తరచూ వార్తల్లోకి వస్తున్నారు నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు. సొంత పార్టీపై తరచూ గళం విప్పుతూ.. అసమ్మతివాదిగా.. ఫైర్ బ్రాండ్ గా వ్యవహరిస్తున్న ఆయన తాజాగా మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.
ఢిల్లీలో ఉంటున్న ఆయన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఏపీ ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేయటంతో సొంత పార్టీ నేతలు.. కార్యకర్తలు ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి.
ప్రభుత్వ విధానాలు.. కొందరు నేతలపై తరచూ విమర్శలు చేసే రఘురామ.. ఇప్పటివరకూ అధినేత వైఎస్ జగన్ ను ఉద్దేశించి మాత్రం నేరుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
కొన్ని అంశాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని విభేదిస్తున్న ఆయన.. తాజాగా తన బలగాలతో కలిసి ఫోటో దిగారు. తనకున్న భద్రతా సమస్యల నేపథ్యంలో కేంద్ర బలగాలతో కూడిన రక్షణ కావాలని కోరారు. దీనికి స్పందించిన కేంద్రం.. ఆయనకు వై కేటగిరి భద్రత కల్పిస్తోంది.
తాజాగా పంచెకట్టుతో నిలుచున్న ఎంపీ రఘురామ.. ఆయన వెనుక.. పక్కన.. కేంద్రబలగాలతో కూడిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది. దీనిపై కొందరు పాజిటివ్ గా రియాక్టు అవుతుండగా.. మరికొందరు మాత్రం నెగిటివ్ గా స్పందిస్తున్నారు. అసలుసిసలు తెలుగు కల్చర్ ఉట్టిపడేలా ఉన్న ఆయన పంచె ఫోటో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.
This post was last modified on August 23, 2020 11:06 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…