Political News

మేకపాటి ఆస్తి గొడవలు…

ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు అనేక సంచలనాలకు వేదికయ్యాయి. జగన్‌కు ప్రజా మద్దతు తగ్గుతోందని తేలిపోగా, టీడీపీ బాగా పుంజుకుందని కూడా నిర్థారణకు వచ్చారు. దానితో అగ్గిమీద గుగ్గిలం అయిన వైసీపీ అధిష్టానం పార్టీ నుంచి నలుగురిని సస్పెండ్ చేయగా అందులో నెల్లూరు జిల్లా నేత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఒకరు.

మేకపాటి ఇప్పుడు వరుసగా మీడియా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఏం చేసుకుంటారో చేసుకోడంని వైసీపీ అధిష్టానాన్ని సవాసు చేస్తున్నారు. తాను క్రాస్ ఓటింగ్‌కు దిగలేదని ప్రకటిస్తూనే.. అవును ఆ పని చేశానని నర్మగర్భంగా చెబుతున్నారు. ఎవరేం చేసినా వచ్చే ఎన్నికల్లో ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచేది తానేనని శేఖరన్న చెప్పుకుంటున్నారు.

ఒక మీడియా ఇంటర్వ్యూలో తమ కుటుంబ ఆస్తి తగాదాను ఆయన ప్రస్తావించారు. తన సోదరుడు మోకపాటి రాజమోహన్ రెడ్డి తనకు ఆస్తి పంచివ్వడం లేదని చంద్రశేఖర్ రెడ్డి వాపోయారు. తనకు డబ్బులకు ఇబ్బంది వచ్చినప్పుడు కూడా అన్న ఆదుకోలేదని చట్ట ప్రకారం తనకు రావాల్సిన ఆస్తి కూడా ఇవ్వడం లేదని చంద్రశేఖర్ రెడ్డి వాపోయారు

సీఎం జగన్ జోక్యం చేసుకుని తమ ఆస్తి వివాదాన్ని పరిష్కరించాలని ఓ సారి చంద్రశేఖర్ రెడ్డి నేరుగా విన్నవించుకున్నారట. అందుకు జగన్ తల ఊపి ఊరుకున్నారే తప్ప ఎలాంటి మధ్యవర్తిత్వం వహించలేదట. దానితో తనకు రావాల్సిన ఆస్తి ఇంతవరకు రాలేదు. వైసీపీలో ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని చెప్పేందుకు ఆస్తి వ్యవహారాన్ని ప్రస్తావిస్తున్నానని చంద్రశేఖర్ రెడ్డి అంటున్నారు. మరి రాజమోహన్ రెడ్డి ఇప్పటికైనా కనికరిస్తారో లేదో చూడాలి…

This post was last modified on March 26, 2023 6:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

2 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

3 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

4 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

5 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

6 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

8 hours ago