Movie News

మన డైరెక్టర్లలో అతనొక్కడే ఆల్‍రౌండర్‍!

సినిమా డైరెక్టరంటే ఒకే తరహా సిగ్నేచర్‍కి అలవాటు పడిపోకూడదు. స్టీవెన్‍ స్పీల్‍బర్గ్, క్రిస్టఫర్‍ నోలాన్‍ తదితర దిగ్దర్శకులు ఎప్పుడూ ఒకే తరహా జోనర్‍కి కట్టుబడలేదు. కానీ తెలుగు చిత్ర సీమలో చాలా తక్కువ మంది దర్శకులు మాత్రమే సినిమా, సినిమాకూ మధ్య వ్యత్యాసం చూపిస్తారు.

బాగా సక్సెస్‍ అయిన డైరెక్టర్లంతా తమ జోన్‍ లోంచి బయటకు రావడానికి జంకుతుంటారు. రాజమౌళి గతంలో మాస్‍ సినిమాలు, ఇప్పుడు లార్జ్ స్కేల్‍ సినిమాలు తీస్తున్నాడు. త్రివిక్రమ్‍ పూర్తిగా ఫ్యామిలీ డ్రామాలకు కట్టుబడిపోయాడు. కొరటాల శివ సోషల్‍ మెసేజ్‍ వున్న సీరియస్‍ సినిమాలు తీస్తుంటాడు. బోయపాటి శ్రీను ఘాటెక్కిపోయే మసాలా సినిమాలకు పెట్టింది పేరు. సుకుమార్‍ ఒక్కడే ఒకే తరహా కథలకు కట్టుబడిపోకుండా జాగ్రత్త పడుతుంటాడు. అయితే అతని సినిమాలలో కూడా ప్రధానంగా రివెంజ్‍ థీమ్‍ కనిపిస్తుంటుంది.

తెలుగు సినిమా దర్శకులలో ఇప్పుడు ఆల్‍రౌండర్‍ ఎవరయినా వుంటే అది క్రిష్‍ మాత్రమే అనాలి. ప్రతి సినిమాకూ భిన్నమైన నేపథ్యం తీసుకుని కొత్త రకం కథలు చెప్పాలని తాపత్రయపడుతుంటాడు. గౌతమిపుత్ర శాతకర్ణిని మనకు పరిచయం చేసిన క్రిష్‍ త్వరలో పవన్‍కళ్యాణ్‍తో ఒక జానపద చిత్రాన్ని చూపించబోతున్నాడు.

ఈలోగా జంగిల్‍ బుక్‍ తరహాలో వైష్ణవ్‍ తేజ్‍తో ఒక సినిమా తీస్తున్నాడు. ప్రతి దర్శకుడికీ ఒక కంఫర్ట్ జోన్‍ వుంటే ఇక కొత్త కథలకు ఆస్కారముండదు. కనీసం క్రిష్‍ అయినా ఒక జోనర్‍కి ఫిక్స్ కాకపోవడం తెలుగు సినీ ప్రియులకు ఊరటనిచ్చే విషయం.

This post was last modified on August 23, 2020 3:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

28 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago