అదిరిపోయే కాన్సెప్టుతో మ‌రో కార్య‌క్ర‌మం.. చంద్ర‌బాబు విజ‌న్

టీడీపీ అధినేత చంద్ర‌బాబు క్ష‌ణం తీరిక లేకుండా ప‌నిచేస్తున్నారు. ఇప్ప‌టికే మినీ మేనిఫెస్టో ప్ర‌క‌టించిన ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా మ‌రో అదిరిపోయే కాన్సెప్టుతో ప్ర‌జ‌ల్లోకి రావాల‌ని నిర్ణ‌యించారు. ఈ నెల 10వ తేదీన చంద్రబాబు ఈకార్య‌క్ర‌మాన్ని ప్రారంభించనున్నా రు. అనంతరం సుమారు 150 రోజుల పాటు ఆ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహించనున్నారు.

సమావేశంలో భాగంగా ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి..? ఏయే రోజున ఏయే కార్యక్రమాలు నిర్వహించాలి..? వంటి అంశాలపై ఇప్ప‌టికే రోడ్ మ్యాప్‌రెడీ చేసుకున్నారు. అయితే.. ఈ 150 రోజుల కార్య‌క్ర‌మానికి `భ‌విష్య‌త్తుకు గ్యారెంటీ` పేరు పెట్టాల‌ని ప్రాథ‌మికంగా నిర్ణ‌యించారు. పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి.. వారి  చర్చించనున్నారు. అనంత‌రం.. ఈ పేరును ఖ‌రారు చేయ‌నున్న‌ట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.  జూన్ 10న ప్రారంభ‌మ‌య్యే  ‘భవిష్యత్‌కు గ్యారెంటీస  కార్యక్రమాన్ని ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ల‌నున్నారు.

ఇప్ప‌టికే ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో.. విడుద‌ల చేసింది.  ఈ నేపథ్యంలో ఆ పేరుతోనే (‘భవిష్యత్తుకు గ్యారెంటీ’) ఈ నెల 10వ తేదీ నుంచి ప్రజల్లోకి చంద్రబాబు, ఆ పార్టీ నేతలు వెళ్లనున్నారు. గతకొన్ని నెలలక్రితం టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘బాదుడే బాదుడు, ఇదేం కర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాలు విజ‌యం సాధించాయి. వైసీపీ ప్ర‌భుత్వంపై ఓ రేంజ్‌లో ప్ర‌జ‌లు ఆలోచించేలా చేయ‌గ‌లిగారు. ప్ర‌భుత్వ ద‌మ‌న నీతిని ఎండ‌గ‌ట్టారు.

ఈ నేపథ్యంలో ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో త్వరలోనే కొత్త కార్యక్రమాన్ని చేపట్టి.. మ‌రింత‌గా ప్ర‌భుత్వ అవినీతి, అభివృద్ధి లేక‌పోవ‌డం.. వంటి విష‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించారు. దీనిలో అంద‌రూ పాల్గొనేలా.. ప్ర‌తి ఒక్క‌రి భాగ‌స్వామ్యం ఉండేలా కార్య‌క్ర‌మాన్ని తీర్చి దిద్దారు.