సాయిపల్లవి ఎన్ని మంచి పాత్రలు, సినిమాలు చేసినా ఫిదాలో హైబ్రిడ్ పిల్ల భానుమతిగా ఇచ్చిన పెర్ఫార్మన్స్ ఎప్పటికీ స్పెషల్ గా ఉండిపోతుంది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా కేవలం కథ నచ్చితే తప్ప గ్రీన్ సిగ్నల్ ఇవ్వని ఈ కేరళ కుట్టి ఇటీవలే నాగ చైతన్య తండేల్ కు ఎస్ చెప్పింది. ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు కానీ హీరోయిన్ అయినప్పటికీ చాలా ప్రాధాన్యం ఉన్న పాత్రే డిజైన్ చేశాడట దర్శకుడు చందూ మొండేటి. ఇప్పుడిది కాకుండా కెజిఎఫ్ యష్ ఉరఫ్ రాఖీ భాయ్ చేయబోయే 19వ ప్యాన్ ఇండియా మూవీకి సాయిపల్లవినే ఎంచుకున్నట్టు బెంగళూరు టాక్.
ఇదింకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఎనిమిదో తేదీ ఫస్ట్ లుక్ తో వదలబోయే టైటిల్ లాంచ్ లో ఏమైనా చెబుతారేమో చూడాలి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో గోవా మాఫియా బ్యాక్ డ్రాప్ తో ఇది రూపొందుతుందని ఆల్రెడీ లీక్ ఉంది. కెజిఎఫ్ తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్న యష్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ కోసమే నెలల తరబడి ఎదురు చూసి మరీ షూటింగ్ కి ఎస్ అన్నాడు. ప్రశాంత్ నీల్ తర్వాత ఎవరికి అవకాశం ఇస్తాడోనని ఎదురు చూసినవాళ్లకు లేడీ డైరెక్టర్ ని ఎంచుకోవడం ద్వారా స్వీట్ షాక్ ఇచ్చాడు. 2025 విడుదల టార్గెట్ గా దీని చిత్రీకరణ దేశవిదేశాల్లో జరగబోతోంది.
ఇక సాయిపల్లవి విషయానికీ వస్తే యష్ 19 పడితే శాండల్ వుడ్ లోనూ మంచి గుర్తింపు వస్తుంది. బాలీవుడ్ లో భారీ ఎత్తున ప్లాన్ చేసుకున్న రామాయణంలో రాముడు రన్బీర్ కపూర్ సరసన సీతగా ఈమే ఎంపికయ్యిందనే వార్త చాలా రోజులుగా చక్కర్లు కొడుతోంది కానీ ఆ ప్రాజెక్ట్ తాలూకు వివరాలు బయటికి రాలేదు. అందులో రావణుడిగా యష్ నే అడిగారని టాక్ కూడా ఉంది. కన్ఫర్మ్ అయితే తప్ప ఈ ఏదీ ఖరారుగా చెప్పలేం. మలయాళంలోనూ ఏమంత దూకుడుగా లేని సాయిపల్లవి ఎన్ని భాషల్లో ఎన్ని ఆఫర్లు వచ్చినా రాజీపడని తన మనస్తత్వాన్ని మాత్రం మార్చుకునే సమస్యే లేదంటోంది.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…