Political News

పార్ల‌మెంటు సీట్లు పెరుగుతాయ్‌.. తెలుగు నేత‌ల సంబ‌రాలు!

దేశ రాజధాని ఢిల్లీలో నూతన పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం, కొత్త పార్లమెంట్‌లో ఆయ‌న‌ తొలి ప్రసంగం చేశారు. ‘ప్రతీ దేశ చరిత్రలో కొన్ని సందర్భాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. అమృత్ మహోత్సవ్‌ వేళ నూతన పార్లమెంట్‌ భవనాన్ని ఆవిష్కరించుకున్నాం. ఇది కేవలం భవనం మాత్రమే కాదు. 140 కోట్ల భారతీయుల ఆక్షాంకలకు ప్రతీక. కొత్త పార్లమెంట్‌ భవనం భారతీయల ధృడ సంకల్పాన్ని చాటి చెబుతుంది. స్వాతంత్ర్య పోరాట ఆకాంక్షలను పూర్తి చేసేందుకు కొత్త పార్లమెంట్‌ భవనం సాధనంగా ఉపయోగపడుతుంది“ అని మోడీ చెప్పారు.

ఇది ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయమ‌ని, ప్రవితమైన సెంగోల్‌(ధ‌ర్మ దండం)ను పార్లమెంట్‌లో ప్రతిష్టించామ‌ని మోడీ చెప్పారు. సెంగోల్‌.. చోళుల కాలంలో కర్తవ్య నిష్టకు ప్రతీకగా పేర్కొన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌కు సాక్షిగా పార్లమెంట్‌ నిలుస్తుందన్నారు. భారత్‌ కొత్త లక్ష్యాలను ఎంచుకుంద‌ని, ప్రజాస్వామ్యానికి భారత్‌ తల్లిలాంటిదని,  భారత్‌ అభివృద్ధి చెందితే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. లోక్‌సభ ప్రాంగణం నెమలి రూపంలోను, రాజ్యసభ ప్రాంగణం కమలాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.

రానున్న రోజుల్లో ఎంపీల సంఖ్య పెరుగుతుందని మోడీ చెప్పారు. దీనికి సంబంధించిన క‌స‌ర‌త్తు జ‌రుగుతోంద‌ని అన్నారు. లోక్‌సభ సీట్లు పెరిగితే మరింత ఎక్కువ మంది కూర్చునే విధంగా కొత్త పార్లమెంట్‌ భవనంలో వెసులుబాటు ఉంటుందని చెప్పారు.  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పార్లమెంట్‌ నిర్మించామ‌న్నారు. ఇతర దేశాలకు భారత్‌ సాగించిన ప్రయాణం ఆదర్శంగా నిలుస్తుందన్న ప్ర‌ధాని… అందరిలోనూ దేశమే ముందు అన్న భావన కలగాలని పిలుపునిచ్చారు.

తెలుగు రాష్ట్రాల్లో చ‌ర్చ‌

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ .. త్వ‌ర‌లోనే పార్ల‌మెంటు సీట్లు పెర‌గ‌నున్నాయ‌ని చెప్ప‌డం తో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చ‌ర్చ ప్రారంభ మైంది. మ‌రో ఆరు మాసాల్లో తెలంగాణ‌లోను, మ‌రో 10 మాసాల్లో ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఈ విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మ‌డి రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏపీ, తెలంగాణ‌లో అసెంబ్లీ, పార్ల‌మెంటు స్థానాలు పెర‌గాల్సి ఉంది. గ‌తంలోనే దీనిపై ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అయితే 2024 నాటికి పెంచుతామ‌ని అప్ప‌ట్లో కేంద్రం వెల్ల‌డించింది. తాజాగా ప్ర‌ధాని మోడీ కూడా ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌డంతో అన్ని పార్టీల్లోనూ సీట్ల పెంపు విష‌యం ఆస‌క్తిగా మారింది.

Satya

Recent Posts

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

29 minutes ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

2 hours ago

చివరి గీతం… ‘గాన కోకిల’ జానకి ఇక లేరు

సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…

3 hours ago

తెలంగాణ హంత‌కుడిది – జ‌గ‌న్‌ది ఒకే పోలిక‌: చంద్ర‌బాబు

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ‌లోని రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఓ వ్య‌క్తి ఆరుగురిని…

3 hours ago

ప్రశ్న రావణ్ విషయంలో చేతులెత్తేసిన జడ శ్రావణ్?

ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…

6 hours ago

ట్రంప్ తిప్పలు… వీడియో కాల్ లో నిశ్చితార్థం

అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…

7 hours ago