సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల టాలీవుడ్ నిర్మాతలు చేతులారా మంచి సీజన్లు, లాంగ్ వీకెండ్లను వదిలేసుకుంటున్నారు. మొన్న వినాయక చవితి పండక్కు డబ్బింగ్ సినిమా మార్క్ ఆంటోనీ తప్ప వేరే ఆప్షన్ లేకపోవడం థియేటర్లను ఖాళీగా ఉంచేసింది. తమిళంలో పెద్ద హిట్టు కొట్టిన విశాల్ ఎందుకో తెలుగులో మాత్రం ఈసారి ఆశించిన ఫలితం అందుకోలేకపోయాడు. పోటీ లేని అవకాశాన్ని తన చిత్రం వాడుకోలేకపోవడం చూసి హఠాత్తుగా వచ్చి సక్సెస్ మీట్లు గట్రా చేస్తున్నా ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ మళ్ళీ పికప్ అయ్యేలా చేయడం లేదు. ఆ రకంగా గణేశుడి సెలవులు వృధా అయ్యాయి.
దసరాకు భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావులు ఉన్నాయి కాబట్టి టెన్షన్ లేదు కానీ దీపావళికి తిరిగి డబ్బింగ్ జాతరే జరిగేలా ఉంది. ఆ పండగకు నవంబర్ 10న లాక్ చేసుకున్న మూవీ వైష్ణవ్ తేజ్ ఆదికేశవ ఒక్కటే. దీని మీద చెప్పుకోదగ్గ స్థాయిలో బజ్ లేదు. అయితే కార్తీ జపాన్, లారెన్స్ ఎస్జె సూర్యల జిగర్ తండ డబుల్ ఎక్స్ఎల్ లు అదే డేట్ కి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. రెండూ విభిన్నమైన జానర్లతో వస్తున్నవే. ఇవి కాకుండా విపరీతమైన వాయిదాలకు గురవుతూ వచ్చిన చియాన్ విక్రమ్ గౌతమ్ మీనన్ ధృవ నచ్చతీరం`సైతం టపాసుల పండగే చూస్తోందట.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే సల్మాన్ ఖాన్ ప్రెస్టీజియస్ మూవీ టైగర్ 3 అదే తేదీకి రావడం లాంచనమేనని బాలీవుడ్ టాక్. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఇంకో వారం పది రోజుల్లో చెబుతారట. పఠాన్, జవాన్ దెబ్బకు ఒక్కసారిగా హిందీ డబ్బింగ్ మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లో ఊపందుకుంది. వీటి మధ్య వైష్ణవ్ నెగ్గుకురావడం అంత సులభంగా ఉండదు. ఏదో స్ట్రెయిట్ మూవీ అనే జాలితో జనం థియేటర్లకు రారు. బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఉందనే టాక్ వస్తే తప్ప కదలరు. సో అనువాదాల ఆధిపత్యాన్ని తట్టుకునేలా ఇంకో సినిమా ఉంటే బాగుండేది కానీ ఆ సూచనలు ప్రస్తుతానికి లేవు.
This post was last modified on September 22, 2023 1:44 pm
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…