మాజీ ఉపరాష్ట్రపతి, బీజేపీ నాయకులు వెంకయ్యనాయుడును సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీ నారాయణ కలిశారు. శుక్రవారం ఉదయం..విశాఖ బీచ్ రోడ్లో మార్నింగ్ వాక్ కోసం.. వచ్చిన వెంకయ్యతో లక్ష్మీనారాయణ అక్కడే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ.. రాగి జావ తాగారు. కొద్ది దూరం కలిసి నడిచారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణ వంటి అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తానుచేసేది ఏమీలేదని.. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని.. డెలిగేషన్తో వెళ్లి చర్చలు జరిపితే ప్రయోజనం ఉంటుందని ఆయన లక్ష్మీనారాయణకు సూచించినట్టు తెలిసింది. కాగా.. లక్ష్మీనారాయణ ఇప్పటికే హైకోర్టులో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఉక్కు ఫ్యాక్టరీని అమ్మితే..ప్రజలే కొనుగోలు చేసేలా.. ఆయన ఒక సూత్రాన్ని కూడా తెరమీదికి తెచ్చారు. ఆయా విషయాలను వెంకయ్యకు వివరించినట్టు సమాచారం.
ఇదిలావుంటే.. రాజకీయాల ప్రస్తావన కూడా వారిమధ్య వచ్చినట్టు సమాచారం. ఈ సందర్భంగా తాను ఒంటరిగానే విశాఖ నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నట్టు లక్ష్మీనారాయణ చెప్పారని తెలిసింది. దీనికి వెంకయ్య నాయుడు స్పందిస్తూ.. మీలాంటి వారికి బీజేపీ సరైన వేదిక అవుతుందని..ఎలాంటి అవినీతి లేకుండా పాలన సాగుతోందని.. ఎంతో మంది బ్యూరోక్రాట్లు బీజేపీలో చేరి.. మంచి భవిష్యత్తు పొందుతున్నారని.. ప్రజలకు సేవ చేసే అవకాశం కూడా ఉంటుందని పేర్కొన్నట్టు సమాచారం. అయితే.. దీనిపై లక్ష్మీనారాయణ మౌనంగా నే ఉండిపోయారని తెలిసింది. మరి భవిష్యత్తులో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
This post was last modified on April 21, 2023 6:15 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…