Political News

ఒక్కడినీ వదిలి పెట్టను.. అమెరికాలో ఉన్నా లోపలేస్తా

 టీడీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కడినీ వదిలి పెట్టను.. అమలాపురంలో ఉన్నా అమెరికా పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తామని టీడీపీ యువ నేత‌, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌ హెచ్చరించారు. మ‌హానాడులో రెండో రోజు ఆయ‌న గంభీరంగా ప్ర‌సంగించారు. రాజమహేంద్రవరం పేరులోనే రాజసం ఉందని అన్నారు. గోదావరి నీరులాగే ఇక్కడివారి మనసులు కూడా స్వచ్ఛంగా ఉంటాయని ప్రశంసించారు. కష్టం వస్తే ప్రజల కన్నీరు తుడిచింది.. బడుగువర్గాలకు రాజకీయ ప్రవేశం కల్పించింది.. ఎన్టీఆర్‌ అని కొనియాడారు. ఏపీని ప్రపంచ పటంలో పెట్టింది.. మన చంద్రన్న అని నారా లోకేష్‌ తెలిపారు.  

ఎన్నో పరిశ్రమలు తెచ్చి అభివృద్ధి అంటే ఏమిటో చంద్రబాబు చేసి చూపించారని  లోకేష్ అన్నారు. టీడీపీ.. ఘన చరిత్ర ఉన్న పార్టీ అని.. వైసీపీ అంటే గలీజు పార్టీ అని మండిపడ్డారు. చంద్రన్నది అభివృద్ధి బాట.. జగన్‌ది అవినీతి బాట అని విమర్శించారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి సైకోగా మారారని.. నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు. లక్ష కోట్లు ఆస్తి ఉన్నవాడు పేదవాడా అని లోకేశ్ ప్రశ్నించారు. లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు పేదవాడా అని నిలదీశారు. వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా అని  లోకేష్‌ ధ్వజమెత్తారు.  

కరెంట్‌, ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాదుడే బాదుడు చేపట్టారని.. కరెంట్‌ బిల్లులు, ఆర్టీసీ టికెట్లపై జగన్‌ తన ఫోటో ముద్రించాలని  లోకేష్ పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కట్టిన టిడ్కో ఇళ్లకు.. వైసీపీ ప్రభుత్వంలో రంగులు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. పేదలకు సెంటు స్థలం ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారని.. పేదల ఇళ్ల స్థలాల పేరుతో 7 వేల కోట్ల రూపాయలను లూటీ చేశారని ఆరోపించారు. ఇళ్లు కట్టుకునే స్తోమత పేదలకు ఉంటుందా అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కడినీ వదిలి పెట్టను.. అమలాపురంలో ఉన్నా అమెరికా పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తామని  లోకేష్‌ హెచ్చరించారు.

పోరాటం మన పసుపు సైన్యం బ్లడ్లో ఉందన్న  లోకేష్‌.. పోరాడిన ప్రతి కార్యకర్త బాధ్యత తనదని హామీ ఇచ్చారు. పేదలు ఎప్పటికీ పేదరికంలో ఉండాలి అనేది సైకో జగన్ కోరిక అని మండిపడ్డారు. పేదరికం లేని రాష్ట్రం చూడాలి అన్నది మీ లోకేశ్ ఎజెండా అని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ పేరు చెబితే పౌరుషం, పసుపు జెండా చూస్తే పూనకం వస్తుందన్నారు. వైసీపీ పాలనలో యువత, మహిళలు, కార్మికులు, ఉద్యోగులంతా బాధ పడుతున్నారని.. ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు తరలివెళ్తున్నారని విమర్శించారు.

తన పాదయాత్రలో రాయలసీమ ప్రజల కష్టాలు చూశానని నారా లోకేశ్‌ చెప్పారు. తమ పాదయాత్రను అడ్డుకునేందుకు రాజారెడ్డి రాజ్యాంగం ప్రయోగించారని.. అంబేడ్కర్‌ రాజ్యాంగంతో ఈ ప్రభుత్వానికి జవాబు చెప్పానని   లోకేష్ తెలియజేశారు. టీడీపీ కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన ఎవరినీ వదిలిపెట్టన్న  లోకేష్‌.. పెద్దపెద్ద సైకోలను ఎదిరించిన ఘనత టీడీపీది అని నారా  లోకేష్ తెలిపారు.  

This post was last modified on May 29, 2023 9:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

2 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

2 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

4 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

4 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

5 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

5 hours ago