తెలంగాణలో నెల కిందట్నుంచి రోజూ వెయ్యికి తక్కువ కాకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అందులో మెజారిటీ హైదరాబాద్ పరిధిలోనివే. ఈ మధ్య అయితే రోజూ హైదరాబాద్ పరిధిలోనే 1000-1500 మధ్య కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ సంఖ్య ఎంతకీ తగ్గట్లేదు. మరణాల సంఖ్య కూడా ఆందోళనకర స్థాయిలోనే ఉంటోంది.
ప్రభుత్వం అటు ఇటుగా రోజుకు 10 మరణాలంటోంది కానీ.. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే ఆ నంబర్ ఎక్కువే అని మీడియా పరిశీలనలో వెల్లడైంది. తెలంగాణలో, హైదరాబాద్లో కరోనా తగ్గుముఖం పడుతున్న సూచనలైతే ఎంతమాత్రం కనిపించడం లేదు. జనాలు కూడా కరోనాకు బాగా అలవాటు పడిపోయినట్లు కనిపిస్తోంది.
ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం తరఫున ఆసక్తికర ప్రకటనలు చేశారు. ఈ నెల చివరికల్లా హైదరాబాద్లో కరోనా అదుపులోకి వచ్చేస్తుందని.. సెప్టెంబరు చివరికల్లా రాష్ట్రమంతటా కరోనా కంట్రోల్ అయిపోతుందని ఆయనన్నారు. ఈ ప్రకటన ఆశలు రేకెత్తించేదే కానీ రోజువారీ కేసులు, మరణాల తీరు చూస్తుంటే మాత్రం అలాంటి ఆశ, అంచనా ఎంతమాత్రం కనబడటం లేదు.
మరి ఏ ప్రామాణికతతో ప్రభుత్వం ఇలాంటి ప్రకటన చేయించిందో తెలియదు. పరిస్థితులు చూస్తుంటే మరికొన్ని నెలలు కరోనా విజృంభణ తప్పేలా లేదు. హెర్డ్ ఇమ్యూనిటీ అయినా రావాలి. లేదా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి అయినా కరోనా నియంత్రణ జరగాలి. అంతే తప్ప ఈ నెలలోనో.. వచ్చే నెలలోనో కరోనా అదుపులోకి వస్తుందంటే మాత్రం నమ్మశక్యంగా లేదు.
This post was last modified on August 10, 2020 6:36 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…