అసెంబ్లీలో రెండో రోజు కూడా టీడీపీ,వైసీపీ సభ్యుల మధ్య రసాభాస కొనసాగుతోంది. సభలో చంద్రబాబు బల్లపైకి ఎక్కిన బాలకృష్ణ విజిల్ వేస్తూ తన నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మరోసారి బాలకృష్ణతోపాటు టీడీపీ సభ్యులపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలక్యపై అంబటి షాకింగ్ కామెంట్లు చేశారు. బాలకృష్ణ అసెంబ్లీలో మీసం తిప్పితే లాభం లేదని, పార్టీలో తిప్పాలని అన్నారు. మీ తండ్రికి మీ బావ వెన్నుపోటు పొడిచిన ఘటనను గుర్తుకు తెచ్చుకొని మీసం తిప్పాలని విమర్శించారు.
జన్మనిచ్చిన తండ్రి క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ఆయనకు అండగా లేరనే అపవాదు మీ మీద, మీ అన్నదమ్ముల మీద ఉందని, ఆ అపవాదును తొలగించుకునేందుకు ఇదే సరైన సమయం అని అంబటి అన్నారు. మీ బావ జైల్లో ఉన్నారని, మీ అల్లుడు ఢిల్లీలో ఉన్నారని, పార్టీ పగ్గాలు చేపట్టాలని హితవు పలికారు. అలా చేసి నందమూరి వంశ పౌరుషాన్ని నిరూపించుకోవాలని, టీడీపీని బతికించుకోవాలని సూచించారు. ఇది తన సలహా మాత్రమేనని, పాటించకపోతే అథఃపాతాళానికి పోతారని జోస్యం చెప్పారు.
చంద్రబాబును అరెస్ట్ అయ్యారన్న ఆవేదనతో ఏదో ఒకటి చేయాలన్న దుష్ట ఆలోచనలో టీడీపీ నేతలున్నారని అంబటి విమర్శించారు. తాను లేచి నిలబడకపోతే స్పీకర్ పై దాడి చేసేవారని ఆరోపించారు. మరోవైపు, పోడియాన్ని చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్ లను ఈ సెషన్ మొత్తం నుంచి స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు.
This post was last modified on September 22, 2023 2:23 pm
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…