సాయిపల్లవి ఎన్ని మంచి పాత్రలు, సినిమాలు చేసినా ఫిదాలో హైబ్రిడ్ పిల్ల భానుమతిగా ఇచ్చిన పెర్ఫార్మన్స్ ఎప్పటికీ స్పెషల్ గా ఉండిపోతుంది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా కేవలం కథ నచ్చితే తప్ప గ్రీన్ సిగ్నల్ ఇవ్వని ఈ కేరళ కుట్టి ఇటీవలే నాగ చైతన్య తండేల్ కు ఎస్ చెప్పింది. ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు కానీ హీరోయిన్ అయినప్పటికీ చాలా ప్రాధాన్యం ఉన్న పాత్రే డిజైన్ చేశాడట దర్శకుడు చందూ మొండేటి. ఇప్పుడిది కాకుండా కెజిఎఫ్ యష్ ఉరఫ్ రాఖీ భాయ్ చేయబోయే 19వ ప్యాన్ ఇండియా మూవీకి సాయిపల్లవినే ఎంచుకున్నట్టు బెంగళూరు టాక్.
ఇదింకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఎనిమిదో తేదీ ఫస్ట్ లుక్ తో వదలబోయే టైటిల్ లాంచ్ లో ఏమైనా చెబుతారేమో చూడాలి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో గోవా మాఫియా బ్యాక్ డ్రాప్ తో ఇది రూపొందుతుందని ఆల్రెడీ లీక్ ఉంది. కెజిఎఫ్ తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్న యష్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ కోసమే నెలల తరబడి ఎదురు చూసి మరీ షూటింగ్ కి ఎస్ అన్నాడు. ప్రశాంత్ నీల్ తర్వాత ఎవరికి అవకాశం ఇస్తాడోనని ఎదురు చూసినవాళ్లకు లేడీ డైరెక్టర్ ని ఎంచుకోవడం ద్వారా స్వీట్ షాక్ ఇచ్చాడు. 2025 విడుదల టార్గెట్ గా దీని చిత్రీకరణ దేశవిదేశాల్లో జరగబోతోంది.
ఇక సాయిపల్లవి విషయానికీ వస్తే యష్ 19 పడితే శాండల్ వుడ్ లోనూ మంచి గుర్తింపు వస్తుంది. బాలీవుడ్ లో భారీ ఎత్తున ప్లాన్ చేసుకున్న రామాయణంలో రాముడు రన్బీర్ కపూర్ సరసన సీతగా ఈమే ఎంపికయ్యిందనే వార్త చాలా రోజులుగా చక్కర్లు కొడుతోంది కానీ ఆ ప్రాజెక్ట్ తాలూకు వివరాలు బయటికి రాలేదు. అందులో రావణుడిగా యష్ నే అడిగారని టాక్ కూడా ఉంది. కన్ఫర్మ్ అయితే తప్ప ఈ ఏదీ ఖరారుగా చెప్పలేం. మలయాళంలోనూ ఏమంత దూకుడుగా లేని సాయిపల్లవి ఎన్ని భాషల్లో ఎన్ని ఆఫర్లు వచ్చినా రాజీపడని తన మనస్తత్వాన్ని మాత్రం మార్చుకునే సమస్యే లేదంటోంది.
This post was last modified on December 5, 2023 5:45 pm
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…
2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తామే విజయం దక్కించుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు…
వైసీపీ పాలనలో ప్రజాధనం నీళ్లలా ఖర్చుపెట్టారని, జనం సొమ్మును దుబారా చేయడంలో మాజీ సీఎం జగన్ ఏ అవకాశం వదలలేదని…