Political News

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ భేటీ అయ్యారు. ప్ర‌స్తుతం రాజ‌కీయంగా ఈ వ్య‌వ‌హారం ప్రాధాన్యం ద‌క్కించుకుంది. మ‌హారాష్ట్ర‌కు చెందిన ఓ కీల‌క బీజేపీ నాయ‌కుడికి.. రాజ్య‌స‌భ సీటును ఇస్తున్నార‌న్న ప్ర‌చారం నేప‌థ్యంలో లోకేష్‌.. నేరుగా అక్క‌డి ముఖ్య‌మంత్రితో భేటీ కావ‌డం అత్యంత ప్రాధాన్యం సంత‌రించుకుంది. వాస్త‌వానికి నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్న‌ నేప‌థ్యంలో ఏపీలోని కూట‌మి పార్టీల‌కు ఈ నాలుగు వ‌స్తాయి. అయితే.. టీడీపీ, జ‌న‌సేన‌లే ఈ స్థానాల‌ను తీసుకుంటాయ‌న్న ప్ర‌చారం ఉంది.

కానీ, ఆదివారం బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం భేటీ అయి.. ఒక స్థానాన్ని తాము తీసుకునే ప్ర‌తిపాద‌న‌ను తెర‌మీదికి తెచ్చింది. దీనిని కూడా మ‌హారాష్ట్ర‌కు చెందిన ఓ పారిశ్రామిక వేత్త‌ల‌కు ఇవ్వాల‌న్న ప్ర‌తిపాద‌న వ‌చ్చింద‌ని జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ ప‌రిణామాల అనంత‌రం.. హుటాహుటిన‌.. సోమ‌వారం ఉద‌యం.. లోకేష్‌.. ముంబై వెళ్లారు. సీఎం ఫ‌డ‌ణ‌వీస్‌తో భేటీ అయ్యారు. అయితే.. రాజ్య‌స‌భ సీటుపై ఆయ‌న‌తో చ‌ర్చించారా? లేదా? అనే విష‌యం గోప్యంగా మారింది. తాను మ‌హారాష్ట్రలో ఐటీ, విద్యా శాఖ‌ల్లో అమ‌ల‌వుతున్న ఉత్త‌మ విధానాల‌ను అధ్య‌య‌నం చేసేందుకు వ‌చ్చిన‌ట్టు మంత్రి చెప్పారు.

కానీ, వాస్త‌వానికి ఏపీలోనే ఐటీ, విద్యాశాఖ‌ల్లో ఉత్త‌మ విధానాలు అమ‌లు చేస్తున్నామ‌ని.. ఇటీవ‌లే మంత్రి చెప్పిన విష‌యం గుర్తుండే ఉంటుంది. సో.. దీనిని బ‌ట్టి.. రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌పైనే ఇరువురు చ‌ర్చించార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం టీడీపీలో కీల‌క రోల్ పోషిస్తున్న లోకేష్‌.. జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలోనే ఫ‌డ‌ణ‌వీస్‌ను క‌లుసుకున్నారు. ఆయ‌న వెంట ప‌లువురు ఎంపీలు కూడాఉన్నారు. ఈ క్ర‌మంలో రాజ్య‌స‌భ సీటు విష‌యంపైనే చ‌ర్చించార‌ని ప‌రిశీల‌కులు. విశ్లేష‌కులు కూడా భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న పోటీ ప్ర‌కారం.. టీడీపీ మూడు స్థానాలు తీసుకున్నా.. అంద‌రినీ మెప్పించ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

ఈ స‌మ‌యంలో బీజేపీకి ఇవ్వాలంటే ఆలోచన చేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అయిన‌ప్ప‌టికీ.. త‌మ‌కు ఒక స్థానం అవ‌స‌ర‌మని బీజేపీ చెబుతున్న క్ర‌మంలో లోకేష్ ద్వారా చంద్ర‌బాబు వ‌ర్త‌మానం పంపి ఉంటార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇదిలావుంటే.. తాను మాత్రం విద్య‌, ఐటీ విష‌యాల‌పై చ‌ర్చించేందుకు ముఖ్య‌మంత్రిని క‌లుసుకున్నాన‌ని లోకేష్ ఎక్స్‌లోపేర్కొన్నారు. అదేవిధంగాప‌లు పెట్టుబ‌డి దారీ సంస్థ‌ల‌తోనూ చ‌ర్చించిన‌ట్టు ఆయ‌న తెలిపారు.

Kumar

Recent Posts

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

1 hour ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

1 hour ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

1 hour ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

2 hours ago

తెలంగాణ పాలిటిక్స్‌: ప‌వ‌న్ భ‌య‌మా… ఓట్ల భ‌య‌మా?

తెలంగాణ రాజ‌కీయాలు వ్యూహాత్మ‌క మ‌లుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్‌, టీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఒక్క‌సారిగా జ‌న‌సేన పార్టీపై…

2 hours ago

సీఎం అయినా విజయ్ లో తృప్తి లేదే!

మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…

5 hours ago