Political News

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ భేటీ అయ్యారు. ప్ర‌స్తుతం రాజ‌కీయంగా ఈ వ్య‌వ‌హారం ప్రాధాన్యం ద‌క్కించుకుంది. మ‌హారాష్ట్ర‌కు చెందిన ఓ కీల‌క బీజేపీ నాయ‌కుడికి.. రాజ్య‌స‌భ సీటును ఇస్తున్నార‌న్న ప్ర‌చారం నేప‌థ్యంలో లోకేష్‌.. నేరుగా అక్క‌డి ముఖ్య‌మంత్రితో భేటీ కావ‌డం అత్యంత ప్రాధాన్యం సంత‌రించుకుంది. వాస్త‌వానికి నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్న‌ నేప‌థ్యంలో ఏపీలోని కూట‌మి పార్టీల‌కు ఈ నాలుగు వ‌స్తాయి. అయితే.. టీడీపీ, జ‌న‌సేన‌లే ఈ స్థానాల‌ను తీసుకుంటాయ‌న్న ప్ర‌చారం ఉంది.

కానీ, ఆదివారం బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం భేటీ అయి.. ఒక స్థానాన్ని తాము తీసుకునే ప్ర‌తిపాద‌న‌ను తెర‌మీదికి తెచ్చింది. దీనిని కూడా మ‌హారాష్ట్ర‌కు చెందిన ఓ పారిశ్రామిక వేత్త‌ల‌కు ఇవ్వాల‌న్న ప్ర‌తిపాద‌న వ‌చ్చింద‌ని జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ ప‌రిణామాల అనంత‌రం.. హుటాహుటిన‌.. సోమ‌వారం ఉద‌యం.. లోకేష్‌.. ముంబై వెళ్లారు. సీఎం ఫ‌డ‌ణ‌వీస్‌తో భేటీ అయ్యారు. అయితే.. రాజ్య‌స‌భ సీటుపై ఆయ‌న‌తో చ‌ర్చించారా? లేదా? అనే విష‌యం గోప్యంగా మారింది. తాను మ‌హారాష్ట్రలో ఐటీ, విద్యా శాఖ‌ల్లో అమ‌ల‌వుతున్న ఉత్త‌మ విధానాల‌ను అధ్య‌య‌నం చేసేందుకు వ‌చ్చిన‌ట్టు మంత్రి చెప్పారు.

కానీ, వాస్త‌వానికి ఏపీలోనే ఐటీ, విద్యాశాఖ‌ల్లో ఉత్త‌మ విధానాలు అమ‌లు చేస్తున్నామ‌ని.. ఇటీవ‌లే మంత్రి చెప్పిన విష‌యం గుర్తుండే ఉంటుంది. సో.. దీనిని బ‌ట్టి.. రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌పైనే ఇరువురు చ‌ర్చించార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం టీడీపీలో కీల‌క రోల్ పోషిస్తున్న లోకేష్‌.. జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలోనే ఫ‌డ‌ణ‌వీస్‌ను క‌లుసుకున్నారు. ఆయ‌న వెంట ప‌లువురు ఎంపీలు కూడాఉన్నారు. ఈ క్ర‌మంలో రాజ్య‌స‌భ సీటు విష‌యంపైనే చ‌ర్చించార‌ని ప‌రిశీల‌కులు. విశ్లేష‌కులు కూడా భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న పోటీ ప్ర‌కారం.. టీడీపీ మూడు స్థానాలు తీసుకున్నా.. అంద‌రినీ మెప్పించ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

ఈ స‌మ‌యంలో బీజేపీకి ఇవ్వాలంటే ఆలోచన చేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అయిన‌ప్ప‌టికీ.. త‌మ‌కు ఒక స్థానం అవ‌స‌ర‌మని బీజేపీ చెబుతున్న క్ర‌మంలో లోకేష్ ద్వారా చంద్ర‌బాబు వ‌ర్త‌మానం పంపి ఉంటార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇదిలావుంటే.. తాను మాత్రం విద్య‌, ఐటీ విష‌యాల‌పై చ‌ర్చించేందుకు ముఖ్య‌మంత్రిని క‌లుసుకున్నాన‌ని లోకేష్ ఎక్స్‌లోపేర్కొన్నారు. అదేవిధంగాప‌లు పెట్టుబ‌డి దారీ సంస్థ‌ల‌తోనూ చ‌ర్చించిన‌ట్టు ఆయ‌న తెలిపారు.

This post was last modified on June 1, 2026 10:51 pm

Share

Recent Posts

చెల్లెలిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

క‌లిసి రాజ‌కీయం చేయ‌క‌పోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో ఈ…

2 hours ago

చెన్నైలో చింటు మేనియా

సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. త‌న సినిమాల ఈవెంట్ల‌లో, ఇంట‌ర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్ర‌ముఖ తెలుగు…

2 hours ago

కనకరాజు లెక్కలు సేఫ్ గానే ఉన్నాయా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…

3 hours ago

బాగుంది ఆదివారం… థియేటర్లలో జన సందోహం

ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…

3 hours ago

కాలేజీలు కాదు… విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయంబర్స్మెంట్ జమ?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…

3 hours ago

పోలీసు యూనిఫాంలో ఉగ్ర‌వాదులు… ఢిల్లీ నిర‌స‌న‌ల్లో కుట్ర‌?

నీట్ ప్ర‌శ్న‌ప‌త్రం లీకేజీకి వ్య‌తిరేకంగా విద్యార్థులు చేప‌ట్టిన ఢిల్లీ నిర‌స‌న‌లో ఉగ్ర‌వాదుల కుట్ర కోణం బ‌య‌ట ప‌డింద‌ని ఢిల్లీ టాస్క్‌ఫోర్స్…

4 hours ago