Political News

కాళేశ్వరంపై సెంట్రల్ కమిటీ తో విచారణ ?

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ చేసేందుకు కేంద్ర విచారణ కమిటిని రాష్ట్రప్రభుత్వం ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. కేంద్ర జలవనరుల శాఖలో డ్యామ్ సేఫ్టీ వింగ్ లో నిపుణులు చాలామందున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగినపుడు, బ్యారేజ్ నిర్మాణం కొంతమేర దెబ్బతిన్నపుడు తనిఖీ చేసేందుకు కేంద్ర జలశక్తి నుండి నిపుణలు వచ్చారు. నాలుగురోజులు ఇక్కడే ఉండి చాలా అంశాలను పరిశీలించారు. అయితే అప్పట్లో వీరికి కేసీయార్ ప్రభుత్వం నుండి సరైన సహకారం అందలేదు.

కేంద్రం నిపుణులు బృందం అడిగిన సందేహాల్లో చాలావాటికి రాష్ట్రప్రభుత్వం సమాధానాలు ఇవ్వలేదు. అవసరమైన సమాచారాన్ని కూడా ఇవ్వకుండా కేంద్ర బృందాన్ని ఇబ్బంది పెట్టింది. ఈ విషయాలన్నీ నిపుణుల బృందం కేంద్ర జలశక్తికి ఇచ్చిన నివేదికలోనే చెప్పింది. అందుబాటులోని సమాచారం ప్రకారమే రిపోర్టును తయారుచేసి జలశక్తికి ఇచ్చేసింది. అందులోనే నిర్మాణంలో లోపాలు, డిజైన్లలో లోపాలున్నట్లు స్పష్టంగా చెప్పిందట. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరంపై సమీక్ష జరిపింది.

పనిలోపనిగా కాళేశ్వరం లోపాలతో పాటు మేడిగడ్డ లోపాలపై విచారణ చేసేందుకు కేంద్ర జలశక్తి నిపుణుల బృందాన్ని పిలిపించాలని డిసైడ్ అయ్యిందని సమాచారం. ఇదే విషయమై తొందరలోనే కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం నుండి లేఖ వెళ్ళబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. కేంద్ర నిపుణుల బృందం కూడా రెండోసారి రాష్ట్రానికి వచ్చి పై రెండుప్రాజెక్టుల నిర్మాణాలపై పూర్తిస్ధాయిలో అధ్యయనం చేయటానికి రెడీగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అంటే అధ్యయనం, విచారణ ఏదైనా కావచ్చు రావాలంటే నిపుణుల బృందాన్ని పంపాలని కేంద్రానికి లేఖ రాయటమే ఆలస్యమన్నమాట.

ఇక్కడే రెండు ప్రాజెక్టుల సమీక్షలంటేనే ఉన్నతాధికారులు, కాంట్రాక్ట్ సంస్ధలతో పాటు ఇరిగేషన్ శాఖ అధికారుల్లో వణుకు మొదలవుతోందట. కేంద్ర దర్యాప్తు బృందం చేయబోయే పరిశీలనలో ఎలాంటి లోపాలు బయటపడతాయో అనే టెన్షన్ పెరిగిపోతోందని సమాచారం. ఇరిగేషన్, విద్యుత్, సివిల్ సప్లైస్ లాంటి శాఖలపై పదేపదే సమీక్షలు చేయటంలో ఉద్దేశ్యం ఏమిటంటే పదేళ్ళలో జరిగిన అక్రమాలు, అవినీతిని బయటకు తీయటమే. ఎందుకంటే పదేళ్ళల్లో కేసీయార్ పాలనలో జరిగిన అక్రమాలు, అవినీతిని ఆధారాలతో సహా పార్లమెంటుఎన్నికల సమయానికి జనాలముందుంచటమే అసలు ఉద్దేశ్యం.

This post was last modified on December 15, 2023 1:52 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

1 hour ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

3 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

4 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

4 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

5 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

5 hours ago