Political News

పార్ల‌మెంటు సీట్లు పెరుగుతాయ్‌.. తెలుగు నేత‌ల సంబ‌రాలు!

దేశ రాజధాని ఢిల్లీలో నూతన పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం, కొత్త పార్లమెంట్‌లో ఆయ‌న‌ తొలి ప్రసంగం చేశారు. ‘ప్రతీ దేశ చరిత్రలో కొన్ని సందర్భాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. అమృత్ మహోత్సవ్‌ వేళ నూతన పార్లమెంట్‌ భవనాన్ని ఆవిష్కరించుకున్నాం. ఇది కేవలం భవనం మాత్రమే కాదు. 140 కోట్ల భారతీయుల ఆక్షాంకలకు ప్రతీక. కొత్త పార్లమెంట్‌ భవనం భారతీయల ధృడ సంకల్పాన్ని చాటి చెబుతుంది. స్వాతంత్ర్య పోరాట ఆకాంక్షలను పూర్తి చేసేందుకు కొత్త పార్లమెంట్‌ భవనం సాధనంగా ఉపయోగపడుతుంది“ అని మోడీ చెప్పారు.

ఇది ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయమ‌ని, ప్రవితమైన సెంగోల్‌(ధ‌ర్మ దండం)ను పార్లమెంట్‌లో ప్రతిష్టించామ‌ని మోడీ చెప్పారు. సెంగోల్‌.. చోళుల కాలంలో కర్తవ్య నిష్టకు ప్రతీకగా పేర్కొన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌కు సాక్షిగా పార్లమెంట్‌ నిలుస్తుందన్నారు. భారత్‌ కొత్త లక్ష్యాలను ఎంచుకుంద‌ని, ప్రజాస్వామ్యానికి భారత్‌ తల్లిలాంటిదని,  భారత్‌ అభివృద్ధి చెందితే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. లోక్‌సభ ప్రాంగణం నెమలి రూపంలోను, రాజ్యసభ ప్రాంగణం కమలాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.

రానున్న రోజుల్లో ఎంపీల సంఖ్య పెరుగుతుందని మోడీ చెప్పారు. దీనికి సంబంధించిన క‌స‌ర‌త్తు జ‌రుగుతోంద‌ని అన్నారు. లోక్‌సభ సీట్లు పెరిగితే మరింత ఎక్కువ మంది కూర్చునే విధంగా కొత్త పార్లమెంట్‌ భవనంలో వెసులుబాటు ఉంటుందని చెప్పారు.  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పార్లమెంట్‌ నిర్మించామ‌న్నారు. ఇతర దేశాలకు భారత్‌ సాగించిన ప్రయాణం ఆదర్శంగా నిలుస్తుందన్న ప్ర‌ధాని… అందరిలోనూ దేశమే ముందు అన్న భావన కలగాలని పిలుపునిచ్చారు.

తెలుగు రాష్ట్రాల్లో చ‌ర్చ‌

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ .. త్వ‌ర‌లోనే పార్ల‌మెంటు సీట్లు పెర‌గ‌నున్నాయ‌ని చెప్ప‌డం తో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చ‌ర్చ ప్రారంభ మైంది. మ‌రో ఆరు మాసాల్లో తెలంగాణ‌లోను, మ‌రో 10 మాసాల్లో ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఈ విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మ‌డి రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏపీ, తెలంగాణ‌లో అసెంబ్లీ, పార్ల‌మెంటు స్థానాలు పెర‌గాల్సి ఉంది. గ‌తంలోనే దీనిపై ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అయితే 2024 నాటికి పెంచుతామ‌ని అప్ప‌ట్లో కేంద్రం వెల్ల‌డించింది. తాజాగా ప్ర‌ధాని మోడీ కూడా ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌డంతో అన్ని పార్టీల్లోనూ సీట్ల పెంపు విష‌యం ఆస‌క్తిగా మారింది.

This post was last modified on May 29, 2023 12:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పాక్ దొంగ దారి!… యుద్ధం మొదలైనట్టే!

దాయాదీ దేశాలు భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధం మొదలైపోయిందనే చెప్పాలి. ఈ మేరకు గురువారం యుద్ధం జరుగుతున్న తీరుకు…

2 hours ago

శత్రు దుర్బేధ్యం భారత్… గాల్లోనే పేలిన పాక్ మిస్సైళ్లు

ఓ వైపు పాకిస్తాన్ కుట్రపూరిత వ్యూహాలు, మరోవైపు ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాద దాడులు… వెరసి నిత్యం భారత…

3 hours ago

ఈ అమ్మాయి యాక్టరే కాదు.. డాక్టర్ కూడా

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా.. ఒకప్పుడు చాలామంది హీరోలు, హీరోయిన్లు ఈ మాట చెప్పేవారు. ఐతే గతంలో సినిమాల్లోకి రావాలంటే…

4 hours ago

ఈ విష‌యం అప్పుడే చెప్పా.. నేత‌ల‌కు జ‌గ‌న్ క్లాస్.. !

వైసీపీ నాయ‌కుల‌పై కేసులు న‌మోదవుతున్నాయి. ఇప్ప‌టికే ప‌దుల సంఖ్య‌లో కేసులు ప‌డ్డాయి. జైలు-బెయిలు అంటూ.. నాయ‌కులు, అప్ప‌ట్లో వైసీపీకి అనుకూలంగా…

4 hours ago

ఏపీ లిక్క‌ర్ స్కాం.. ఈడీ ఎంట్రీ..

ఏపీని కుదిపేస్తున్న లిక్క‌ర్ కుంభ‌కోణం వ్య‌వ‌హారంపై ఇప్పుడు కేంద్రం ప‌రిధిలోని ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్ దృష్టి పెట్టింది. ఏపీ మ‌ద్యం…

4 hours ago

డ్రాగన్ భామ మీద అవకాశాల వర్షం

ఇండస్ట్రీలో అంతే. ఒక్క హిట్ జాతకాలను మార్చేస్తుంది. ఒక్క ఫ్లాప్ ఎక్కడికో కిందకు తీసుకెళ్తుంది. డ్రాగన్ రూపంలో సూపర్ సక్సెస్…

7 hours ago