ఒకవైపు మహానాడు జరుగుతోంది. ఇది తెలుగు దేశం పార్టీకి అత్యంత కీలకమైన పండుగలాంటి సంబరం. ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కొన్నాళ్లుగా.. ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి అంగరంగవైభవంగా ఏర్పాట్లు చేశారు. పైగా వచ్చేది ఎన్నికల నామ సంవత్సరం కావడంతో మరింతగా ఈ మహానాడుకు ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో ఎక్కడెక్కడి నుంచో నాయకులు ఈ కార్యక్రమా నికి తరలి వస్తున్నారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కడియం మండలానికి సమీపంలో వేమగిరిలో నిర్వహిస్తున్న మహానా డుకు ఎంతో మంది నాయకులు వచ్చినా.. ఒకరిద్దరుకీలక నాయకులు డుమ్మా కొట్టారు. ఈ ఏడాది రెండు రోజులు నిర్వహించాలని నిర్ణయించిన కార్యక్రమంలో తొలి రోజు.. విజయవాడ ఎంపీ కేశినేని నాని కనిపిం చలేదు. నిజానికి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి రాలేక పోయారని అనుకుందామంటే .. అలాఏమీ లేదు.
పోనీ.. కొత్త పార్లమెంటును ప్రారంభిస్తున్నారు కాబట్టి.. ఆయన అక్కడున్నారా? అంటే.. అది కూడా లేదు. ఎందుకంటే.. మహానాడులో సాటి ఎంపీ.. శ్రీకాకుళం నాయకుడు కె. రామ్మోహన్నాయుడు పాల్గొన్నారు. కానీ, ఎంపీ నాని మాత్రం దూరమయ్యారు. దీనిపై టీడీపీలో పెద్ద ఎత్తున చచర్చ సాగుతోంది. అయితే.. ఇంతలోనే ఆయన ఆఫీస్ నుంచి ఒక ప్రకటన సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.
పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉన్న అన్నగారు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు అనుమతి ఇవ్వాలంటూ.. ఎంపీ నాని..స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. పార్లమెంటులో ఉన్న విగ్రహానికి అన్నగారి శత జయంతిని పురస్కరించుకుని నివాళులర్పిస్తామని.. అనుమతించాలని లేఖలో కోరారు. అయితే.. దీనికి స్పీకర్ అనుమతించారా? లేదా? అనేది మాత్రం తెలియదు. కానీ.. నాని వ్యూహం మాత్రం.. మీరు ఇక్కడ మహానాడు చేసుకుంటున్నారు. నేను అక్కడ పార్లమెంటులో అన్నగారికి నివాళులర్పిస్తున్నాను అనే సంకేతాలు ఇచ్చినట్టుగా ఉందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on May 29, 2023 9:38 am
ఏపీలో విపక్షం వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలుగా మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, నంద్యాల జిల్లాకు…
నిర్మాతగా నాని విపరీతమైన నమ్మకం పెట్టుకున్న కోర్ట్ ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఇంతకు ముందు ప్రొడ్యూసర్ గా…
వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగానే బుక్ అయిపోతున్నారు. వైసీపీ జమానాలో ఆయా నేతలు సాగించిన…
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ప్రతిపక్షం వైసీపీ నాయకులు సృష్టిస్తున్న విషప్రచారాన్ని ప్రజలు నమ్మరాదని ఏపీ మంత్రులు కోరారు. రాజధాని…
సాధారణంగా ఒక రాజకీయ పార్టీ విఫలమైతే.. ఆ పార్టీ నష్టపోవడమే కాదు.. ప్రత్యర్థి పార్టీలు కూడా బలోపేతం అవుతాయి. ఇప్పుడు…
హార్రర్ సినిమాల్లో దయ్యాల పాత్రలు పోషించిన కథానాయికలు చాలామందే ఉన్నారు. ఒకప్పుడంటే దయ్యాల పాత్రలు చేయడానికి స్టార్ హీరోయిన్లు వెనుకంజ…