కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కీలక నేత.. గతంలో పీసీసీ చీఫ్గా కూడా పనిచేసిన సాకే శైలజానాథ్ టీడీపీలోకి చేరనున్నట్టు తెలుస్తోంది. ఆయన గత రెండేళ్లుగా పార్టీలో యాక్టివ్గా లేరు. తనను పీసీసీ చీఫ్పదవి నుంచి తప్పించడం దరిమిలా.. ఆయన మౌనంగా ఉంటున్నారు. పార్టీలోనూ సీనియర్లు తన మాట వినడం లేదని, కార్యకర్తలు కూడా క్షీణించిపోయారని.. పార్టీని బాగు చేయడం తన వల్లకాదని ఆయన గతంలోనే చేతులెత్తేశారు.
పైగా రాజధానికోసం అమరావతి రైతులు ఉద్యమించినప్పుడు.. సాకే బహిరంగంగా వారికి మద్దతు తెలిపారు. దీనిని కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టింది. క్రెడిట్ టీడీపీకి వెళ్లిపోతుందని, కావాలంటే.. మీరు విడిగా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. కానీ, కలిసి వచ్చే నాయకులు కానరాక.. సాకే.. తన ప్రయత్నాలు విరమించుకుని.. పార్టీ కి దూరంగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికలలో ఆయన టీడీపీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే దాదాపు ఏడాదిన్నరగా ఆయన కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా విజయవాడలో మూడు రోజుల సమావేశం నిర్వహించినా.. కాంగ్రెస్నేతల్లో సాకే మాత్రం హాజరు కాలేదు. దీంతో ఆయన పార్టీ మార్పు ఖాయమనే వాదన వినిపిస్తోంది. ఇక, ఉమ్మడి అనంతపురంలోని శింగనమల నియోజకవర్గం నుంచి గతంలో ఆయన 2004, 2009లో విజయం దక్కించుకున్నారు. మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన గ్రాఫ్ వ్యక్తిగతంగా కూడా బాగానే ఉంది.
దీంతో ఆయనను తీసుకుంటే.. టీడీపీ గెలుపు నల్లేరుపై నడకేనన్నది టీడీపీ భావన కూడా. అయితే, ఇదే టికెట్ కోసం.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేత, ఎస్సీ సెల్ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజు కూడా రెడీగానే ఉన్నారు. కానీ, ఆయన పోటీ ఇచ్చినా.. గెలుపు గుర్రం ఎక్కడంపై సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోఆయనను అదే పదవిలో కొనసాగించి.. పార్టీ అధికారంలోకి వచ్చాక.. ఎమ్మెల్సీ ఇవ్వాలనే ప్రతిపాదనను పార్టీ తెరమీదికి తెచ్చింది.
ఎం.ఎస్. రాజును సానుకూలంగా ఒప్పించేందుకు కీలక నేతలు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇది సఫలమైతే.. ఆ వెంటనే సాకేను పార్టీలోకి ఆహ్వానించి.. వెంటనే టికెట్ కూడా అనౌన్సు చేయనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ కీలక నేత టీడీపీలో వస్తుండడంపై చర్చ జోరుగానే సాగుతోంది.
This post was last modified on December 15, 2023 2:04 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…