టీడీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కడినీ వదిలి పెట్టను.. అమలాపురంలో ఉన్నా అమెరికా పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తామని టీడీపీ యువ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. మహానాడులో రెండో రోజు ఆయన గంభీరంగా ప్రసంగించారు. రాజమహేంద్రవరం పేరులోనే రాజసం ఉందని అన్నారు. గోదావరి నీరులాగే ఇక్కడివారి మనసులు కూడా స్వచ్ఛంగా ఉంటాయని ప్రశంసించారు. కష్టం వస్తే ప్రజల కన్నీరు తుడిచింది.. బడుగువర్గాలకు రాజకీయ ప్రవేశం కల్పించింది.. ఎన్టీఆర్ అని కొనియాడారు. ఏపీని ప్రపంచ పటంలో పెట్టింది.. మన చంద్రన్న అని నారా లోకేష్ తెలిపారు.
ఎన్నో పరిశ్రమలు తెచ్చి అభివృద్ధి అంటే ఏమిటో చంద్రబాబు చేసి చూపించారని లోకేష్ అన్నారు. టీడీపీ.. ఘన చరిత్ర ఉన్న పార్టీ అని.. వైసీపీ అంటే గలీజు పార్టీ అని మండిపడ్డారు. చంద్రన్నది అభివృద్ధి బాట.. జగన్ది అవినీతి బాట అని విమర్శించారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి సైకోగా మారారని.. నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు. లక్ష కోట్లు ఆస్తి ఉన్నవాడు పేదవాడా అని లోకేశ్ ప్రశ్నించారు. లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు పేదవాడా అని నిలదీశారు. వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా అని లోకేష్ ధ్వజమెత్తారు.
కరెంట్, ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాదుడే బాదుడు చేపట్టారని.. కరెంట్ బిల్లులు, ఆర్టీసీ టికెట్లపై జగన్ తన ఫోటో ముద్రించాలని లోకేష్ పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కట్టిన టిడ్కో ఇళ్లకు.. వైసీపీ ప్రభుత్వంలో రంగులు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. పేదలకు సెంటు స్థలం ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారని.. పేదల ఇళ్ల స్థలాల పేరుతో 7 వేల కోట్ల రూపాయలను లూటీ చేశారని ఆరోపించారు. ఇళ్లు కట్టుకునే స్తోమత పేదలకు ఉంటుందా అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కడినీ వదిలి పెట్టను.. అమలాపురంలో ఉన్నా అమెరికా పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తామని లోకేష్ హెచ్చరించారు.
పోరాటం మన పసుపు సైన్యం బ్లడ్లో ఉందన్న లోకేష్.. పోరాడిన ప్రతి కార్యకర్త బాధ్యత తనదని హామీ ఇచ్చారు. పేదలు ఎప్పటికీ పేదరికంలో ఉండాలి అనేది సైకో జగన్ కోరిక అని మండిపడ్డారు. పేదరికం లేని రాష్ట్రం చూడాలి అన్నది మీ లోకేశ్ ఎజెండా అని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ పేరు చెబితే పౌరుషం, పసుపు జెండా చూస్తే పూనకం వస్తుందన్నారు. వైసీపీ పాలనలో యువత, మహిళలు, కార్మికులు, ఉద్యోగులంతా బాధ పడుతున్నారని.. ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు తరలివెళ్తున్నారని విమర్శించారు.
తన పాదయాత్రలో రాయలసీమ ప్రజల కష్టాలు చూశానని నారా లోకేశ్ చెప్పారు. తమ పాదయాత్రను అడ్డుకునేందుకు రాజారెడ్డి రాజ్యాంగం ప్రయోగించారని.. అంబేడ్కర్ రాజ్యాంగంతో ఈ ప్రభుత్వానికి జవాబు చెప్పానని లోకేష్ తెలియజేశారు. టీడీపీ కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన ఎవరినీ వదిలిపెట్టన్న లోకేష్.. పెద్దపెద్ద సైకోలను ఎదిరించిన ఘనత టీడీపీది అని నారా లోకేష్ తెలిపారు.
ఇంగ్లాండ్ టీ20 టూర్లో టీమిండియా ఆడుతున్న తీరు చూస్తుంటే ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అవుతోంది. ట్రెంట్ బ్రిడ్జ్ లో…
తమిళనాడు సీఎం విజయ్ జన నాయకుడు సినిమా విషయంలో జరుగుతున్న పరిణామాలు తెరమీద డ్రామా కన్నా గొప్పగా పండుతున్నాయి. మొన్నెవరో…
కర్ణాటక వెళ్ళడానికి బెంగళూరు బస్సు ఎక్కాలి.. తెలంగాణ వెళ్ళడానికి హైదరాబాద్ బస్సు ఎక్కాలి.. మావిగన్ వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కాలి…
వెండితెరపై ఎప్పుడూ కాస్త బోల్డ్, వెస్ట్రన్ లుక్స్తో ట్రెండ్ క్రియేట్ చేసే శ్రుతి హాసన్ ఈసారి పూర్తిగా రూట్ మార్చేసింది.…
దురంధర్ తర్వాత రామ్ చరణ్ మెచ్చుకున్న బాలీవుడ్ మూవీ ఇటీవలే విడుదలైన బేబి దో డై దో. టైటిల్ విచిత్రంగా…
ఏపీలో యూట్యూబర్ ప్రశ్న రావణ్ వ్యాఖ్యలు, ఆ తర్వాత అతడి అరెస్టులపై పెద్ద రచ్చే కొనసాగుతోంది. తాజాగా ఈ విషయంపై…