Political News

పార్ల‌మెంటు సీట్లు పెరుగుతాయ్‌.. తెలుగు నేత‌ల సంబ‌రాలు!

దేశ రాజధాని ఢిల్లీలో నూతన పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం, కొత్త పార్లమెంట్‌లో ఆయ‌న‌ తొలి ప్రసంగం చేశారు. ‘ప్రతీ దేశ చరిత్రలో కొన్ని సందర్భాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. అమృత్ మహోత్సవ్‌ వేళ నూతన పార్లమెంట్‌ భవనాన్ని ఆవిష్కరించుకున్నాం. ఇది కేవలం భవనం మాత్రమే కాదు. 140 కోట్ల భారతీయుల ఆక్షాంకలకు ప్రతీక. కొత్త పార్లమెంట్‌ భవనం భారతీయల ధృడ సంకల్పాన్ని చాటి చెబుతుంది. స్వాతంత్ర్య పోరాట ఆకాంక్షలను పూర్తి చేసేందుకు కొత్త పార్లమెంట్‌ భవనం సాధనంగా ఉపయోగపడుతుంది“ అని మోడీ చెప్పారు.

ఇది ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయమ‌ని, ప్రవితమైన సెంగోల్‌(ధ‌ర్మ దండం)ను పార్లమెంట్‌లో ప్రతిష్టించామ‌ని మోడీ చెప్పారు. సెంగోల్‌.. చోళుల కాలంలో కర్తవ్య నిష్టకు ప్రతీకగా పేర్కొన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌కు సాక్షిగా పార్లమెంట్‌ నిలుస్తుందన్నారు. భారత్‌ కొత్త లక్ష్యాలను ఎంచుకుంద‌ని, ప్రజాస్వామ్యానికి భారత్‌ తల్లిలాంటిదని,  భారత్‌ అభివృద్ధి చెందితే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. లోక్‌సభ ప్రాంగణం నెమలి రూపంలోను, రాజ్యసభ ప్రాంగణం కమలాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.

రానున్న రోజుల్లో ఎంపీల సంఖ్య పెరుగుతుందని మోడీ చెప్పారు. దీనికి సంబంధించిన క‌స‌ర‌త్తు జ‌రుగుతోంద‌ని అన్నారు. లోక్‌సభ సీట్లు పెరిగితే మరింత ఎక్కువ మంది కూర్చునే విధంగా కొత్త పార్లమెంట్‌ భవనంలో వెసులుబాటు ఉంటుందని చెప్పారు.  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పార్లమెంట్‌ నిర్మించామ‌న్నారు. ఇతర దేశాలకు భారత్‌ సాగించిన ప్రయాణం ఆదర్శంగా నిలుస్తుందన్న ప్ర‌ధాని… అందరిలోనూ దేశమే ముందు అన్న భావన కలగాలని పిలుపునిచ్చారు.

తెలుగు రాష్ట్రాల్లో చ‌ర్చ‌

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ .. త్వ‌ర‌లోనే పార్ల‌మెంటు సీట్లు పెర‌గ‌నున్నాయ‌ని చెప్ప‌డం తో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చ‌ర్చ ప్రారంభ మైంది. మ‌రో ఆరు మాసాల్లో తెలంగాణ‌లోను, మ‌రో 10 మాసాల్లో ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఈ విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మ‌డి రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏపీ, తెలంగాణ‌లో అసెంబ్లీ, పార్ల‌మెంటు స్థానాలు పెర‌గాల్సి ఉంది. గ‌తంలోనే దీనిపై ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అయితే 2024 నాటికి పెంచుతామ‌ని అప్ప‌ట్లో కేంద్రం వెల్ల‌డించింది. తాజాగా ప్ర‌ధాని మోడీ కూడా ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌డంతో అన్ని పార్టీల్లోనూ సీట్ల పెంపు విష‌యం ఆస‌క్తిగా మారింది.

This post was last modified on May 29, 2023 12:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

47 minutes ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

1 hour ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

3 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

5 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

6 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

6 hours ago