గుంటూరు కారం మీద గత ఇరవై నాలుగు గంటలకు పైగా జరుగుతున్న ఆన్ లైన్ వార్ గురించి నిర్మాత నాగవంశీ స్పందించడం ఇంకో హాట్ టాపిక్ కి దారిచ్చింది. యానిమల్ చివరి సీన్లో రన్బీర్ కపూర్ చూపించే ఒక పెద్దలకు మాత్రమే బాడీ లాంగ్వేజ్ సంకేతాన్ని పోస్ట్ చేసి మేమేం చేస్తున్నామో మాకు తెలుసు, జనవరి 12 కలుసుకుందాం అని ట్వీట్ చేయడం వైరల్ గా మారింది. నిజానికి ఆయన పోస్ట్ చేసిన క్లిప్ కేవలం రెండు సెకండ్లే ఉన్నా అది అఫీషియల్ గా బి బయట దొరుకుతున్న వీడియో కాదు. ఎవరో స్నేహితులు పంపిన పైరసీ బిట్ ని వాడుకున్నారు. దీన్ని కూడా ఫ్యాన్స్ పసిగట్టేశారు.
నిజానికి నాగవంశీ అభిమానులకు అభయమిచ్చారా లేక రెచ్చగొట్టారా అంటే సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే మేమేం చేస్తున్నామో మాకు తెలుసు అనడంలో ఒకరకమైన తెగింపు స్టేట్ మెంట్ ఉంది. ఓ మై బేబీ పాటకు నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని స్వీకరించి రేపు తెరమీద చూడండి అప్పుడు మాట్లాడుకుందాం అంటే వేరుగా ఉండేది. కానీ అలా చేస్తే ఆయన అందరు నిర్మాతల్లో ఒకరు అవుతారు కదా. అందుకే తన స్టయిల్ ని చూపించారు. దీన్ని కొందరు పాజిటివ్ గా తీసుకోగా మరికొందరికి వెటకారంగా అనిపిస్తోంది. సినిమా బ్రహ్మాండంగా ఉంటే ఇవన్నీ దూది పింజెల్లా ఎగిరిపోతాయి. డౌట్ లేదు.
ఎటొచ్చి అక్కడి దాకా అటు యూనిట్ ఇటు ఫ్యాన్స్ ఇద్దరూ సంయమనం పాటించాల్సిందే. అభిమానులను అదుపు చేయడం కష్టం. ఒరిజినల్ ఐడిలు కనిపించని ట్విట్టర్ ప్రపంచంలో ఎవరేం చేసినా వాళ్ళను ఆపలేరు. పైపెచ్చు ఏ మాత్రం రెచ్చగొట్టినా మంటల మీద పెట్రోల్ పోసినట్టే. నిన్న రామజోగయ్య శాస్త్రి ఇదే విధంగా కౌంటర్ ఇవ్వబోయి అనవసర ట్రోలింగ్ కి దొరికిపోయారు. దెబ్బకు ఎక్స్ నుంచి సెలవు తీసుకునేదాకా వెళ్ళింది. కొద్దినిమిషాల క్రితం నాగవంశీ మళ్ళీ ఫ్రెష్ ట్వీట్ చేస్తూ వ్యక్తిగతంగా తమ టీమ్ ని టార్గెట్ చేయడం వల్ల ఆ బాధని వ్యక్తం చేయడం కోసం అలా అన్నాను తప్పించి వేరొక కారణం లేదని చెప్పడం క్లైమాక్స్.
This post was last modified on December 15, 2023 3:36 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…