ఏపీ మంత్రి కొడాలి నాని ఓ ఛానల్ ఇంటర్వ్యూలో టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో బీజేపీని కూడా కరోనాతో పోలిస్తూ విమర్శలు గుప్పించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూడా తీవ్రంగానే స్పందించింది. మంత్రి కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీని ప్రజలు ఆదరించారని, అందుకే ఓ చోట అధికారంలోకి వచ్చామని, మరోచోట లోకసభ ఎన్నికల్లో సగం సీట్లు గెలుచుకున్నామని ట్వీట్ చేసింది. అవినీతి కుటుంబ పాలనతో రాష్ట్రాలను పీడిస్తున్న టీడీపీ, వైసీపీ వంటి ప్రాంతీయ వైరస్లకు బీజేపీ దేశవ్యాప్తంగా ఓ వ్యాక్సిన్ వంటిదని పేర్కొంది.
ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ ఎన్టీవీ ఇంటర్వ్యూలో కొడాలి నాని టీడీపీ, బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. కరోనా వైరస్ చైనాలు పుట్టిందని, అలాగే, ఇండియాలో పుట్టిన కరోనా బీజేపీ అని వ్యాఖ్యలు చేశారు. ఈ బీజేపీ కరోనా పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులను కలిపి తినేస్తోందని, త్రిపుర, ఒడిశాలో కాంగ్రెస్ను తినేసిందని, కమ్యూనిస్టులు, జనతా పార్టీ వంటి అన్నింటిని తినేస్తుందన్నారు. ఏపీకి కూడా ఇప్పటికే బీజేపీ అనే కరోనా వచ్చిందన్నారు.
అందుకే మనం ఏపీలో మాస్కులు వంటివి పెట్టి జాగ్రత్తగా ఉండాలని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు మాస్కులు సహా అన్నీ తీసేసి, ఆయనే వారిపైకి ఎగబడ్డాడని, అలాంటి సమయంలో బీజేపీ కరోనా ఆయనను ఎందుకు వదులుతుందని, పార్టీని కబలించేందుకు సిద్ధమైందని చెప్పారు. అయితే వైసీపీ అజాగ్రత్తగా ఉంటే ఇండియన్ కరోనా మీ పార్టీని కూడా కబలిస్తుందా అంటే జగన్ను ఏ కరోనా ఏం చేయలేదన్నారు.
కరోనా సోకిన కొంతమంది వ్యక్తులకు సింప్టమ్స్ బయటకు కనిపించవని, కొంతమంది ఊపిరాడక ప్రాణం పోగొట్టుకుంటారని, ఇండియాలోని ఈ కరోనా నుండి కనీసం సింప్టమ్స్ లేకుండా బయటపడగల సామర్థ్యం కలిగివ్యక్తి జగన్ అన్నారు. జగన్ చాలా బలమైన వ్యక్తి అని, ఏ కరోనా ఆయనను ఏం చేయలేదన్నారు.
This post was last modified on August 10, 2020 9:17 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…