స్టార్ హీరోలు, హీరోయిన్ల పారితోషకాల గురించి మీడియాలో, సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఒక పెద్ద హిట్ పడగానే పారితోషకాలు పెరిగిపోయినట్లు వార్తలు హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని నిజాలుంటాయి. కొన్ని కేవలం ఊహాగానాలుగానే ఉంటాయి.
ఇటీవలే సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా బాలీవుడ్ మూవీ యానిమల్తో ఘనవిజయాన్నందుకుంది. దీంతో ఆమె రెమ్యూనరేషన్ ఒక్కసారిగా పెరిగిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆమె పారితోషకంగా 4 కోట్లు దాటిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై రష్మిక సరదాగా స్పందించింది. తన పారితోషకం గురించి మీడియాలో వస్తున్న వార్తలను తాను సీరియస్గా తీసుకోవాలనుకుంటున్నట్లు ఆమె వ్యాఖ్యానించడం విశేషం.
నేను పారితోషకం పెంచానని ఎవరు చెప్పారు. ఈ వార్తలు చూసి ఆశ్చర్యం కలుగుతోంది. ఐతే ఈ విషయాన్ని నేను కన్సిడర్ చేయాలనుకుంటున్నా. రెమ్యూనరేషన్ ఎందుకు పెంచారని నిర్మాతలు ఎవరైనా అడిగితే.. మీడియా అలానే చెప్పింది కాబట్టి దానికే కట్టుబడాలనుకుంటున్నట్లు చెబుతా అంటూ స్మైల్ ఎమోజీలు జోడించి కామెంట్ చేసింది రష్మిక.
మరోవైపు రష్మిక రెస్పాన్స్ చూసి నిర్మాత ఎస్కేఎన్ కూడా సరదాగా స్పందించాడు. రష్మికతో తాము తీస్తున్న గర్ల్ ఫ్రెండ్ మూవీని ఈ ఆర్టికల్ రావడానికి ముందే మొదలు పెట్టడం సంతోషంగా ఉందని అతను వ్యాఖ్యానించాడు. ఈ జోక్స్ పక్కన పెడితే ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్లలో రష్మిక ఒకరు. ఆమె ఈ ఏడాది పుష్ప-2 లాంటి భారీ మూవీతో రాబోతోంది. ఇంకో అరడజను దాకా సినిమాలు తన చేతిలో ఉన్నాయి.
This post was last modified on February 7, 2024 8:17 am
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…