Political News

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ భేటీ అయ్యారు. ప్ర‌స్తుతం రాజ‌కీయంగా ఈ వ్య‌వ‌హారం ప్రాధాన్యం ద‌క్కించుకుంది. మ‌హారాష్ట్ర‌కు చెందిన ఓ కీల‌క బీజేపీ నాయ‌కుడికి.. రాజ్య‌స‌భ సీటును ఇస్తున్నార‌న్న ప్ర‌చారం నేప‌థ్యంలో లోకేష్‌.. నేరుగా అక్క‌డి ముఖ్య‌మంత్రితో భేటీ కావ‌డం అత్యంత ప్రాధాన్యం సంత‌రించుకుంది. వాస్త‌వానికి నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్న‌ నేప‌థ్యంలో ఏపీలోని కూట‌మి పార్టీల‌కు ఈ నాలుగు వ‌స్తాయి. అయితే.. టీడీపీ, జ‌న‌సేన‌లే ఈ స్థానాల‌ను తీసుకుంటాయ‌న్న ప్ర‌చారం ఉంది.

కానీ, ఆదివారం బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం భేటీ అయి.. ఒక స్థానాన్ని తాము తీసుకునే ప్ర‌తిపాద‌న‌ను తెర‌మీదికి తెచ్చింది. దీనిని కూడా మ‌హారాష్ట్ర‌కు చెందిన ఓ పారిశ్రామిక వేత్త‌ల‌కు ఇవ్వాల‌న్న ప్ర‌తిపాద‌న వ‌చ్చింద‌ని జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ ప‌రిణామాల అనంత‌రం.. హుటాహుటిన‌.. సోమ‌వారం ఉద‌యం.. లోకేష్‌.. ముంబై వెళ్లారు. సీఎం ఫ‌డ‌ణ‌వీస్‌తో భేటీ అయ్యారు. అయితే.. రాజ్య‌స‌భ సీటుపై ఆయ‌న‌తో చ‌ర్చించారా? లేదా? అనే విష‌యం గోప్యంగా మారింది. తాను మ‌హారాష్ట్రలో ఐటీ, విద్యా శాఖ‌ల్లో అమ‌ల‌వుతున్న ఉత్త‌మ విధానాల‌ను అధ్య‌య‌నం చేసేందుకు వ‌చ్చిన‌ట్టు మంత్రి చెప్పారు.

కానీ, వాస్త‌వానికి ఏపీలోనే ఐటీ, విద్యాశాఖ‌ల్లో ఉత్త‌మ విధానాలు అమ‌లు చేస్తున్నామ‌ని.. ఇటీవ‌లే మంత్రి చెప్పిన విష‌యం గుర్తుండే ఉంటుంది. సో.. దీనిని బ‌ట్టి.. రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌పైనే ఇరువురు చ‌ర్చించార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం టీడీపీలో కీల‌క రోల్ పోషిస్తున్న లోకేష్‌.. జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలోనే ఫ‌డ‌ణ‌వీస్‌ను క‌లుసుకున్నారు. ఆయ‌న వెంట ప‌లువురు ఎంపీలు కూడాఉన్నారు. ఈ క్ర‌మంలో రాజ్య‌స‌భ సీటు విష‌యంపైనే చ‌ర్చించార‌ని ప‌రిశీల‌కులు. విశ్లేష‌కులు కూడా భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న పోటీ ప్ర‌కారం.. టీడీపీ మూడు స్థానాలు తీసుకున్నా.. అంద‌రినీ మెప్పించ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

ఈ స‌మ‌యంలో బీజేపీకి ఇవ్వాలంటే ఆలోచన చేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అయిన‌ప్ప‌టికీ.. త‌మ‌కు ఒక స్థానం అవ‌స‌ర‌మని బీజేపీ చెబుతున్న క్ర‌మంలో లోకేష్ ద్వారా చంద్ర‌బాబు వ‌ర్త‌మానం పంపి ఉంటార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇదిలావుంటే.. తాను మాత్రం విద్య‌, ఐటీ విష‌యాల‌పై చ‌ర్చించేందుకు ముఖ్య‌మంత్రిని క‌లుసుకున్నాన‌ని లోకేష్ ఎక్స్‌లోపేర్కొన్నారు. అదేవిధంగాప‌లు పెట్టుబ‌డి దారీ సంస్థ‌ల‌తోనూ చ‌ర్చించిన‌ట్టు ఆయ‌న తెలిపారు.

Kumar

Recent Posts

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

21 minutes ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

2 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

2 hours ago

సాయికృష్ణ కుటుంబానికి చంద్రబాబు భరోసా

విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…

3 hours ago

జాన్వీ కపూర్ దురదృష్టం అలా ఉంది

పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…

3 hours ago

కృష్ణలంక వివాదాన్ని బాబు ఎలా హ్యాండిల్ చేశారు?

రాజ‌కీయ చతుర‌త‌లో మ‌రోసారి టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు చాణ‌క్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. స‌ర్కారును ఇరుకున పెట్టేసి.. కుల‌,…

4 hours ago