వైసీపీ సిట్టింగ్ ల సెకండ్ లిస్ట్ ఇదే

ప్రస్తుతం ఏపీలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు వ్యవహారం హాట్ టాపిక్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాడేపల్లి క్యాంపు నుంచి పిలుపు ఎప్పుడు వస్తుందో…జగన్ నోటి నుంచి ఏం వినాల్సి వస్తుందో అని చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు టెన్షన్ పడుతున్నారు. ఆల్రెడీ 11 మంది సిట్టింగ్ నేతల స్థానాలను మార్చిన జగన్ రెండో జాబితాపై గత వారం రోజులుగా కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ రెండో జాబితాను వైసీపీ అధిష్టానం విడుదల చేసింది.

కొన్ని అసెంబ్లీ, కొన్ని లోక్ సభ స్థానాల ఇన్చార్జిలను మారుస్తూ తాజాగా వైసీపీ అధిష్టానం జాబితాను విడుదల చేసింది. 27 మందితో విడుదలైన జాబితాలో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాలు మారాయి. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల ప్రకారమే ఈ నియామకాలు చేపట్టామని వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఈ 27 మందిలో కొందరు నేతల వారసులు ఉన్నారు. 11 మందిని మార్చిన నేపథ్యంలోనే వైసీపీలో అంతర్గత కలహాలు, అసంతృప్త నేతల వ్యవహారం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 27 మందితో రెండో జాబితా విడుదలైన నేపథ్యంలో తమ స్థానాలు కోల్పోయిన నేతల రియాక్షన్ ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే, కొందరు నేతలకు టికెట్ ఇవ్వబోనని కరాఖండిగా జగన్ చెప్పేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత వారికి పార్టీలో తగిన ప్రాధాన్యతను కల్పిస్తానని హామీ ఇస్తున్నారని తెలుస్తోంది. దీంతో, పూతలపట్టు ఎమ్మెల్యే బాబు వంటి కొందరు ఎమ్మెల్యేలు తాము చేసిన తప్పేంటో చెప్పాలని, తమకు టికెట్ ఎందుకు నిరాకరిస్తున్నారో వెల్లడించాలని వైసీపీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు వేరే పార్టీలోకి వెళ్లే అవకాశం లేక ప్రత్యామ్నాయ మార్గాలు లేక గతిలేని స్థితిలో వైసీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.

వైసీపీ విడుదల చేసిన 27 మంది ఇన్చార్జిల జాబితా

అనంతపురం పార్లమెంటు – శంకరనారాయణ

హిందూపురం పార్లమెంటు – శాంతమ్మ

అరకు పార్లమెంటు – భాగ్యలక్ష్మి

పెనుకొండ – ఉషశ్రీ చరణ్

ఎర్రగొండపాలెం – తాటిపర్తి రాజశేఖర్

ఎమ్మిగనూరు – మాచాని వెంకటేష్

గుంటూరు ఈస్ట్ – షేక్ నూర్ ఫాతిమా

మచిలీపట్నం – పేర్ని కృష్ణమూర్తి(కిట్టూ)

కల్యాణదుర్గం – తలారి రంగయ్య

అరకు అసెంబ్లీ – గొడ్డేటి మాధవి

విజయవాడ సెంట్రల్ – వెల్లంపల్లి శ్రీనివాసరావు

పిఠాపురం – వంగా గీత

రాజాం – తాలే రాజేష్

ప్రత్తిపాడు – వరపుల సుబ్బారావు

తిరుపతి – భూమన అభినయ్ రెడ్డి

రాజమండ్రి సిటీ – మార్గాని భరత్

రామచంద్రాపురం – పిల్లి సూర్యప్రకాశ్

పాడేరు – మత్స్యరాస విశ్వేశ్వరరాజు

విజయవాడ వెస్ట్ – షేక్ అసీఫ్

చంద్రగిరి – చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

కదిరి – మక్బుల్ అహ్మద్

అనకాపల్లి – మలకాపల్లి భరత్ కుమార్

జగ్గంపేట – తోట నరసింహం

పాయకరావు పేట – కంబాల జోగులు

రాజమండ్రి రూరల్ – వేణుగోపాల కృష్ణ

పి. గన్నవరం – వేణుగోపాల్

పోలవరం – తెల్లం రాజ్యలక్ష్మి