Political News

టీడీపీలోకి ఏపీ కాంగ్రెస్ కీల‌క నేత‌.. మార్పు ఖాయం!

కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన కీల‌క నేత‌.. గ‌తంలో పీసీసీ చీఫ్‌గా కూడా ప‌నిచేసిన సాకే శైలజానాథ్ టీడీపీలోకి చేర‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న గ‌త రెండేళ్లుగా పార్టీలో యాక్టివ్‌గా లేరు. త‌న‌ను పీసీసీ చీఫ్‌ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌డం ద‌రిమిలా.. ఆయ‌న మౌనంగా ఉంటున్నారు. పార్టీలోనూ సీనియ‌ర్లు త‌న మాట విన‌డం లేద‌ని, కార్య‌క‌ర్త‌లు కూడా క్షీణించిపోయార‌ని.. పార్టీని బాగు చేయ‌డం త‌న వ‌ల్ల‌కాద‌ని ఆయ‌న గ‌తంలోనే చేతులెత్తేశారు.

పైగా రాజ‌ధానికోసం అమ‌రావ‌తి రైతులు ఉద్య‌మించిన‌ప్పుడు.. సాకే బ‌హిరంగంగా వారికి మ‌ద్ద‌తు తెలిపారు. దీనిని కాంగ్రెస్ పార్టీ త‌ప్పు ప‌ట్టింది. క్రెడిట్ టీడీపీకి వెళ్లిపోతుంద‌ని, కావాలంటే.. మీరు విడిగా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని ఆదేశించింది. కానీ, క‌లిసి వ‌చ్చే నాయ‌కులు కాన‌రాక‌.. సాకే.. త‌న ప్ర‌య‌త్నాలు విర‌మించుకుని.. పార్టీ కి దూరంగా ఉంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో ఆయ‌న టీడీపీ నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే దాదాపు ఏడాదిన్న‌ర‌గా ఆయ‌న కాంగ్రెస్ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. తాజాగా విజ‌య‌వాడ‌లో మూడు రోజుల స‌మావేశం నిర్వ‌హించినా.. కాంగ్రెస్‌నేత‌ల్లో సాకే మాత్రం హాజ‌రు కాలేదు. దీంతో ఆయన పార్టీ మార్పు ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. ఇక‌, ఉమ్మ‌డి అనంత‌పురంలోని శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌తంలో ఆయన 2004, 2009లో విజ‌యం ద‌క్కించుకున్నారు. మంత్రిగా కూడా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న గ్రాఫ్ వ్య‌క్తిగ‌తంగా కూడా బాగానే ఉంది.

దీంతో ఆయ‌న‌ను తీసుకుంటే.. టీడీపీ గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేన‌న్న‌ది టీడీపీ భావ‌న కూడా. అయితే, ఇదే టికెట్ కోసం.. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన టీడీపీ నేత‌, ఎస్సీ సెల్ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజు కూడా రెడీగానే ఉన్నారు. కానీ, ఆయ‌న పోటీ ఇచ్చినా.. గెలుపు గుర్రం ఎక్క‌డంపై సందేహాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోఆయ‌న‌ను అదే ప‌ద‌విలో కొన‌సాగించి.. పార్టీ అధికారంలోకి వ‌చ్చాక‌.. ఎమ్మెల్సీ ఇవ్వాల‌నే ప్ర‌తిపాద‌న‌ను పార్టీ తెర‌మీదికి తెచ్చింది.

ఎం.ఎస్‌. రాజును సానుకూలంగా ఒప్పించేందుకు కీల‌క నేత‌లు కూడా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ఇది స‌ఫ‌ల‌మైతే.. ఆ వెంట‌నే సాకేను పార్టీలోకి ఆహ్వానించి.. వెంట‌నే టికెట్ కూడా అనౌన్సు చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ కీల‌క నేత టీడీపీలో వ‌స్తుండ‌డంపై చ‌ర్చ జోరుగానే సాగుతోంది.

This post was last modified on December 15, 2023 2:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

27 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago