Political News

ప‌వ‌న్ స‌తీమ‌ణి సింప్లిసిటీ… రైలులో తిరుపతికి..

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సతీమ‌ని అన్నా కొణిదెల ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తున్నారు. త‌న భ‌ర్త ప‌నితీరును మెచ్చుకోవ‌డంతోపాటు.. ఆయ‌న భార్య‌గా తాను ఎంతో గ‌ర్విస్తున్న‌ట్టు కూడా పేర్కొంటున్నారు. అలానే తిరుప‌తి నుంచి తిరుమ‌ల‌కు మెట్ల మార్గంలో వెళ్లి శ్రీవారిని ద‌ర్శించుకోవ‌డం.. త‌ల‌నీలాలు స‌మర్పించ‌డం కూడా తెలిసిందే. ఇవ‌న్నీ అన్నా కొణిదెల వ్య‌క్తిత్వాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. దీనికి నెటిజ‌న్ల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

తాజాగా అన్నా కొణిదెల త‌న సింప్లిసిటీని చాటుకున్నారు. సాధారణ మహిళగా రైలులో ప్రయాణం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను జ‌న‌సేన పార్టీ అభిమాని ఒక‌రు సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ఆమె ఎక్క‌డ నుంచి ఎక్క‌డికి వెళ్తున్నార‌న్న విష‌యం తెలియ‌దు కానీ.. రైలులో ప్ర‌యాణిస్తున్నట్టు మాత్రం స్ప‌ష్టం అవుతోంది. సాధారణ ప్రయాణికులతో కలిసి రైలులో ప్రయాణం చేశారు. ఫ‌స్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లో ఆమె కూర్చున్న ఫొటో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన నెటిజ‌న్లు.. అన్నా సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు.

వాస్త‌వానికి స‌ర్పంచుల కుటుంబాలే.. విమానాల్లో తిరుగుతున్న నేటి కాలంలో ప్ర‌ముఖ న‌టుడు, ఓ రాష్ట్రానికి ఉప ముఖ్య‌మంత్రిగా కూడా ఉన్న నాయ‌కుడి స‌తీమ‌ణి తాను అనుకుంటే.. ప్రైవేట్ జెట్‌లు, ప్రత్యేక వాహనాల్లో కూడా తిర‌గొచ్చు. కానీ, దీనికి భిన్నంగా సామాన్య ప్రయాణికురాలిగా అన్నా కొణిదెల‌ రైలు ప్రయాణం చేయ‌డం ఆమె సింప్లిసిటీకి నిద‌ర్శ‌న‌మ‌ని సోషల్ మీడియా నెటిజ‌న్లు పేర్కొన్నారు. బోగీలోని ప్రజలతో మమేకమవుతూ సామాన్య జీవనశైలిని కొనసాగించడం పట్ల నెటిజన్ల ప్రశంసలు గుప్పిస్తున్నారు.

This post was last modified on August 14, 2026 8:46 pm

Share

Recent Posts

‘సనాతన’ వివాదంపై అనసూయ క్లారిటీ

టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముక్కుసూటిగా మాట్లాడడం, అనుకున్నది ఠక్కున చెప్పేయడం ఆమె నైజం. ఇక,…

8 minutes ago

రాజగోపాల్ రెడ్డిపై ఈసారి వేటు తప్పదా?

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాకాలంగా సొంత పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్న సంగతి…

38 minutes ago

మైత్రీ సినిమాలన్నీ గతంలోకే వెళ్తున్నాయే!

మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ఉన్న లైనప్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది. ప్రెజెంట్ నడుస్తున్న కథల కంటే…

2 hours ago

రేషన్ కార్డుపై మోదీ బొమ్మ వేయాల్సిందే!

ఈ రోజుల్లో పబ్లిసిటీకి కాదేదీ అనర్హం…రాజకీయ నేతలు మొదలు సినీ తారల వరకు అందరూ పబ్లిసిటీనే నమ్ముకున్నారంటే అతిశయోక్తి కాదు.…

2 hours ago

జగన్ కు అవమానం… జైలు సిబ్బంది క్లారిటీ

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ని పరామర్శించేందుకు కర్నూలు జిల్లా పంచలింగాల జైలు వద్దకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…

3 hours ago

వెంకటేష్ ప్రయాణానికి అప్పుడే 40 ఏళ్ళు

సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం ఇదే రోజు 1986 సంవత్సరం ఆగస్ట్ 14 కలియుగ పాండవులు రిలీజయ్యింది. మాములుగా స్టార్…

3 hours ago