Political News

మ‌హానాడు వేళ.. టీడీపీలో క‌ల‌క‌లం రేపిన ఎంపీ

ఒక‌వైపు మ‌హానాడు జ‌రుగుతోంది. ఇది తెలుగు దేశం పార్టీకి అత్యంత కీల‌క‌మైన పండుగ‌లాంటి సంబ‌రం. ప్ర‌తి రెండేళ్ల‌కు ఒక‌సారి నిర్వ‌హించే ఈ కార్య‌క్ర‌మాన్ని కొన్నాళ్లుగా.. ప్ర‌తి ఏటా నిర్వ‌హిస్తున్నారు. దీంతో ఈ కార్య‌క్ర‌మానికి అంగ‌రంగ‌వైభ‌వంగా ఏర్పాట్లు చేశారు. పైగా వ‌చ్చేది ఎన్నిక‌ల నామ సంవ‌త్స‌రం కావ‌డంతో మ‌రింత‌గా ఈ మ‌హానాడుకు ప్రాధాన్యం ఏర్ప‌డింది. దీంతో ఎక్క‌డెక్క‌డి నుంచో నాయ‌కులు ఈ కార్య‌క్ర‌మా నికి త‌ర‌లి వ‌స్తున్నారు.

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని క‌డియం మండ‌లానికి స‌మీపంలో వేమ‌గిరిలో నిర్వ‌హిస్తున్న మ‌హానా డుకు ఎంతో మంది నాయ‌కులు వ‌చ్చినా.. ఒక‌రిద్ద‌రుకీల‌క నాయ‌కులు డుమ్మా కొట్టారు. ఈ ఏడాది రెండు రోజులు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన కార్య‌క్ర‌మంలో తొలి రోజు.. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని క‌నిపిం చలేదు. నిజానికి పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రుగుతున్నాయి కాబ‌ట్టి రాలేక పోయార‌ని అనుకుందామంటే .. అలాఏమీ లేదు.

పోనీ.. కొత్త పార్ల‌మెంటును ప్రారంభిస్తున్నారు కాబ‌ట్టి.. ఆయ‌న అక్క‌డున్నారా? అంటే.. అది కూడా లేదు. ఎందుకంటే.. మ‌హానాడులో సాటి ఎంపీ.. శ్రీకాకుళం నాయ‌కుడు కె. రామ్మోహ‌న్‌నాయుడు పాల్గొన్నారు. కానీ, ఎంపీ నాని మాత్రం దూర‌మ‌య్యారు. దీనిపై టీడీపీలో పెద్ద ఎత్తున చ‌చ‌ర్చ సాగుతోంది. అయితే.. ఇంత‌లోనే ఆయ‌న ఆఫీస్ నుంచి ఒక ప్ర‌క‌ట‌న సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేసింది.

పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్‌లో ఉన్న అన్న‌గారు ఎన్టీఆర్ విగ్ర‌హానికి నివాళుల‌ర్పించేందుకు అనుమ‌తి ఇవ్వాలంటూ.. ఎంపీ నాని..స్పీక‌ర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. పార్ల‌మెంటులో ఉన్న విగ్ర‌హానికి అన్న‌గారి శ‌త జ‌యంతిని పుర‌స్క‌రించుకుని నివాళుల‌ర్పిస్తామ‌ని.. అనుమ‌తించాల‌ని లేఖ‌లో కోరారు. అయితే.. దీనికి స్పీక‌ర్ అనుమ‌తించారా? లేదా? అనేది మాత్రం తెలియ‌దు. కానీ.. నాని వ్యూహం మాత్రం.. మీరు ఇక్క‌డ మ‌హానాడు చేసుకుంటున్నారు. నేను అక్క‌డ పార్ల‌మెంటులో అన్న‌గారికి నివాళుల‌ర్పిస్తున్నాను అనే సంకేతాలు ఇచ్చిన‌ట్టుగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on May 29, 2023 9:38 am

Share

Recent Posts

మోడీ చంద్రబాబుతో ప్రకటన చేయిస్తారా

అటు పార్లమెంటులోనూ.. ఇటు బయట కూడా.. నీట్ ప్రశ్నపత్రాలకు సంబంధించిన నిరసనలు కొనసాగుతున్న సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని…

2 hours ago

రణబాలి… వస్తే ఆశ్చర్యపోవాలి

విజయ్ దేవరకొండకు 2026 ఎంతో కీలకమైన సంవత్సరం. చాలా ఏళ్ల నుంచి సరైన విజయం లేని అతను.. ఈ ఏడాది…

2 hours ago

పూజా హెగ్డే మాస్ ఛాన్సు కొట్టేసిందా?

పూజా హెగ్డే పేరుకు ఉత్తరాది హీరోయినే కానీ.. ఆమె ఎక్కువ సినిమాలు చేసింది సౌత్‌లోనే. ముఖ్యంగా తెలుగులో ఆమె ఒకప్పుడు…

3 hours ago

విజయ్ అడిగితే ఏదైనా ఇచ్చేయమన్న రావిపూడి

తమిళంలో నంబర్ వన్ హీరో స్థానంలో ఉండగా సినిమాలకు టాటా చెప్పేసి రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు విజయ్. వెళ్తూ వెళ్తూ ఆయన…

3 hours ago

నాయకుడిపై కేసరి బరువు

రేపు జన నాయకుడు విడుదలవుతోంది. ఇది కాదు అసలు విశేషం. ఏపీ తెలంగాణ కొన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం 7…

4 hours ago

మ్యాథ్స్ లో 51 మార్కులు… ఇప్పుడు నింగిలోకి రాకెట్ పంపాడు!

స్కూల్ లో చదివేటప్పుడు లెక్కల్లో కేవలం 51 మార్కులు వచ్చాయి. ఇంకో సబ్జెక్టులో అయితే ఏకంగా ఫెయిల్ అయ్యాడు. ఎనిమిదో…

4 hours ago