రాయలసీమలో సాగుతున్న లోకేశ్ పాదయాత్రకు ఆ ప్రాంతంలో మంచి స్పందన కనిపిస్తోంది. అదే సమయంలో పాదయాత్రలో కొత్త ముఖాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వివిధ రంగాలకు చెందినవారు లోకేశ్ పాదయాత్రలో అడుగు కలుపుతున్నారు. పనిలో పనిగా టికెట్లు ఆశిస్తున్న కొత్తవారు కూడా లోకేశ్ దృష్టిలో పడేందుకు, లోకేశ్ను కలిసేందుకు పాదయాత్రను వేదికగా చేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే పాదయాత్రలో లోకేశ్ తో పాటు కలిసి నడుస్తున్నారు.
అయితే, లోకేశ్ పాదయాత్రలో కనిపిస్తున్న కొత్తవారిని చూసి పాత నేతలు, సిటింగ్ ఎమ్మెల్యేలు, గతసారి పోటీ చేసి ఓడిన నేతలు కాస్త కంగారు పడుతున్నారు. కొత్తగా పార్టీలోకి రావాలని చూసేవారు తాము టికెట్ ఆశించే నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలపై ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తున్నారని.. అక్కడి సమస్యలను లోకేశ్ ముందు పెట్టి తమకు చాన్సొస్తే ఏం చేస్తామో చెప్తున్నారని.. ఇదంతా తమకు ఎసరు పెట్టే కార్యక్రమమని సిటింగులు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటికే కొన్ని నియోకజవర్గాలలో గ్రూపులు, టికెట్ల కోసం వర్గపోరు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితులలో కొత్తవారు దొరికితే పార్టీని వారిని ఎంచుకునే ప్రమాదముందని పాత నేతలు టెన్షన్ పడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో డబ్బు సంపాదించినవారు, హైదరాబాద్ బెంగళూరు కేంద్రంగా ఇతర వ్యాపారాలు చేసి ఎన్నికల్లో పోటీచేయాలని ఉవ్విళ్లూరుతున్నవారు, అధికారులుగా పనిచేసి రిటైరైన వారు, ఉద్యోగంలో ఉన్నా టికెట్ హామీ దొరికితే వీఆర్ఎస్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నవారు లోకేశ్ను కలుస్తున్నారు.
పాదయాత్ర మార్గంలో వెలుస్తున్న ఫ్లెక్సీలలోనూ కొత్త ముఖాలు కనిపిస్తుండడంతో స్థానిక నేతలు వాటిని తొలగిస్తున్న సందర్భాలూ ఉంటున్నాయి. ముఖ్యంగా పాదయాత్ర ముగిసిన తరువాత నారా లోకేశ్తో భేటీ అవుతున్నవారిలో ఎక్కువగా టికెట్లు ఆశిస్తున్నవారు ఉంటున్నారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ఔత్సాహికుల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
This post was last modified on March 26, 2023 7:23 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…