కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కీలక నేత.. గతంలో పీసీసీ చీఫ్గా కూడా పనిచేసిన సాకే శైలజానాథ్ టీడీపీలోకి చేరనున్నట్టు తెలుస్తోంది. ఆయన గత రెండేళ్లుగా పార్టీలో యాక్టివ్గా లేరు. తనను పీసీసీ చీఫ్పదవి నుంచి తప్పించడం దరిమిలా.. ఆయన మౌనంగా ఉంటున్నారు. పార్టీలోనూ సీనియర్లు తన మాట వినడం లేదని, కార్యకర్తలు కూడా క్షీణించిపోయారని.. పార్టీని బాగు చేయడం తన వల్లకాదని ఆయన గతంలోనే చేతులెత్తేశారు.
పైగా రాజధానికోసం అమరావతి రైతులు ఉద్యమించినప్పుడు.. సాకే బహిరంగంగా వారికి మద్దతు తెలిపారు. దీనిని కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టింది. క్రెడిట్ టీడీపీకి వెళ్లిపోతుందని, కావాలంటే.. మీరు విడిగా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. కానీ, కలిసి వచ్చే నాయకులు కానరాక.. సాకే.. తన ప్రయత్నాలు విరమించుకుని.. పార్టీ కి దూరంగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికలలో ఆయన టీడీపీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే దాదాపు ఏడాదిన్నరగా ఆయన కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా విజయవాడలో మూడు రోజుల సమావేశం నిర్వహించినా.. కాంగ్రెస్నేతల్లో సాకే మాత్రం హాజరు కాలేదు. దీంతో ఆయన పార్టీ మార్పు ఖాయమనే వాదన వినిపిస్తోంది. ఇక, ఉమ్మడి అనంతపురంలోని శింగనమల నియోజకవర్గం నుంచి గతంలో ఆయన 2004, 2009లో విజయం దక్కించుకున్నారు. మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన గ్రాఫ్ వ్యక్తిగతంగా కూడా బాగానే ఉంది.
దీంతో ఆయనను తీసుకుంటే.. టీడీపీ గెలుపు నల్లేరుపై నడకేనన్నది టీడీపీ భావన కూడా. అయితే, ఇదే టికెట్ కోసం.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేత, ఎస్సీ సెల్ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజు కూడా రెడీగానే ఉన్నారు. కానీ, ఆయన పోటీ ఇచ్చినా.. గెలుపు గుర్రం ఎక్కడంపై సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోఆయనను అదే పదవిలో కొనసాగించి.. పార్టీ అధికారంలోకి వచ్చాక.. ఎమ్మెల్సీ ఇవ్వాలనే ప్రతిపాదనను పార్టీ తెరమీదికి తెచ్చింది.
ఎం.ఎస్. రాజును సానుకూలంగా ఒప్పించేందుకు కీలక నేతలు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇది సఫలమైతే.. ఆ వెంటనే సాకేను పార్టీలోకి ఆహ్వానించి.. వెంటనే టికెట్ కూడా అనౌన్సు చేయనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ కీలక నేత టీడీపీలో వస్తుండడంపై చర్చ జోరుగానే సాగుతోంది.
గత వారం రోజులుగా ఓజి 2 గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభమవుతుందని,…
టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్… తనను తాను జనసేన అధినేత,…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. తెలంగాణలోని హనుమకొండలో పర్యటించారు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్కు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం తన పొరుగు రాష్ట్రం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని హన్మకొండ…
వయసు ఒక నంబర్ మాత్రమే అనే నానుడిని రుజువు చేస్తూ 94 ఏళ్ల వయసులో ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిం…
సమంత మా ఇంటి బంగారం బాగానే బోణీ కొట్టేలా ఉంది. ఓవర్సీస్ లో ఇప్పటికే లక్షా పాతిక వేల డాలర్లు…