Political News

తిరుమలలో నాసిరకం భోజనం వివాదం

సీఎం జగన్ పాలనలో తిరుపతి, తిరుమల ప్రతిష్ట దెబ్బతింటోందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో అవకతవకలు జరుగుతున్నాయని విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. తిరుమలలో అన్యమత ప్రచారం ఆరోపణలు, ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం, టీటీడీ భూముల వేలంపాటకు ప్రభుత్వం పూనుకోవడం, సప్తగిరి మాసపత్రిక వ్యవహారం, ఎస్వీబీసీ మాజీ చైర్మన్, సినీ నటుడు పృథ్వీ ఆడియో టేపు దుమారం..వంటి అంశాలతో కలియుగ దైవం వెంకన్న ప్రతిష్టను జగన్ సర్కార్ మసకబారుస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.

ఇక, లడ్డూ ప్రసాద విక్రయం వివాదం, టికెట్ కౌంటర్ల దగ్గర తొక్కిసలాటలు, కాలినడకన వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శనం లేకపోవడం వంటి వ్యవహారాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం నడుచుకుంటోందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అయినా సరే తీరు మారని క్రమంలో తాజాగా తిరుమల ప్రతిష్టకు భంగం కలిగేలా మరో అంశం తెరపైకి వచ్చింది. తిరుమలలో తినే భోజనం నాణ్యత లేదని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలు ఇది అన్నమేనా…దీనిని ఎలా తింటాం అంటూ భక్తులు మండిపడుతున్నారు. ఆకలికి ఉండలేక…పెట్టిన భోజనం బాగోలేక వడ్డించిన విస్తరిని అలాగే వదిలేసి చాలామంది భక్తులు అర్ధాకలితో వెళ్తున్నారని కొందరు భక్తులు ఆందోళన చేపట్టారు. తిరుమలకు వచ్చే భక్తులకు కడుపు నిండా మంచి భోజనం కూడా పెట్టలేని దుస్థితిలో టీటీడీ, జగన్ ప్రభుత్వం ఉన్నాయని విమర్శించారు. ఆ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో వైరల్ కావడంతో టీటీడీ, ప్రభుత్వంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

హిందువులు ఇప్పటికైనా మేలుకోకుంటే తిరుమల పవిత్రత మరింత దెబ్బతింటుందని వారు కామెంట్లు చేస్తున్నారు. క్రిస్టియన్ ముఖ్యమంత్రి పాలనలో ఇంతకన్నా ఏం ఆశించగలం అంటూ విమర్శిస్తున్నారు.

This post was last modified on December 5, 2023 8:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ మీటింగ్ లో ‘మర్రి’ కనిపించలేదే!

వైసీపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైనప్పటి నుంచి కూడా…

4 hours ago

లోకేశ్ తో వేగేశ్న భేటీ… విశాఖపై సిఫీ ఆసక్తి

కూటమి పాలనలో ఏపీకి పెట్టుబడుల వరద పోటెత్తుతోంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి గడచిన 7…

8 hours ago

ఉచితాల‌తో `బ‌ద్ధ‌క‌స్తు`ల‌ను పెంచుతున్నారు: సుప్రీం సీరియ‌స్‌

``ఎన్నిక‌ల్లో రాజ‌కీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు.. స‌మాజంలో బ‌ద్ధ‌క‌స్తుల‌ను పెంచుతున్నాయి. ఇది స‌రికాదు. స‌మాజంలో ప‌నిచేసే వారు త‌గ్గిపోతున్నారు.…

10 hours ago

‘తండేల్’ బౌండరీ దాటలేకపోయిందా?

బాహుబలి పాన్ జాతీయ స్థాయిలో సంచలనం రేపాక.. ‘పాన్ ఇండియా’ సినిమాల ఒరవడి బాగా పెరిగింది. ఐతే పాన్ ఇండియా…

10 hours ago

తులసిబాబుకు రూ.48 లక్షలు!.. ఎందుకిచ్చారంటే..?

కామేపల్లి తులసిబాబుకు ఏపీ సీఐడీ భారీ నజరానా ఇచ్చిందన్న వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ అసెంబ్లీ…

11 hours ago

తమిళ స్టార్‌ను మనోళ్లే కాపాడాలి

తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్కు కొన్నేళ్ల నుంచి నిఖార్సయిన బాక్సాఫీస్ హిట్ లేదు. 2019లో వచ్చిన ‘విశ్వాసం’తో…

11 hours ago