Political News

పార్ల‌మెంటు సీట్లు పెరుగుతాయ్‌.. తెలుగు నేత‌ల సంబ‌రాలు!

దేశ రాజధాని ఢిల్లీలో నూతన పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం, కొత్త పార్లమెంట్‌లో ఆయ‌న‌ తొలి ప్రసంగం చేశారు. ‘ప్రతీ దేశ చరిత్రలో కొన్ని సందర్భాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. అమృత్ మహోత్సవ్‌ వేళ నూతన పార్లమెంట్‌ భవనాన్ని ఆవిష్కరించుకున్నాం. ఇది కేవలం భవనం మాత్రమే కాదు. 140 కోట్ల భారతీయుల ఆక్షాంకలకు ప్రతీక. కొత్త పార్లమెంట్‌ భవనం భారతీయల ధృడ సంకల్పాన్ని చాటి చెబుతుంది. స్వాతంత్ర్య పోరాట ఆకాంక్షలను పూర్తి చేసేందుకు కొత్త పార్లమెంట్‌ భవనం సాధనంగా ఉపయోగపడుతుంది“ అని మోడీ చెప్పారు.

ఇది ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయమ‌ని, ప్రవితమైన సెంగోల్‌(ధ‌ర్మ దండం)ను పార్లమెంట్‌లో ప్రతిష్టించామ‌ని మోడీ చెప్పారు. సెంగోల్‌.. చోళుల కాలంలో కర్తవ్య నిష్టకు ప్రతీకగా పేర్కొన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌కు సాక్షిగా పార్లమెంట్‌ నిలుస్తుందన్నారు. భారత్‌ కొత్త లక్ష్యాలను ఎంచుకుంద‌ని, ప్రజాస్వామ్యానికి భారత్‌ తల్లిలాంటిదని,  భారత్‌ అభివృద్ధి చెందితే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. లోక్‌సభ ప్రాంగణం నెమలి రూపంలోను, రాజ్యసభ ప్రాంగణం కమలాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.

రానున్న రోజుల్లో ఎంపీల సంఖ్య పెరుగుతుందని మోడీ చెప్పారు. దీనికి సంబంధించిన క‌స‌ర‌త్తు జ‌రుగుతోంద‌ని అన్నారు. లోక్‌సభ సీట్లు పెరిగితే మరింత ఎక్కువ మంది కూర్చునే విధంగా కొత్త పార్లమెంట్‌ భవనంలో వెసులుబాటు ఉంటుందని చెప్పారు.  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పార్లమెంట్‌ నిర్మించామ‌న్నారు. ఇతర దేశాలకు భారత్‌ సాగించిన ప్రయాణం ఆదర్శంగా నిలుస్తుందన్న ప్ర‌ధాని… అందరిలోనూ దేశమే ముందు అన్న భావన కలగాలని పిలుపునిచ్చారు.

తెలుగు రాష్ట్రాల్లో చ‌ర్చ‌

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ .. త్వ‌ర‌లోనే పార్ల‌మెంటు సీట్లు పెర‌గ‌నున్నాయ‌ని చెప్ప‌డం తో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చ‌ర్చ ప్రారంభ మైంది. మ‌రో ఆరు మాసాల్లో తెలంగాణ‌లోను, మ‌రో 10 మాసాల్లో ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఈ విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మ‌డి రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏపీ, తెలంగాణ‌లో అసెంబ్లీ, పార్ల‌మెంటు స్థానాలు పెర‌గాల్సి ఉంది. గ‌తంలోనే దీనిపై ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అయితే 2024 నాటికి పెంచుతామ‌ని అప్ప‌ట్లో కేంద్రం వెల్ల‌డించింది. తాజాగా ప్ర‌ధాని మోడీ కూడా ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌డంతో అన్ని పార్టీల్లోనూ సీట్ల పెంపు విష‌యం ఆస‌క్తిగా మారింది.

This post was last modified on May 29, 2023 12:40 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

11 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

12 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

13 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

13 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

14 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

15 hours ago