Political News

మొన్న కోటి.. ఇప్పుడు రూ.50 లక్షలు..పరిహారంతో సరా?

పోయిన ప్రాణానికి నిమిషాల్లో వెల కట్టే కొత్త సంప్రదాయం ఈ మధ్యన పెరుగుతోంది. ప్రాణం పోవటానికి కారణాలు తెలుసుకునే కన్నా.. ఫలానా ఉదంతం జరిగింది.. బాధితులు ఎంతమంది? సరే.. ఇంత పరిహారం ఇచ్చేద్దామని డిసైడ్ కావటం.. దానికి సంబంధించిన ప్రకటన చేయటం ఈ మధ్యన రివాజుగా మారుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు బాధితులకు పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించటం మామూలే.

కాకపోతే మారిన కాలానికి తగ్గట్లు ప్రభుత్వం ప్రమాదానికి కారణం.. బాధ్యుల్ని తెలుసుకోవటం.. బాధితులకు అందాల్సిన సాయం కంటే కూడా పరిహారాన్ని చాలా వేగంగా ప్రకటిస్తున్న వైనం చూస్తే.. విస్మయానికి గురి కావాల్సిందే. తాజాగా బెజవాడ కోవిడ్ సెంటర్ లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం విషయానికే వస్తే.. ఇప్పటివరకూ ఆ ఘటనలో తొమ్మిది మంది మరణించినట్లుగా చెబుతున్నారు.

ఇప్పటికి అగ్నిప్రమాదానికి సంబంధించిన మంటల తాలుకూ పొగ ఇంకా ఆరలేదు. అగ్నిప్రమాదంలో చిక్కుకుపోయి ప్రాణాలు విడిచిన వారిని పూర్తిగా బయటకు తీసుకురాలేదు. కానీ.. మరణించిన వారికి రూ.50లక్షల రూపాయిల పరిహారాన్ని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేసింది. భారీ మొత్తంలో పరిహారాన్ని ప్రభుత్వాలుప్రకటించటానికి మేం వ్యతిరేకం కాదు. కాకుంటే.. దానికో విధివిధానం అన్నట్లు ఉండాలన్నదే ప్రశ్న.

మొన్నటికి మొన్న విశాఖలో జరిగిన గ్యాస్ లీకేజీ సందర్భంగా మరణించిన వారికి కోటి రూపాయిలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. అదే నగరంలో భారీ క్రేజ్ విరిగిపోయి మరణించిన వారికి ప్రభుత్వం ప్రకటించిన పరిహారానికి.. తాజాగా బెజవాడలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో ప్రాణాలు విడిచిన వారికి ప్రకటించిన పరిహారానికి పోలిక లేకపోవటం ఏమిటి? ప్రమాదం ఏదైనా పోయేది ప్రాణమే. అలాంటప్పుడు ఒక్కో ప్రమాదానికి ఒక్కోలా పరిహారం ఎందుకు? దీని లాజిక్కేమిటి?దీని లెక్కేమిటి జగన్ సార్?

This post was last modified on August 9, 2020 6:10 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

పింఛ‌న్ల‌పై పిడుగు.. వైసీపీకి క‌ష్ట‌మేనా?

సామాజిక పింఛ‌న్ల పై పిడుగు ప‌డిన‌ట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంట‌రి మ‌హిళ లు.. వంటి సామాజిక పింఛ‌నుపై…

4 hours ago

వైసీపీ మేనిఫెస్టోపై చంద్ర‌బాబు ఫ‌స్ట్‌ రియాక్ష‌న్

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నిక‌ల మేనిఫెస్టోను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 2019…

4 hours ago

జై హనుమాన్ రూటు మారుతోంది

స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…

5 hours ago

ఆ విషయంలో ఎవరైనా సుకుమార్ తర్వాతే..

టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…

6 hours ago

బాబు సూప‌ర్ సిక్స్‌- జ‌గ‌న్ నైన్ గ్యారెంటీస్‌ ఎవ‌రిది ముందంజ‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో సూప‌ర్ సిక్స్‌ను ఎక్కువ‌గా ప్ర‌చారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వీటిని…

6 hours ago

మల్లీశ్వరి పెట్టిన ‘కోటి’ కష్టాలు

పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…

8 hours ago