Political News

50 ఎకరాల్లో మహానాడు

తెలుగుదేశం పార్టీ అట్టహాసంగా జరుపుకునే పసుపు పండుగ మహానాడు ఏర్పాట్లు జోరందుకుంటున్నాయి. ఈనెల 27,28 తేదీల్లో మహానాడును ఘనంగా రాజమండ్రిలో జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పుట్టినరోజు మే 28వ తేదీన మహానాడును జరుపుకోవటం పార్టీకి ఆనవాయితీగా వస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు వివిధ కారణాల వల్ల మహానాడు నిర్వహణకు అంతరాయాలు కలిగినా మొత్తం మీద రాబోయే పండుగను మాత్రం బ్రహ్మాండంగా జరుపుకోబోతున్నారు.

రాజమండ్రికి సమీపంలోని వేమగిరికి దగ్గర్లోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 50 ఎకరాల్లో మహానాడు జరగబోతోంది. సభా ప్రాంగణం పర్యవేక్షణ కమిటీ అధ్యక్షుడు, రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ గోరంట్ల బుచ్చయ్య చౌదరి దగ్గరుండి అన్నీ ఏర్పాట్లను చూసుకుంటున్నారు. జేసీబీలను పెట్టి మొత్తం స్ధలాన్ని చదునుచేయిస్తున్నారు. 27వ తేదీన ప్రతినిధుల సభ నిర్వహణకు వేదిక తదితరాలకు 10 ఎకరాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మొదటిరోజు అంటే 27వ తేదీన జరగబోయే ప్రతినిధుల సభకు 15 వేల మంది హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ప్రతినిధులతో పాటు పార్టీలోని వివిధ స్ధాయిల్లోని ప్రజాప్రతినిదులు, నేతలు, క్యాడర్ అంతా కలిసి సుమారు 50 వేలమంది భోజనాలు చేస్తారని అంచనా వేస్తున్నారు. ఎందుకైనా మంచిదని లక్షమందికి గోదావరి రుచులు చూపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండోరోజు అంటే 28వ తేదీన కీలకమైన సమావేశాల తర్వాత భారీ బహిరంగ సభ కూడా జరగబోతోంది. బహిరంగ సభకు సుమారు 15 లక్షలమంది హాజరవుతారని అంచనాలు వేస్తున్నారు.

భోజన ఏర్పాట్లు తదితరాల కోసం గోరంట్ల ఆధ్వర్యంలో దేవినేని ఉమామహేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్ప, ఆదిరెడ్డి అప్పారావు, జ్యోతుల నెహ్రూతో కమిటీ ఏర్పాటైంది. పనిలోపనిగా నగరం సుందరీకరణ పనుల కోసం ఆదిరెడ్డి వాసు, గన్ని కృష్ణ, వేణుగోపాలరావు తదితరులతో మరో కమిటి పనులను పర్యవేక్షిస్తోంది. నగరం మొత్తం పసుపుమయం చేసేయాలన్న పట్టుదలతో ఈ కమిటి పనిచేస్తోంది. ఈ మహానాడులో పొత్తులు, అభ్యర్ధుల ప్రకటన, పరిచయం, మ్యానిఫెస్టో ఉంటాయని పార్టీవర్గాలు చెబుతున్నాయి. మరి చివరకు చంద్రబాబునాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.

Satya

Recent Posts

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

21 minutes ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

48 minutes ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

2 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

2 hours ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

2 hours ago

సేనానికి అభిమానమే అడ్డు కాకూడదు

భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…

2 hours ago