స్టార్ హీరోలు, హీరోయిన్ల పారితోషకాల గురించి మీడియాలో, సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఒక పెద్ద హిట్ పడగానే పారితోషకాలు పెరిగిపోయినట్లు వార్తలు హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని నిజాలుంటాయి. కొన్ని కేవలం ఊహాగానాలుగానే ఉంటాయి.
ఇటీవలే సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా బాలీవుడ్ మూవీ యానిమల్తో ఘనవిజయాన్నందుకుంది. దీంతో ఆమె రెమ్యూనరేషన్ ఒక్కసారిగా పెరిగిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆమె పారితోషకంగా 4 కోట్లు దాటిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై రష్మిక సరదాగా స్పందించింది. తన పారితోషకం గురించి మీడియాలో వస్తున్న వార్తలను తాను సీరియస్గా తీసుకోవాలనుకుంటున్నట్లు ఆమె వ్యాఖ్యానించడం విశేషం.
నేను పారితోషకం పెంచానని ఎవరు చెప్పారు. ఈ వార్తలు చూసి ఆశ్చర్యం కలుగుతోంది. ఐతే ఈ విషయాన్ని నేను కన్సిడర్ చేయాలనుకుంటున్నా. రెమ్యూనరేషన్ ఎందుకు పెంచారని నిర్మాతలు ఎవరైనా అడిగితే.. మీడియా అలానే చెప్పింది కాబట్టి దానికే కట్టుబడాలనుకుంటున్నట్లు చెబుతా అంటూ స్మైల్ ఎమోజీలు జోడించి కామెంట్ చేసింది రష్మిక.
మరోవైపు రష్మిక రెస్పాన్స్ చూసి నిర్మాత ఎస్కేఎన్ కూడా సరదాగా స్పందించాడు. రష్మికతో తాము తీస్తున్న గర్ల్ ఫ్రెండ్ మూవీని ఈ ఆర్టికల్ రావడానికి ముందే మొదలు పెట్టడం సంతోషంగా ఉందని అతను వ్యాఖ్యానించాడు. ఈ జోక్స్ పక్కన పెడితే ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్లలో రష్మిక ఒకరు. ఆమె ఈ ఏడాది పుష్ప-2 లాంటి భారీ మూవీతో రాబోతోంది. ఇంకో అరడజను దాకా సినిమాలు తన చేతిలో ఉన్నాయి.
This post was last modified on February 7, 2024 8:17 am
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…