన్స్ చూసి నిర్మాత ఎస్కేఎన్ కూడా సరదాగా స్పందించాడు. రష్మికతో తాము తీస్తున్న గర్ల్ ఫ్రెండ్ మూవీని ఈ ఆర్టికల్ రావడానికి ముందే మొదలు పెట్టడం సంతోషంగా ఉందని అతను వ్యాఖ్యానించాడు. ఈ జోక్స్ పక్కన పెడితే ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్లలో రష్మిక ఒకరు. ఆమె ఈ ఏడాది పుష్ప-2 లాంటి భారీ మూవీతో రాబోతోంది. ఇంకో అరడజను దాకా సినిమాలు తన చేతిలో ఉన్నాయి.
This post was last modified on February 7, 2024 8:17 am
ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న తమిళ స్టార్ హీరో ధనుష్, అగ్ర కథానాయిక నయనతార.. కొన్ని కారణాల వల్ల శత్రువులుగా…
ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. తమిళ కుర్రాడు ప్రదీప్ రంగనాథన్కు... నాలుగేళ్ల ముందు వరకు తమిళనాడులోనే…
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఈ నెలలో…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ల విధ్వంసం ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తోకముడిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో…
ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…