దేశ రాజధాని ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం, కొత్త పార్లమెంట్లో ఆయన తొలి ప్రసంగం చేశారు. ‘ప్రతీ దేశ చరిత్రలో కొన్ని సందర్భాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. అమృత్ మహోత్సవ్ వేళ నూతన పార్లమెంట్ భవనాన్ని ఆవిష్కరించుకున్నాం. ఇది కేవలం భవనం మాత్రమే కాదు. 140 కోట్ల భారతీయుల ఆక్షాంకలకు ప్రతీక. కొత్త పార్లమెంట్ భవనం భారతీయల ధృడ సంకల్పాన్ని చాటి చెబుతుంది. స్వాతంత్ర్య పోరాట ఆకాంక్షలను పూర్తి చేసేందుకు కొత్త పార్లమెంట్ భవనం సాధనంగా ఉపయోగపడుతుంది“ అని మోడీ చెప్పారు.
ఇది ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయమని, ప్రవితమైన సెంగోల్(ధర్మ దండం)ను పార్లమెంట్లో ప్రతిష్టించామని మోడీ చెప్పారు. సెంగోల్.. చోళుల కాలంలో కర్తవ్య నిష్టకు ప్రతీకగా పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్కు సాక్షిగా పార్లమెంట్ నిలుస్తుందన్నారు. భారత్ కొత్త లక్ష్యాలను ఎంచుకుందని, ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిలాంటిదని, భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. లోక్సభ ప్రాంగణం నెమలి రూపంలోను, రాజ్యసభ ప్రాంగణం కమలాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.
రానున్న రోజుల్లో ఎంపీల సంఖ్య పెరుగుతుందని మోడీ చెప్పారు. దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోందని అన్నారు. లోక్సభ సీట్లు పెరిగితే మరింత ఎక్కువ మంది కూర్చునే విధంగా కొత్త పార్లమెంట్ భవనంలో వెసులుబాటు ఉంటుందని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పార్లమెంట్ నిర్మించామన్నారు. ఇతర దేశాలకు భారత్ సాగించిన ప్రయాణం ఆదర్శంగా నిలుస్తుందన్న ప్రధాని… అందరిలోనూ దేశమే ముందు అన్న భావన కలగాలని పిలుపునిచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో చర్చ
ప్రధాని నరేంద్ర మోడీ .. త్వరలోనే పార్లమెంటు సీట్లు పెరగనున్నాయని చెప్పడం తో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చ ప్రారంభ మైంది. మరో ఆరు మాసాల్లో తెలంగాణలోను, మరో 10 మాసాల్లో ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు పెరగాల్సి ఉంది. గతంలోనే దీనిపై ప్రయత్నాలు జరిగాయి. అయితే 2024 నాటికి పెంచుతామని అప్పట్లో కేంద్రం వెల్లడించింది. తాజాగా ప్రధాని మోడీ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేయడంతో అన్ని పార్టీల్లోనూ సీట్ల పెంపు విషయం ఆసక్తిగా మారింది.
This post was last modified on May 29, 2023 12:40 am
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…
కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…