Political News

మూడు రాజధానులపై జగన్ స్పీడ్.. సుప్రీంకు లేఖ

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ఇకపై ఏమాత్రం ఆలస్యం వద్దన్న రీతిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు కదులుతోంది. ఇప్పటికే అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు రద్దుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయగానే.. వాటిపై రాజపత్రాలను జారీ చేసిన జగన్ సర్కారు… కోర్టుల్లో పిటిషన్ల వల్ల కొనసాగుతున్న జాప్యానికి చెక్ పెట్టేలా చర్యలు షురూ చేసింది. ఇందులో భాగంగా వికేంద్రీకరణపై హైకోర్టు విధించిన స్టేటస్ కోపై స్టే విధించాలంటూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ వేసిన జగన్ సర్కారు.. తాజాగా సోమవారం లేఖ కూడా రాసింది. మూడు రాజధానుల విషయంలో ఇకపై ఎంతమాత్రం జాప్యం చేయొద్దని సదరు లేఖలో సుప్రీంను జగన్ సర్కారు కోరింది.

సుప్రీం కోర్టులో తాను దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని జగన్ సర్కారు విజ్ఞప్తి చేసింది. మూడు రాజధానుల బిల్లులకు ఏపీ హైకోర్టు ఈ నెల 14 వరకు స్టేటస్‌ కో విధించిన విషయం తెలిసిందే. దీనిపై స్టే విధించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం ఇదివరకే సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే దానిపై సోమవారం విచారణకు వస్తుందని అంతా భావించారు. కానీ, ఆ పిటిషన్ విచారణకు రాకపోవడంతో సోమవారమే అత్యవసర విచారణ చేపట్టాలంటూ సుప్రీం కోర్టు రిజిస్ట్రార్‌కు జగన్ సర్కారు లేఖ రాసింది.

ఆంధ్రప్రదేశ్‌ పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దుపై హైకోర్టు ఇచ్చిన ‘స్టేటస్‌ కో’ని ఎత్తివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ కాపీని కెవియట్‌ వేసిన వారికి తామే పంపినట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టు రిజిస్ట్రార్‌కు లేఖ రాసింది. ప్రతివాదులకు పిటిషన్‌ కాపీ పంపినందున వీలైనంత త్వరగా కేసుపై విచారణ జరపాలని ప్రభుత్వం లేఖలో కోరింది. మరి సుప్రీంకోర్టు ఈ లేఖపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తుంటే.. మూడు రాజధానులపై ఇక ఎంతమాత్రం జాప్యం జరగకూడదన్న స్పీడుతోనే జగన్ సర్కారు కదులుతోందన్న భావన వ్యక్తమవుతోంది.

This post was last modified on August 11, 2020 1:46 am

Share
Show comments
Published by
suman

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

17 minutes ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

2 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

3 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

4 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago